-
స్టేట్బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం.. అకౌంటెంట్ స్వప్న ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార ఎస్బీఐలో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారం కనబడకపోవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక మహిళా ఉద్యోగి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. బంగారు ఆభరణాలు గల్లంతుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా అందడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏమిటో తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఫిర్యాదులో నలుగురిని స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు బ్యాంకు అధికారులు, బయట వ్యక్తుల జోక్యంపైనా అనుమానాలుండటంతో పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఈ బాగోతం ఎస్బీఐ బ్రాంచ్లో చోటు చేసుకున్నా జిల్లాలో అన్ని బ్యాంకులు అప్రమత్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగి ఉండొచ్చేమోనని బ్యాంకు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. నమ్మకాన్ని వమ్ము చేసి.. బయట వ్యక్తుల వద్ద బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సొమ్ము తీసుకోవడం శ్రేయస్కరం కాదని చాలా మంది బ్యాంకుల్లో తమ ఆభరణాలను కుదవ పెట్టి సొమ్ము తీసుకుంటారు. ఆ నమ్మకాన్ని గార ఎస్బీఐలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు వమ్ము చేశారు. సూత్రధారులు, పాత్రధారులెవరో విచారణలో తేలనున్నప్పటికీ రూ.4కోట్లకు పైగా విలువైన 7కిలోల బంగారాన్ని మాయం చేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడా ఖాతాదారులంతా గగ్గోలు పెడుతున్నారు. పర్యవేక్షణ డొల్ల.. సాధారణంగా బ్యాంకులో గోల్డ్ లోన్ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. దానికొక అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్న అకౌంటెంట్ ఉంటారు. క్లర్క్ లేదా అప్రైజర్ ఉంటారు. వీరిద్దరు ఖాతాదారుల నుంచి తాకట్టు బంగారాన్ని తీసుకుంటారు. వీరితో పాటు ఇద్దరు కస్టోడియన్లు ఉంటారు. వీరిద్దరి వద్ద స్ట్రాంగ్ రూమ్, సేఫ్ (లాకర్లు)కు సంబంధించిన వేర్వేరు తాళాలు ఉంటాయి. అకౌంటెంట్, క్లర్క్ తీసుకున్న బంగారాన్ని కస్టోడియన్లతో కలిపి సేఫ్లలో భద్రపరుస్తారు. ఆ ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉన్న వేర్వేరు తాళాలను ఉపయోగిస్తే తప్ప భద్రపరచడం గాని, తీయడం గానీ జరగదు. ఇంతటి పకడ్బందీ వ్యవహారం ఉండే బ్రాంచ్లలో దాదాపు 7కిలోల బంగారం పక్కదారి పట్టిందంటే ఇందులో చాలామంది ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బ్రాంచ్లో ఏం జరిగినా సంబంధిత మేనేజర్ బాధ్యత ఉంటుంది. దానితో పాటు ఉన్నతాధికారుల పరిశీలన ఉంటుంది. ఎన్నో సేఫ్లలో ఉన్న బంగారం పెద్ద ఎత్తున మాయమవ్వడంతో బ్రాంచ్ పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది. ఎలా బయటకు వచ్చింది.. గార బ్రాంచిలో బంగారం ఆభరణాలు కుదవ పెట్టిన ఖాతాల బ్యాగులు 2500 వరకు ఉన్నట్టు సమాచారం. అందులో 86 బ్యాగులలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమమ్యాయి. ఓ ఖాతాదారు బ్యాంకుకు తనఖా పెట్టిన బంగారం విడిపించేందుకు వెళ్లగా బంగారం కనబడటం లేదని సమాధానం రావడంతో వ్యవహారం బయటికొచ్చింది. దాంతో అదే రోజు సాయంత్రం మరికొందరు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరి విషయమై మేనేజరు సీహెచ్ రాధాకృష్ణ వద్ద అడుగగా రెండు రోజుల్లో చెబుతామని నచ్చ చెప్పి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ బంగారు ఆభరణాల రుణాల విభాగం బాధ్యతలు చేపడుతున్న అకౌంటెంట్ స్వప్నప్రియను గట్టిగా ప్రశ్నించేసరికి 26బ్యాగులలో ఉన్న రూ. కోటి 75లక్షల బంగారు ఆభరణాలను తెచ్చి ఇచ్చారు. మిగతా 60బ్యాగుల బంగారు ఆభరణాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో బంగారు ఆభరణాలు గల్లంతు వ్యవహారం మిస్టరీగా మారిపోయింది. అంతవరకు వ్యవహారాన్ని గుట్టుగా ఉంచిన అధికారులు తప్పని పరిస్థితుల్లో గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడా కనిపించని 60బ్యాగుల్లో రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి. కీలకమైన వ్యక్తి చనిపోవడంతో దీంట్లో ఉన్న పాత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఇంతవరకు అంతర్గతంగా తేల్చుకుందామని భావించినా పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ కోణంలో పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా, 86బ్యాగుల వ్యవహారం వెలుగు చూడటంతో ఆ బ్రాంచ్లో ఉన్న మిగతా తాకట్టు ఆభరణాల బ్యాగులలో ఏవైనా తేడాలున్నాయా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గారలో జరిగిన ఘటనతో మిగతా ఎస్బీఐ బ్రాంచ్లలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర బ్యాంకులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తమ బ్యాంకుల్లో ఉన్న బంగారు ఆభరణాల భద్రతపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్టేట్బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం గార: మండల కేంద్రంలోని స్టేట్బ్యాంకులో 7 కిలోల బంగారం మాయమైందని ఫిర్యాదు వచ్చిందని స్థానిక సీఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారంలో ఏడు కిలోలు కనిపించడం లేదని, కొందరు బ్యాంకు సిబ్బందిపై అనుమానం ఉందని గురువా రం బ్యాంకు రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదు చేశారని సీఐ పేర్కొన్నారు. బంగారం విలువ రూ. 4 కోట్ల 70 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు అకౌంటెంట్ ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, బంగారం మాయంపై ఆమె పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఉదయం నుంచి గార పోలీస్స్టేషన్లో ఈ కేసు విషయమై ఇన్చార్జి డీఎస్పీ విజయకుమార్, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ ఎన్.సన్యాసినాయుడు, బ్యాంకు ఆర్ఎం రాజు, గార బ్రాంచి మేనేజర్ సీహెచ్ రాధాకృష్ణతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలే కీలకం.. బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమయ్యే సమయంలో లాక్రూంలో ఉన్న సీసీ పుటేజీలే ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకు అధికారులు ఈ పుటేజీలు గమనించారని తెలుస్తోంది. బ్యాంకులో 2500 మంది బంగారం తనఖా పెట్టిన ఖాతాదారులుండగా, వీరిచ్చిన బంగారానికి ఒక్కో ఖాతాకు ఒక్కో బ్యాగు సిద్ధం చేస్తారు. ఈ బ్యాగుల్లో తొలుత 86 మాయమయ్యాయని అధికారులు గుర్తించగా, వీటిలో 26 బ్యాగులను అకౌంటెంట్ స్వప్నప్రియ మూడు రోజు ల కిందట బ్యాంకు అధికారులకు అందించినట్టు తెలిసింది. మిగిలిన 60 బ్యాగుల వివరాలు ఆధారంగా 7 కేజీల బంగారం ఆభరణాలు మాయమయ్యాయమని నిర్ధారించారు. నవంబర్ 24వ తేదీన బంగారం మాయమైందన్న ఆరోపణలు రాగా ఇప్పటివరకు అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆర్ఎం రాజును ప్రశి్నస్తే సమాధానం దాట వేశారు. -
పనిలో పనిఘా.. ఛేదన వడిగా!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాను నిఘా నీడలోకి తెచ్చేందుకు జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అందుకోసం జాతీయ రహదారులు మొదలు గ్రామీణ రోడ్ల వరకు, పట్టణాలు నుంచి పంచాయతీల దాకా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నేరుగా స్థానిక పోలీస్స్టేషన్లు, జిల్లా కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేశారు. దీంతో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ద్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాల సేకరణ, నిందితులను పట్టుకోవడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాలు తక్కువగా నమోదు అవుతున్నాయని, ఒక వేళ జరిగినా నిందితులను వెంటనే పట్టుకోవడానికి వీలవుతోందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో 22 కీలకమైన కేసులను పోలీసుల ఛేదించారు అంటే వీటి పనితీరును ఆర్ధం చేసుకోవచ్చు. జిల్లా ఏర్పాటు తర్వాత 1,530 కెమెరాలు... పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వై.రవిశంకర్రెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సున్నితమైన ప్రాంతమైన పల్నాడులో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి ముమ్మరంగా ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు, కమాండ్ సెంటర్ల ఏర్పాటు అయ్యేలా చూశారు. 17 నెలల కాలంలోనే జిల్లాలోని 522 కీలక ప్రాంతాల్లో కొత్తగా 1,530 కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. వీటికి అదనంగా ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, నివాస సముదాయాల్లో ఆయా యాజమాన్యాలు, స్వచ్చంధ సంస్థలతో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా అవగాహనకల్పించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు, వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యతగా స్వీకరించాలి నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 17 నెలల కాలంలో కొత్తగా 1,530 కెమెరాలను ఏర్పాటుచేశాం. నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్లలో పలు కీలకకేసులను సీసీ కెమెరాల ద్వారా ఛేదించాం. ప్రతి గ్రామంలో కనీసం కీలకవై ున ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు పోలీసుశాఖ కృషి చేస్తోంది. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పట్టాయి. దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నాం. – వై రవిశంకర్రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ జిల్లా ఏర్పడినప్పటి నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య... నరసరావుపేట 195 516 సత్తెనపల్లి 211 798 గురజాల 116 216 జిల్లా మొత్తం 522 1,530 -
సిటీపై కమాండ్.. నేరగాళ్లపై కంట్రోల్!
హైదరాబాద్: ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం...స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం...వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం... విపత్కర పరిస్థితుల్లో సత్వర స్పందన... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్). బంజారాహిల్స్లోని ఐసీసీసీ లో ఇదీ ఓ అంతర్భాగమే. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం ఆవిష్కరించిన ‘2306 సేఫ్ సిటీ ప్రాజెక్టు సీసీ కెమెరాలు’ ఈ కోణా ల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. వీటిలో కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి. ‘ప్లేటు’ మారితే పట్టేస్తుంది... నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెబుతుంది. ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ద్వారా ఆర్టీఏ సర్వర్తో అనుసంధానించి ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. వాహన ‘మార్గాలను’ చెప్పేస్తుంది... నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి రానుంది. 250 జంక్షన్లలో ఉండే సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్తో సహా చిత్రీకరించి సర్వర్లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతుంది. సీసీసీలోని సిబ్బంది తేదీ, వాహనం నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు.. ఆయా రోజుల్లో సదరు వాహనం ఎక్కడ నుంచి నగరంలోకి ప్రవేశించింది? ఏ సమయంలో ఎక్కడ ఉంది? ఏఏ మార్గాల్లో ప్రయాణించింది? ఎక్కడెక్కడ ఆగింది? తదితర అంశాలను తెలియజేస్తుంది. కిడ్నాప్, స్నాచింగ్ వంటి నేరాలు జరిగినప్పుడు ఈ వ్యవస్థ అందించే ఆధారాలు కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. జంక్షన్ల వారీగా వాహన కౌంటింగ్... ప్రతి చౌరస్తా నుంచి నిమిషనిమిషానికీ ముందుకు సాగే వాహనాలను లెక్కించే ప్రక్రియ సైతం ఐటీఎంఎస్లోని సాఫ్ట్వేర్స్లో ఉన్నాయి. ఓ నిమిషం కాలంలో సదరు జంక్షన్ను ఎన్ని వాహనాలను దాటాయి? వాటిలో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు, బస్సులు ఎన్ని? అనే అంశాన్ని ప్రత్యేక పరికరాల ద్వారా సాఫ్ట్వేర్ లెక్కిస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీసీసీలో ఉండే సిబ్బందికి తెలియజేస్తుంది. ఫలితంగా ఆయా సమయాల్లో ఏఏ రూట్లు బిజీగా ఉన్నాయో తెలుసుకునే సిబ్బంది ఆ విషయాన్ని జంక్షన్లలో ఉండే ప్రత్యే క బోర్డుల ద్వారా వాహనచోదకులకు అందిస్తారు. వీఎంఎస్లతో నిరంతరం సందేశాలు... ఐటీఎంఎస్ ద్వారా ప్రతి జంక్షన్లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్లు(వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు) ట్రాఫిక్ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్ల్లో ప్రదర్శితమవుతాయి. ఉల్లంఘనులకు ‘ఈ’ చెక్... జంక్షన్లలో ఉన్న ఫ్రీ–లెఫ్ట్ను ఉల్లంఘిస్తూ ఆయా చోట్ల వాహనాలు ఆపినా... వన్వే నిబంధనను ఉల్లంఘించినా, వాహనాలు రాంగ్ రూట్లలో దూసుకువస్తున్నా... ప్రస్తుతం ఆయా చోట్ల ఉండే క్షేత్రస్థాయి పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఐటీఎంఎస్ వ్యవస్థలో అన్ని జంక్షన్లతో పాటు రాంగ్రూట్, వన్వే ఉల్లంఘన అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సర్వర్తో అనుసంధానించి ఉండే ఈ కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తారు. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. దీంతో పాటు నో–పార్కింగ్, కమ్యూనిటీ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ ప్రాంతాలనూ జీయో ట్యాకింగ్, ఫెన్సింగ్ ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఐసీసీసీ ఆధీనంలో ఏ కెమెరాలు ఎన్నంటే..? ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాక్స్, పీటీజెడ్, ఏఎన్పీఆర్ కెమెరాలు 10 వేలు నగర వ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లోనివి 126 మూడు కమిషనరేట్లలోని 2828 జంక్షన్లలోనివి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసి 38 ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు నేను సైతం, కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద ఏర్పాటైన 4,99,869 (అవసరమైనప్పుడు యాక్సస్ చేయవచ్చు) జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న గస్తీ వాహనాలకు ఏర్పాటు చేసినవి 1322 ట్రాఫిక్ నిర్వహణతో పాటు నేరగాళ్లకూ చెక్ దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా రికార్డు -
మల్లన్నా.. ఏదీ రక్షణ?
కొయురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీసీ కెమరాలకు సంబంధించిన సిస్టం(ఎన్వీఆర్) ధ్వంసమైంది. దీంతో దేవాలయంలోని 32 కెమెరాలు పని చేయడం లేదు. గుడి పరిసరాలలో పనిచేసే సీసీ కెమెరాల సిస్టం యూనిట్ను ఏఈవో గదిలో అమర్చారు. ప్రస్తుతం దీనిని పగులకొట్టడంతో సీసీ కెమెరాలు పని చేయక నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కరువైంది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుందని టెక్నీషియన్ చెబుతున్నాడు. దీంతో ఆలయంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గొడవ గురించి సీసీ ఫుటేజీ తీసుకుందామని మంగళవారం టెక్నీషియన్ను పిలిపించగా ఎన్వీఆర్ ధ్వంసమైన విషయం తెలిసింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి ఉద్యోగులే సీసీ కెమెరాల సిస్టం యూనిట్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఈయనకు, ఏఈఓ అంజయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement