-
సొంత రెవెన్యూను మించి వేతనాలు, పెన్షన్ల వ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులను మించి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని 11వ వేతన సవరణ నివేదికలో కమిషన్ చైర్మన్ అశుతోష్ మిశ్రా స్పష్టం చేశారు. 2019–20లో రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులను మించి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు 100.6 శాతం వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. టీడీపీ సర్కారు హయాంలో కన్నా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల వేతనాలు పెరిగాయని వెల్లడించారు. గత సర్కారు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు చెల్లించే శాతం తక్కువగా ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగిందని నివేదికలో విశ్లేషించారు. ఉద్యోగుల పదకొండవ పీఆర్సీకి సంబంధించిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేయడం తెలిసిందే. సమతుల్యత దిశగా.. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నష్టపోగా కోవిడ్ కారణంగా రాష్ట్ర రాబడులు గణనీయంగా తగ్గిపోయాయని, ఇదే సమయంలో మహమ్మారి కట్టడికి వైద్య సదుపాయాల కోసం భారీగా వ్యయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలో పేర్కొన్నారు. విభజన పరిణామాలు, పెండింగ్ బకాయిలు భారీగా చెల్లించాల్సి రావడం, కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోందని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆర్ధిక వనరులను వెచ్చించాల్సి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ సమతుల్యత సాధించే దిశగా వేతన సవరణ సిఫార్సులు చేసినట్లు నివేదికలో వెల్లడించారు. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక విడుదల ఉద్యోగుల పదకొండవ పీఆర్సీకి సంబంధించిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా కమిటీ నివేదికపై ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం నివేదికను సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోనే రిటర్నులు
విశాఖపట్నం: అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) రిటర్నుల దాఖలు జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రం ప్రాతిపదికగానే జరగనున్నట్టు విశ్రాంత అదనపు ముఖ్య కార్యదర్శి, వాణిజ్య పన్నులకు సంబంధించి రాష్ట్రాల పునర్విభజన కమిటీ సలహాదారు అశుతోష్ మిశ్రా స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సీ, డీలర్లతో సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో వ్యాపారస్తులకు ఉత్పన్నమయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే అమల్లో ఉన్న అడ్వాన్స్ రూలింగ్స్ ఉభయ రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తుకు నెలాఖరు గడువు సమావేశంలో తొలుత కొత్త టిన్ నంబర్లు తీసుకునే ందుకు విధివిధానాలు, డీలర్ల హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు నింపడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించారు. హా ఆంధ్రప్రదేశ్/తెలంగాణా/రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ కొత్త టిన్ నంబర్ పొందవచ్చన్నారు. తమ చిరునామా, బ్యాంకు ఖాతా, పాన్ నంబర్ తదితర వివరాల్ని కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువిచ్చారు. 1. ప్రస్తుతం 11 అంకెల టిన్ నంబర్లో రాష్ట్రాన్ని సూచించే రెండంకెలు 28 కాగా, కొత్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు 37, తెలంగాణాకు 36 నెంబర్ను కేటాయించారు. 2.ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న డీలర్లకు మే 8 నాటికి టిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. 3. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జూన్ 2 తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(ఆర్సీ) వారు పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపించనున్నారు. 4.ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోను, జూన్ 2 నుంచి కొత్త రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. హా కొత్త సి-ఫారాలు కూడా జూన్ 2 తర్వాతే అందిస్తారు. ఇప్పటికే తీసుకున్న పాత ఫారాలుంటే.. వాటిపై కొత్త టిన్ నెంబర్ను రబ్బరు స్టాంపు ద్వారా ముద్రించి వినియోగించుకోవచ్చన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement