-
జీవితంలో ఫెయిల్ అయ్యా..
సూసైడ్నోట్ రాసి యువకుడి ఆత్మహత్య శామీర్పేట్లో విషాదం మృతుడు కరీంనగర్ జిల్లావాసి శామీర్పేట్: ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అంటూ ఓ యువకుడు తనువు చాలించాడు. సదరు యువకుడు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్(23) కొన్నాళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. నారాయణగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్ సెంటర్లో చేరాడు. శుక్రవారం కరీంనగర్ వెళ్తున్నానని అతడు హాస్టల్లో చెప్పి బయలుదేరాడు. ఇదిలా ఉండగా శనివారం శామీర్పేట్లోని శివగంగా బోర్వెల్ కార్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్కార్డు ఆధారంగా అతడు మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్గా గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ పురుగుల మందు డబ్బా పడి ఉంది. అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అని ఆదిత్యపవన్ తన తల్లిదండ్రులకు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘జీవితంలో ఫెయిలయ్యాను..’
సూసైడ్ నోట్ రాసిపెట్టి యువకుడి ఆత్మహత్య మృతుడు కరీంనగర్ జిల్లావాసి.. శామీర్పేట్లో ఘటన శామీర్పేట్: సూసైడ్ నోట్ రాసిపెట్టి ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కరీంనగర్ జిల్లావాసి. ఈ సంఘటన శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్(23) కొన్నాళ్ల క్రితం స్వస్థలంలో బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చాడు. నారాయణగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు. శుక్రవారం కరీంనగర్ వెళ్తున్నానని అతడు హాస్టల్లో చెప్పి బయలుదేరాడు. ఇదిలా ఉండగా శనివారం శామీర్పేట్ మండల కేంద్రంలోని శివగంగా బోర్వెల్ కార్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో ఓ యువకుడు మృతదేహంగా పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్కార్డు ఆధారంగా అతడు మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్గా గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ పురుగులమందు డబ్బా పడి ఉంది. దీంతో ఆదిత్యపవన్ పరుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభించింది. ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అని ఆదిత్యపవన్ తన తల్లిదండ్రులకు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement