-
Bapatla Agricultural College: తల్లీ! నీ కీర్తి అజరామరం
తల్లీ... నీకు 75 సంవత్సరాలు. నీ ఒడిలో అక్షరాలు దిద్దుకున్న ఎందరో నీ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేశారు. అంతర్జాతీయ వ్యవసాయరంగ చిత్ర పటంలో నిన్ను నిలిపారు. సముచిత స్థానం కల్పించి నిన్ను గర్వపడేలా చేశారు. వరిలో జయ, హంసలతో శాస్త్రి, సాంబ మాషూరితో ఎం.వి. రెడ్డి; స్వర్ణతో రామచంద్రరావులు సుపరిచితులు. జొన్న పంటకు జీవం తెచ్చిన గంగా ప్రసాదరావు, చిరుధాన్యాలను ఇంటి పేరు చేసుకున్న హరి నారాయణలు నీ బిడ్డలే. మీ పిల్లలు మామూలు వాళ్ళు కారు. కాలాన్ని బట్టి, పంటలను శాసించి, వాటిలో మార్పులు తెచ్చి రైతుకు భరోసా ఇచ్చారు. చెరకును పీల్చి పిప్పి చేసి రైతుకు తియ్యని రసం అందించిన కోటికలపూడి నుంచి జరుగుల దాకా అందరూ నీ చనుబాలు తాగిన వారే. నరసింహ, బ్రహ్మ, ప్రత్తి రవీంద్ర నాథ్ నుండి జెన్నీ జాదు జాక్పొట్ వరకు... ఇలా చెప్పుకుంటూ పోతే నీ పిల్లల ఘన చరిత అనంతం. నేర్పిన విద్య, సంపద అంతా సమాజానికి సమంగా చెందాలనే ఉన్నత ఆశయంతో వెన్నెల పంచిన వేమూరి చంద్ర శేఖరుడు, ప్రాణత్యాగం చేసిన గోపబోయిన ప్రసాద్లు కూడా నీ ఒడిలో అక్షరాలు దిద్దినవారే. నీ 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఒక కమనీయ దృశ్య రూపకంగా మలచి దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన బొగ్గవరపు, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ద్వారా ఒక సంవత్సర కాలం పాటు నీ స్వర్ణోత్సవ గీతం ఆలపించిన ఈలప్రోలు, వాతావరణ మార్పులకు సంబంధించి విశ్వానికంతటికీ సలహాలు, సూచనలు ఇస్తున్న శివుడూ, శ్రీనివాసుడూ ఇద్దరూ నీ పిల్లలే కావటం ఒకింత గర్వకారణమే కదా! కనుచూపు మేర పరిపాలన, శాంతి భద్రతలు, పర్యా వరణం, అడవులు, రైల్వేలు, గనులు, మీడియా, కస్టమ్స్, ఆదాయ పన్ను, బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సామాజిక, సేవారంగాలలో ఆరితేరిన మెరికలుగా గుర్తింపు పొందిన వారంతా నీ ఒడిలో పెరిగిన పిల్లలే. అయ్యంగార్ ఇండోర్ స్టేడియం ఇచ్చారు. గోవింద రాజులు నాబార్డ్ తరపున ఓ పెద్ద భవనం ఇచ్చారు. కరోనా ప్రభావం తగ్గాక నీ పిల్లలు ప్రత్యేక రీతిలో సావనీర్లు తెస్తున్నారు. 1962, 1969, 1972, 1997, 1977, 1978 బ్యాచ్లు వారి వారి అనుభవాలను కలబోసుకున్నారు. అంతకుముందే 1964 వారు ప్రచురించిన సావనీర్ అందరికీ రోల్ మోడల్ అయింది కూడా. కరోనా అంటే నీ కెందుకు భయం. కరోనాకు చెక్ పెట్టేందుకు సీసీఎంబీ తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకా శాస్త్రవేత్తల బృంద నాయకులు నాళం మధు... బాపట్ల ఒడిలో నీవు లాలించిన బిడ్డే కదమ్మా. పిల్లలు అంతా ఇలా ఒకరిని చూసి మరొకరు గుంపులు గుంపులుగా కలుస్తూ ప్రస్తుతం కళాశాలలో ఉన్న నాలుగు బ్యాచ్లకూ స్ఫూర్తినిచ్చేందుకు ప్లాటినం జూబిలీ ముగింపునకు తరలి వస్తున్నారు. గత వైభవం అంతా ఈ తరానికి అందించి, వారూ స్ఫూర్తి పొంది, మంచి భవిష్యత్కు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారని. అందుకే అమ్మా... నీ బిడ్డలు వారి వారి బ్యాచ్ల పేరుతో గోల్డ్ మెడల్స్ ఏర్పాటు చేసింది. తప్పులుంటే మమ్ము క్షమించు తల్లీ! – వలేటి గోపీచంద్, 1980 బ్యాచ్ విద్యార్థి (రేపు బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబిలీ ఉత్సవాల ముగింపు వేడుక) -
బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: జిల్లాలోని బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్ధులు ఆందోళకు దిగారు. కాలేజీ యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. వారం రోజులుగా తమ సమస్యలు పరిష్కంచాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో తరగతులను బహిష్కరించిన విద్యార్థులు. విద్యార్థులతో యాజమాన్య చర్చలు విఫలం కావడంతో ఈ నెల 27 వరకు సెలవులు ప్రకటించిన కాలేజీ యాజమాన్యం. విద్యార్థులను హాస్టల్ నుంచి బలవంగతంగా ఖాళీ చేయిస్తున్నారు. తమ సమస్యలు తీర్చే వరకు తాము ఎక్కడికి వెళ్ళమని ప్రాంగణంలోనే ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
బాపట్ల వ్యవసాయ కళాశాలకు నిరవధిక సెలవులు
గుంటూరు: ఇప్పటికిప్పుడు కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటిస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కర్ణాటక, మణిపూర్, కేరళ, త్రిపుర, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల విద్యార్థులు ఐసీఏఆర్ ద్వారా ఎంపికై బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల ఈ కళాశాలలో ఏజీ ఎమ్మెస్సీ విద్యార్థి ఎం.సూర్యారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారణకు సంబంధించిన నివేదికను తమ సమక్షంలోనే తయారు చేసి యూనివర్సిటీకి అందించాలంటూ తోటి విద్యార్థులు పట్టుబట్టారు. అందుకు కమిటీ సభ్యులు నిరాకరించారు. దాంతో విద్యార్థులు గత నాలుగు రోజులుగా కళాశాల అతిథి గృహం ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కళాశాలలోని హాస్టళ్లకు, మెస్కు తాళాలు వేయించారు. దూరప్రాంతాలకు చెందిన తాము ఇళ్లకు వెళ్లాలంటే ముందుగా ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికిప్పుడు సెలవు ప్రకటించి... ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని ఆదేశిస్తే తాము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా వెళ్లాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ఆర్.కె.ప్రసాద్ను వివరణ కోరాగా యూనివర్సిటీ అధికారుల నిర్ణయం మేరకే తాము నడుచుకుంటున్నామని తెలిపారు. యాజమాన్యం ఏదీ చెబితే అది చేస్తామని ఆయన సమాధానం చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement