-
హిందూ ద్రోహి సీఎం చంద్రబాబు!
కడప కల్చరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిందూ ద్రోహిగా మారాడని వీహెచ్పీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రహదారుల నిర్భంద కార్యక్రమాన్ని అమలు కాకుండా పోలీసులు ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. సాయంత్రం ఆయన పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాను రాను మతాల మధ్య చిచ్చుపెడుతూ హిందు మత ద్రోహిగా మారుతున్నాడని దుయ్యబట్టారు. సమస్యకు కారణమైన వారిని వదిలి ధర్మాగ్రహం వ్యక్తం చేసిన పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడం ఏం న్యాయమో ఆయనే చెప్పాలన్నారు. హిందూ దేశంలో ప్రజలు విశ్వసించే ధర్మాలకు ప్రమాదం వాటిల్లుతోందని మనం హిందూ దేశంలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. సంఘ విద్రోహశక్తిగా మారుతున్న సీఎం చంద్రబాబును రానున్న ఎన్నికల్లో మట్టి కరిపించేందుకు హిందువులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిందూ ద్రోహి చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడే సమ యం ఆసన్నమైందని హెచ్చరించారు. పోలీసులు రామకృష్ణారెడ్డితోపాటు బీజేపీ నాయకుడు బైరెడ్డి మధుసూదన్, పెసల సాంబశివారెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు కిస్టిపాటి వెంకట్రామిరెడ్డి, ఆగ్రోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్నక్రిష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నళ్లోల్ల రాజారాం, బిజేపీ ఓబీసీ సంఘం అధ్యక్షుడు దుర్గం దస్తగిరి తదితరులు అరెస్టు చేశారు. -
నాపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయండి
హైకోర్టులో బెరైడ్డి రాజశేఖరరెడ్డి పిటిషన్ హైదరాబాద్: తనపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు నమో దు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో అభ్యర్థించారు. గురువారమే పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సమయాభావం వల్ల విచారణకు రాలేదు. బెరైడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం మరోసారి న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. -
బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు
హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖరరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బెరైడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థులకు అధ్యక్షుడి హోదాలో బీ ఫాం ఇవ్వాల్సి ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న బెరైడ్డి అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పార్టీ ఉపాధ్యక్షుడు కూడా బీ ఫాం ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పగిడియాల మండలంలోని మచ్చుమర్రి గ్రామానికి చెందిన తెలుగు సాయిఈశ్వరుడు గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక బెరైడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొం దరు ఉన్నారంటూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏడుగురు నిందితులపై కర్నూలు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెరైడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను జస్టిస్ రెడ్డి కాంతారావు మంగళవారం విచారించారు. బెరైడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కావాలనే పిటిషనర్ను ఈ కేసులో ఇరికించారన్నారు. ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్కుమార్ దేశ్పాండే తోసిపుచ్చారు. బెరైడ్డిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. నిజంగా ఆయన పాత్ర లేకుంటే ఈపాటికే లొంగిపోయి ఉండేవారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఈ ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుందని నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించారు. -
రాజధాని సీమలోనే ఉండాలి : బైరెడ్డి రాజశేఖర రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు రాజధాని ఎంపిక రాయలసీమనుంచే జరగాలని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) విజ్ఞప్తి చేసింది. ఆర్పీఎస్ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇదే డిమాండ్తో ఆర్పీఎస్ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు బెరైడ్డి తెలిపారు. -
బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై దాడి, వాహనం ధ్వంసం
రాయలసీమ నేత, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడంతో తిరుపతి సమీపంలోని వరదాయపాలెంలో స్థానికులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళుతున్న ఆటో సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఆటో డ్రైవర్ ను బైరెడ్డి డ్రైవర్ చితకబాదారు. డ్రైవర్ పై దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు బైరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్ ను స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. స్థానికులు జరిపిన దాడిలో బైరెడ్డి డ్రైవర్ కు తీవ్రగాయలైనట్టు సమాచారం. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపైనా స్థానికులు దాడి చేసినట్టు తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement