-
పిల్లల పెంపకంలో టెన్షన్
పిల్లల పట్ల తల్లికి ఉండే ప్రేమను, బాధ్యతను, వాత్సల్యాన్ని కలగలిపి ‘మాతృత్వం’ అంటుంటారు. ఇంగ్లిష్లో ‘మదర్హుడ్’. ఈ మాతృత్వం గొప్పదని, వరమని అంటూ తల్లి చుట్టూ బంధాలు బిగించారా? పిల్లల పెంపకంలో వొత్తిడి మదర్హుడ్ను మెంటల్హుడ్గా మార్చిందా? బాలాజీ టెలిఫిల్మ్స్ తీసిన కొత్త వెబ్సిరీస్ ‘మెంటల్హుడ్’ ఆ విషయాన్నే చర్చిస్తుంది. భర్తలు బయటికెళ్లి సంపాదించుకుని రావాలి, భార్యలు ఇంటి పట్టున ఉండి పిల్లల ఆలనా పాలనా చూడాలి అనేది అనాదిగా ఉన్న భారతీయ సంప్రదాయం. ‘రోజంతా ఇంట్లో ఉంటావ్ కదా... ఏం చేస్తుంటావ్?’ అని అనే భర్తలు ఇప్పుడూ ఎప్పుడూ ఉండనే ఉంటారు. భార్యను పుట్టింటికి పంపి, పిల్లలతో ఒకరోజు ఇంట్లో గడిపితే తెలుస్తుంది రోజంతా ఇంట్లో ఉండి భార్య ఏం చేస్తుందో. పిల్లలను రోజూ నిద్ర లేపి, రెడీ చేసి, టిఫెన్లు తినిపించి, స్కూళ్లకు పంపే పని తండ్రులు ఎంతమంది చేస్తారు ఇళ్లల్లో అనేది ఎవరికి వారు ఆలోచించుకుంటే తల్లులు పడే వొత్తిడి తెలిసి వస్తుంది. నిత్య జీవితంలో సమస్యలు అన్నీ సినిమా ఫార్ములాకు తగినట్టుగా ఉండవు. అందుకే చాలా విషయాలు పెద్ద తెర మీద కనిపించవు. థ్యాంక్స్ టు వెబ్ సిరీస్. వెబ్ కంటెంట్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రకరకాల స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చాక తప్పనిసరై ఇంటి సమస్యల పై కూడా దృష్టి పడుతోంది. ఇప్పుడు తాజాగా బాలాజీ టెలిఫిల్మ్స్ ఏక్తా కపూర్ నిర్మాణంలో ‘మెంటల్హుడ్’ వెబ్ సిరీస్ను తయారు చేసింది. మార్చిలో ‘జీ5’లో ఈ సిరీస్ టెలికాస్ట్ కానుంది. హిందీలో పేరున్న స్టార్స్– కరీష్మా కపూర్, డినో మారియా, సంజయ్ సూరి తదితరులు ఇందులో నటించారు. మెంటల్హుడ్ కథ ప్రధానంగా ఐదుగురు తల్లుల చుట్టూ తిరుగుతుంది. వీరితో పాటు ఒక ‘హౌస్ హజ్బెండ్’ కూడా ఉంటాడు. హౌస్ హజ్బెండ్ అంటే భార్య ఉద్యోగానికి వెళితే ఇంట్లోనే ఉండి పిల్లల బాగోగులు చూసుకునే తండ్రి అనమాట. ఈ ఆరుగురు తమ పిల్లల జీవితాలను ఎలా డీల్ చేశారనేది కథ. ఇందులో కరీష్మా ముగ్గురు పిల్లల తల్లిగా నటించింది. ఈమె సగటు గృహిణి. పిల్లలు పెంచే వొత్తిడిని భర్త ఏ మాత్రం పంచుకోడు. ఆమె ఏం చేయాలి? మరో తల్లి ‘వర్కింగ్ మదర్’గా ఉంటూనే తన మాతృత్వానికి పూర్తి న్యాయం చేయాలని పెనుగులాడుతూ ఉంటుంది. ఒక తల్లి తన పిల్లలకు కేవలం ఆల్టర్నేట్ మెడిసిన్ వాడాలని, వాళ్లు ఆర్గానిక్ ఫుడ్ తినాలని అనుకుంటూ ఉంటుంది. వీళ్లలో ఒక పాపను స్కూల్లో మోలెస్ట్ చేస్తారు. ఆ వొత్తిడి ఎలా ఎదుర్కోవాలి?... ఇవన్నీ సమస్యలు. మన వొడిలో కూచుని ఆడుకుని ఎదిగిన పిల్లలే వయసు పెరిగే కొద్దీ అభిప్రాయాలు పెంచుకుని, అంచనాలు తెచ్చుకుని తల్లిని ప్రేమించాలా ద్వేషించాలా అనేవరకు ఈ మదర్హుడ్ వెళుతుంది. ప్రతి కుటుంబం తనను తాను చూసుకునే ఈ వెబ్ సిరీస్కు దర్శకురాలు కూడా స్త్రీయే. కరిష్మా కోహ్లి. కనుక స్త్రీల దృష్టికోణంలో పిల్లల పెంపకాన్ని ఈ సిరీస్ గట్టిగా చర్చకు పెడుతుందని చెప్పవచ్చు. -
‘మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా..!?’
ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా ఒకటేమిటి వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్కు.. ‘క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్’ అనే బిరుదు ఎప్పుడో కట్టబెట్టేశారు ఆమె అభిమానులు. కానీ ఇప్పుడు ఆ అభిమానులే ఏక్తాకు అస్సలు టేస్ట్ లేదంటూ పెదవి విరిచేస్తున్నారు. ఇందుకు ఆమె నిర్మించే సీరియళ్లు మాత్రమే కారణం కాదు. అసలు విషయమేమిటంటే... ఓ ప్రముఖ హిందీ చానల్లో ప్రసారమవుతోన్న ‘యే హై మొహబ్బతే’ సీరియల్ 15 వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏక్తా కపూర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో స్లీవ్లెస్ మెరూన్ రఫెల్ గౌనుకు జోడీగా బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించిన ఏక్తా.. బ్లాక్ హీల్స్ వేసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఏక్తా నెటిజన్ల చేతికి చిక్కారు. ఇంకేముంది అప్పటి నుంచి ఏక్తా డ్రెస్ గురించి తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ‘సాగతీత కథనాలతో చిరాకు తెప్పించినా సహిస్తామేమో గానీ.. మీరు ఇలా ఉండటాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాం.. డైనింగ్ హాలు నుంచి వస్తూ వస్తూ కర్టెన్ కప్పుకచ్చుకున్నారా ఏంటి? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఎంత డబ్బు ఉంటే ఏం లాభం..కనీసం ఓ స్టైలిస్ట్ను ఐనా పెట్టుకోవచ్చుగా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరో అభిమాని స్పందిస్తూ.. ‘మా అభిమాన తార ఫ్యాషన్ ఐకాన్గా ఉండకపోయినా ఫర్వాలేదు.. మరీ ఇంత దారుణంగా ఉంటే మాత్రం సహించలేమంటూ’వాపోయాడు. అయితే ఏక్తాకు ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా లాజిక్ లేని మాటలు, వెరైటీ డ్రెస్సులతో ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. The queen of tv land arrives #ektakapoor for #yehhainmohabatein 1500 episodes celelberations @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Jul 25, 2018 at 11:06am PDT -
అదరగొట్టిన రిలయన్స్
లాభం 28% పెరుగుదల... క్యూ1లో రూ. 9,108 కోట్లు... ఆదాయం రూ. 90,537 కోట్లు; 27 శాతం వృద్ధి ♦ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల జోరు... ♦ స్థూల రిఫైనింగ్ మార్జిన్ 11.9 డాలర్లు... ♦ రూ. 20 వేల కోట్లు సమీకరించనున్న జియో ♦ నేడు ఏజీఎం; ముకేశ్ అంబానీ ప్రసంగం ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. కంపెనీ ఈ ఏడాది తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో రూ.9,108 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,113 కోట్లతో పోలిస్తే 28 శాతం ఎగబాకింది. ఒక క్వార్టర్లో ఇంత అత్యధిక లాభం ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, క్యూ1 లాభంలో రూ.1,087 కోట్ల అసాధారణ రాబడి (గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్లో వాటా విక్రయం ద్వారా) కూడా కలిసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ వన్టైమ్ రాబడిని తీసేస్తే లాభం రూ.8,021 కోట్లుగా లెక్కతేలుతుంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.90,537 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.71,451 కోట్లతో పోలిస్తే... 26.7 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ వ్యాపారాల జోరు కంపెనీ లాభాలు పుంజుకోవడానికి దోహదం చేసింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో ఆర్ఐఎల్రూ.7,960 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు. తొమ్మిదేళ్ల గరిష్టానికి రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం)... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) జూన్ క్వార్టర్లో 11.9 డాలర్లకు ఎగబాకింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గతేడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లు. దీంతో పోలిస్తే 3.5 శాతం పెరిగింది. కాగా, క్యూ1లో రిలయన్స్ జీఆర్ఎం 11 డాలర్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్ఎంగా వ్యవహరిస్తారు. రంగాల వారీగా చూస్తే... పెట్రోకెమికల్స్: ఈ కీలక విభాగం ఆదాయం క్యూ1లో రూ.25,461 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.20,718 కోట్లతో పోలిస్తే... 23% ఎగబాకింది. స్థూల లాభం(పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు–ఎబిటా) 44% భారీ వృద్ధితో రూ.2,806 కోట్ల నుంచి రూ.4,031 కోట్లకు దూసుకెళ్లింది. ఎబిటా మార్జిన్ 15.8%తో ఆల్టైమ్ గరిష్టస్థాయిని నమోదు చేసింది. రిఫైనింగ్: మరో కీలక వ్యాపారమైన ఈ విభాగంలో ఆదాయం రూ. 56,568 కోట్ల నుంచి రూ.66,945 కోట్లకు పెరిగింది. 18.3 శాతం వృద్ధి చెందింది. స్థూల లాభం రూ.6,593 కోట్ల నుంచి రూ.7,476 కోట్లకు ఎగసింది. 13.3 శాతం వృద్ధి నమోదైంది. చమురు–గ్యాస్: ఈ విభాగంలో ఆదాయం 1.2 శాతం తగ్గుదలతో రూ.1,340 కోట్ల నుంచి రూ.1,324 కోట్లకు చేరింది. స్థూల నష్టం రూ.373 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ1లో స్థూల నష్టం రూ.312 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర ఎగబాకినట్లు లెక్క. ప్రధానంగా కేజీ–డీ6 క్షేత్రాల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోతూ వస్తుండటం నష్టాలు పెరిగిపోయేందుకు కారణమవుతోంది. రిటైల్: ఈ విభాగంలో ఆదాయం భారీ స్థాయిలో 73.5% దూసుకెళ్లింది. క్రితం ఏడాది క్యూ1లో రూ.6,666 కోట్ల నుంచి ఈ ఏడాది క్యూ1లో రూ.11,571 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.148 కోట్ల నుంచి రూ.292 కోట్లకు ఎగబాకింది. 97.3% వృద్ధి నమోదైంది. టెలికం: గతేడాది సెప్టెంబర్లో కార్యకలాపాలను ప్రారంభించిన రిలయన్స్ జియో టెలికం విభాగం ఆదాయం, స్థూల లాభాలను కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే, ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్లకుపైగా యూజర్లను దక్కించుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా జియో నిలిచిందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో యూజర్లకు బిల్లింగ్ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, నేడు(శుక్రవారం) జరగనున్న కంపెనీ ఏజీఎంలో జియోకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.25,192 కోట్ల మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో ఖర్చు చేసింది. ⇔ ఇతర ఆదాయం రూ. 2,124 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ1లో ఈ మొత్తం రూ. రూ.2,378గా ఉంది. ⇔ కంపెనీ మొత్తం రుణ భారం జూన్ చివరి నాటికి రూ.2,00,674 కోట్లకు ఎగబాకింది. మార్చి చివరికి ఇది రూ.1,96,601 కోట్లు. ⇔ ఇక నగదు నిల్వలు జూన్ ఆఖరినాటికి రూ.72,107 కోట్లకు తగ్గాయి. మార్చి చివరికి ఈ మొత్తం రూ.77,226 కోట్లు. ⇔ ఇజ్రాయెల్కు చెందిన జెరూసలెం ఇన్నోవేషన్ ఇంకుబేటర్(జీఐఐ) అనే సంస్థలో 2.5 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ మొత్తానికిగాను జేఐఐలో 20% వాటా దక్కుతుందని తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఫిన్టెక్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సంబంధిత ప్రారంభస్థాయి స్టార్టప్లలో జేఐఐ పెట్టుబడులు పెడుతుంది. ⇔ గురువారం బీఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు స్వల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.1,529 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. బాలాజీ టెలి ఫిల్మ్స్లో 25 శాతం వాటా కొనుగోలు... మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ బాలాజీ టెలిఫిల్మ్స్లో 24.92 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోనుంది. ఈ ప్రతిపాదనకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఇందుకోసం రిలయన్స్ దాదాపు రూ.413 కోట్లను చెల్లించనుంది. కాగా, రిలయన్స్కు ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా (షేరు రూ.164 చొప్పున) 2.52 కోట్ల షేర్లను కేటాయించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని బాలాజీ టెలిఫిల్మ్స్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఈ లావాదేవీ ద్వారా లభించనున్న మొత్తాన్ని కంటెంట్ డెవలప్మెంట్కు ఉపయోగించనున్నట్లు పేర్కొంది. తమ కంపెనీలో రిలయన్స్ భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని బాలాజీ టెలిఫిల్మ్స్ చైర్మన్ జితేంద్ర కపూర్ వ్యాఖ్యానించారు. గురువారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర 1.74 శాతం నష్టంతో రూ. 187 వద్ద ముగిసింది. అయితే, గతనెల 28న రూ.130గా ఉన్న షేరు ధర 16 ట్రేడింగ్ సెషన్లలో (ఈ నెల 20న) రూ.190కి చేరుకోవటం గమనార్హం. అంటే కేవలం 20 రోజుల్లో ఈ షేరు ధర ఏకంగా 40 శాతం పెరిగిందన్న మాట. రిలయన్స్ జూన్ క్వార్టర్లో మరోసారి అత్యంత పటిష్టమైన పనితీరును నమోదుచేసింది. లాభాల జోరుకు మా కీలక వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల్లో భారీ మార్జిన్లు దోహదం చేశాయి. ఇక రిటైల్ వ్యాపారం 74% ఆదాయ వృద్ధిని సాధించి దూసుకెళ్తోంది. భారత టెలికం రంగంలో సరికొత్త విప్లవానికి మా రిలయన్స్ జియో నాంది పలికింది. దేశంలో డేటా వినియోగం, టెలికం సేవల స్వరూపంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో రూ. 20 వేల కోట్ల సమీకరణ... రైట్స్ ఇష్యూ రూపంలో రూ.20 వేల కోట్ల నిధులను సమీకరించనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. ఒక్కొక్కటి రూ.50 విలువగల 400 కోట్ల ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను(ఓసీపీఎస్) ఆర్ఐఎల్ వాటాదారులకు జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఈ నిధులను సేవల విస్తరణకు వినియోగించనుంది. ఇప్పటికే రిలయన్స్ జియోపై ఆర్ఐఎల్ దాదాపు రూ.1.9 లక్షల కోట్ల నిధులను వెచ్చించిన సంగతి తెలిసిందే. తాజా నిధులతో ఈ మొత్తం రూ.2.1 లక్షల కోట్లకు చేరనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement