-
అజేయంగా భారత్
రాంచీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ఆసియా హాకీ మహిళల చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. దక్షిణ కొరియా జట్టుతో గురువారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సలీమా టెటె (6వ, 36వ ని.లో) రెండు గోల్స్ చేయగా... నవ్నీత్ కౌర్ (36వ ని.లో), వందన కటారియా (49వ ని.లో), నేహా (60వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొమ్మిది పాయింట్లతో చైనా రెండో స్థానంలో, జపాన్ మూడో స్థానంలో, ఏడు పాయింట్లతో కొరియా నాలుగో స్థానంలో నిలిచి భారత్తోపాటు సెమీఫైనల్కు అర్హత పొందాయి. శనివారం జరిగే సెమీఫైనల్స్లో జపాన్తో చైనా; కొరియాతో భారత్ తలపడతాయి. -
భారత హాకీ జట్టులో కరోనా కలకలం..
Indian Womens Hockey Player Tested Positive For Covid: భారత మహిళల హాకీ జట్టులో కరోనా కలకలం రేపింది. సియోల్ వేదికగా జరుగుతున్న ఆసియా మహిళల హకీ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్కు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో భారత క్రీడాకారిణికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆతిధ్య జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ విషయాన్ని దృవీకరించిన ఆసియా హాకీ ఫెడరేషన్.. మహమ్మారి బారిన పడిన క్రీడాకారిణి పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇదే టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో థాయ్లాండ్ను 13-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు -
సంయుక్త విజేతలు భారత్, పాకిస్తాన్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ విజేత పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 9 గంటల 10 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.40 నుంచి) ప్రారంభం కావాల్సింది. అయితే మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. గంటన్నరపాటు వేచి చూసినా... వర్షం తగ్గకపోవడంతో నిర్వాహకులు ఫైనల్ను రద్దు చేసి భారత్, పాకిస్తాన్ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. -
భారత్ హ్యాట్రిక్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో భారత్ 9–0తో జపాన్ను ఓడించి వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఒమన్పై 11–0తో... రెండో మ్యాచ్లో పాక్పై 4–1తో నెగ్గిన మన్ప్రీత్ సింగ్ బృందం మూడో మ్యాచ్లోనూ తమ జోరును ప్రదర్శించింది. ప్రతి క్వార్టర్లో గోల్ చేసి జపాన్ను హడలెత్తించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (4, 49, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్తో హ్యాట్రిక్ నమోదు చేయగా... హర్మన్ప్రీత్ సింగ్ (17, 21వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. గుర్జంత్ సింగ్ (8వ నిమిషంలో), ఆకాశ్దీప్ సింగ్ (36వ నిమిషంలో), సుమీత్ (42వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో భారత్ తరఫున హ్యాట్రిక్ చేసిన రెండో ప్లేయర్గా మన్దీప్ సింగ్ నిలిచాడు. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో దిల్ప్రీత్ సింగ్ ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో భారత్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జపాన్తో ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఆడిన భారత్ 18 మ్యాచ్ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని... ఒక మ్యాచ్లో ఓడింది. మంగళవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. ఇటీవలే జకార్తా ఆసియా క్రీడల సెమీఫైనల్లో మలేసియా చేతిలో అనూహ్యంగా ఎదురైన ఓటమికి భారత్ భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. -
విజయీభవ..!
మస్కట్: వచ్చే నెలలో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ టోర్నమెంట్కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ బరిలోకి దిగుతోంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో పాటు టైటిల్ ఫేవరెట్గా పోటీపడుతోంది. గురువారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య ఒమన్తో భారత్ తలపడనుంది. చివరిసారి 2014 ఆసియా క్రీడల్లో ఒమన్తో ఆడిన భారత్ ఆ మ్యాచ్లో 7–0తో అలవోకగా గెలిచింది. ఈసారీ టీమిండియా నుంచి అలాంటి ఫలితమే పునరావృతమయ్యే అవకాశముంది. 2011 నుంచి ఇప్పటివరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీని నాలుగుసార్లు నిర్వహించారు. భారత్ 2011లో, 2016లో టైటిల్ సాధించింది. 2012లో రన్నరప్గా నిలిచింది. ఈసారి భారత్తోపాటు పాకిస్తాన్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా, ఒమన్ జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఫైనల్ ఈనెల 28న జరుగుతుంది. ఒమన్తో మ్యాచ్ తర్వాత భారత్ ఈ నెల 20న పాకిస్తాన్తో, 21న జపాన్తో, 23న మలేసియాతో, 24న కొరియాతో ఆడుతుంది. ‘తొలి మ్యాచ్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజయంతో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ప్రపంచంలోని మేటి జట్లను ఓడించే సత్తా ఈ జట్టులో ఉంది. అయితే కొన్నిసార్లు ఊహించని తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంటున్నాం. మ్యాచ్ మొదలైన క్షణం నుంచి చివరి సెకను వరకు పూర్తి ఏకాగ్రతతో ఆడుతూ... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా రాణించాల్సిన అవసరం ఉంది. ఆసియా క్రీడల్లో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని తమ ప్రదర్శ నతో జట్టు ఆటగాళ్లు నిరూపించుకోవాలి’ అని భారత జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 2016 ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయంగా నిలిచింది. తొలి మ్యాచ్లో జపాన్ను 10–2తో ఓడించిన భారత్ తదుపరి మ్యాచ్లో కొరియాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. అనంతరం 3–2తో పాకిస్తాన్పై, 9–0 తో చైనాపై, 2–1తో మలేసియాపై గెలుపొందింది. సెమీఫైనల్లో 5–4తో కొరియాను ఓడించి, ఫైనల్లో 3–2తో పాకిస్తాన్పై నెగ్గి టైటిల్ సాధించింది. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, కృష్ణ బహదూర్ పాఠక్ (గోల్కీపర్లు), హర్మన్ప్రీత్ సింగ్, గురీందర్ సింగ్, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, జర్మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), సుమీత్, నీలకంఠ శర్మ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, చింగ్లేన్సనా సింగ్ (వైస్ కెప్టెన్), ఆకాశ్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్ప్రీత్ సింగ్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement