-
క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి
వైఎస్సార్జిల్లా (జమ్మలమడుగు) : రాయలసీమ ప్రాంతంలో మొదటి ప్రజా సేవకోసం ఏర్పాటు చేసిన వైద్యశాల క్యాంబెల్ వైద్యశాల.1896లో లండన్ మిషనరీ ఆధ్వర్యంలో డాక్టర్ క్యాంబెల్ రోగులకు వైద్య సేవలు చేయడం కోసం ఆసుపత్రిని ప్రారంభించారు. నాటి నుంచి ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ రాయలసీమలో పెద్దాసుపత్రిగా పేరుగాంచడంతో అనంతపుర,కర్నూల్ కడప తదితర ప్రాంతాలనుంచి రోగులు వైద్యం కోసం వచ్చెవారు. దాదాపు 75 సంవత్సరాల పాటు తన వైభవాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు జన్మించిన ఆసుపత్రి... జమ్మలమడుగులోని క్యాంబెల్ఆసుపత్రిలో ఇద్దరు ముఖ్యమంత్రులు జన్మించారు. వైఎస్ రాజరెడ్డి, జయమ్మ దంపతులకు కుమారుడైన వైఎస్ రాజశేఖర్రెడ్డి జన్మించింది క్యాంబెల్ ఆసుపత్రిలోనే. అంతేకాకుండ ఆయన వైద్య వృత్తిని పూర్తి చేసుకోని ఒక ఏడాది పాటు క్యాంబెల్ ఆసుపత్రిలో డాక్టర్గా కూడా రోగులకు వైద్యం అందించారు. అంతేకాకుండ వైఎస్ రాజశేఖర్రెడ్డి, విజయమ్మ దంపతుల సంతానం.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల కూడా క్యాంబెల్ ఆసుపత్రిలోనే జన్మించారు. -
అపు‘రూపం’!
సాక్షి ప్రతినిధి, కడప : విశ్వసనీయతే ప్రామాణికంగా రాజకీయాలు నెరిపిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే నెరవేర్చాలని తపించేవారని విశ్లేషకులు సైతం కొనియాడుతుంటారు. మెడిసిన్ పూర్తి కాగానే జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. ఆ తర్వాత పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరున 30 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు. అనతి కాలంలోనే పేదల డాక్టర్గా, రూ.2 వైద్యునిగా గుర్తింపు పొందారు. తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20వేల 496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి నుండి 2009 వరకు ప్రతిసారి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఓటమెరుగని ధీరుడిగా చరిత్రకెక్కారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, మరో రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదవులను అలంకరించారు. ఏపదవి చేపట్టినా అందులో రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారని విశ్లేషకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్కు జీవం పోసిన ప్రజాప్రస్థానం.... వరుసగా రెండు పర్యాయాలు అధికారం కోల్పోయి అధఃపాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానాన్ని రూపొందించారు. కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజల దరికి చేరేందుకు సీఎల్పీ నేతగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి పదవి దివంగత నేత వైఎస్సార్ను వరించింది. 2004 మే 14న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు ఉచిత విద్యుత్, పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలు రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, పావలా వడ్డీ రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్కార్డులు జారీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఙం, 108, 104 వైద్య సేవలు, కిలో రూ.2 బియ్యం, ట్రిపుల్ ఐటీల ఏర్పాటు, రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు, ఒకటేమిటి, అన్ని వర్గాల వారికి అనువైన పథకాలను రూపొందించారు. అలాగే వాటి అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అమలయ్యేలా కృషి చేశారని ప్రత్యర్థులు సైతం కొనియాడారు. 2009 ఎన్నికల్లో విశ్వసనీయత పేరుతో బరిలో దిగిన ఆయన 156 అసెంబ్లీ స్థానాలను, 33 పార్లమెంటు స్థానాలను ఒంటిచేత్తో గెలిపించుకున్నారు. 2009 మే 20న మరోమారు ముఖ్యమంత్రిగా ప్రజలమధ్యనే ప్రమాణస్వీకారం చేపట్టారు. ప్రభుత్వ పథకాల తీరు తెన్నులను పరిశీలించేందుకు రచ్చబండ కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళుతూ 2009 సెప్టెంబర్ 2న పంచ భూతాల్లో ప్రజానేత ఐక్యమయ్యారు. జిల్లాపై ప్రత్యేక ముద్ర.... వైఎస్సార్ జిల్లా మూడున్నర దశాబ్ధాల క్రితం నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని జిల్లా నలుమూలలా పరుగులు పెట్టించారు. 2004-09 వైఎస్ యుగంలో సమగ్రాభివృద్ధి దిశగా జిల్లాను పయనింపచేశారు. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్గా, రాయచోటి, పులివెందుల,జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జె.ఎన్.టియు ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ అసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్ ఐటీ, ఐ.జి కార్ల్ పశు పరిశోధన కేంద్రం, దాల్మీయా, భారతి సిమెంటు కర్మాగారాలు, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్, సజ్జల పాలిమర్స్, బ్రహ్మణీ స్టీల్స్, లాంటి పరిశ్రమలను నెలకొల్పారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో పరుగులు పెట్టించారు. సుమారు రూ.12వేల కోట్లతో జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరదకాల్వ,గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగు గంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహానేత 66వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజానీకం సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement