-
Adari Tulasi Rao: ఆంధ్రా కురియన్కు నివాళి!
అనూహ్యమైన, అనితరసాధ్యమైన పాల ఉత్పత్తి రంగంలో విజయాలు సాధించిన ఆడారి తులసీరావు ఈనెల 4వ తేదీన మరణించారు. మూడున్నర దశాబ్దాలు విశాఖ డెయిరీ ఛైర్మన్గా వ్యవహరించి, రైతుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ప్రతి ఒక్క రైతుతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ ఉండేవారు. డెయిరీకి పాలు సరఫరా చేసే వేలాదిమంది రైతుల పిల్లలకు అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించారు. పాడి రైతులలో పేదవారి పిల్లలకు హాస్టలు వసతి కల్పించి, ఉచిత విద్యను బోధింపజేసిన సేవాదృక్పథం ఆయనది. రైతాంగ యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆత్మ విశ్వాసంతో వ్యవసాయాన్నీ, పాడినీ అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ప్రయత్నించాలని తరచూ తన అనుభవాలు జోడించి ఉద్బోధించేవారు. పాలను సేకరించి, వినియోగదారులకు పాలు, పెరుగు, మజ్జిగ అమ్మడమే ప్రధానంగా కొనసాగిన విశాఖ డెయిరీ, అనంతర కాలంలో ఆ పాలతో అనేక ఇతర ఆహార ఉత్పత్తులు ప్రారంభించి రుచి, శుచిలో అగ్ర తాంబూలం అందుకునేలా చేసిన సవ్యసాచి ఆయన. ఆంధ్రా కురియన్గా కీర్తించబడినా కించిత్ గర్వం, అతిశయం దరిచేరనివ్వని వ్యక్తిత్వ శైలి ఆయనది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో డెయిరీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే, యలమంచిలి నియోజక వర్గం రాజకీయాలలో ఆరు దశాబ్దాలు క్రియాశీల పాత్ర పోషించారు. ఆనాటి విశాఖ జిల్లా బోర్డు సభ్యునిగా వ్యవహరించిన తన తాత స్వర్గీయ ఆడారివీరు నాయుడు ఆయనకు స్ఫూర్తి. నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి పంచాయతీకి మూడుసార్లు సర్పంచ్గా ఎన్నికైనారు. యల మంచిలి పురపాలక సంఘంగా మారిన తర్వాత రెండుసార్లు ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2015 డిసెంబరులో భారత పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ తన 37వ జాతీయ సమావేశంలో తులసీరావు పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, ఆడారి కీర్తి కిరీటంలో కలికితురాయి. లక్షలాదిమంది రైతులు, వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాలకు బతుకుదెరువు చూపించిన దార్శనికుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆడారి తులసీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం ఆయన మృతికి గొప్ప నివాళి. ఆయన మరణించినా, పల్లెల్లో ఆయన నిర్మింపజేసిన వందలాది కట్టడాలు ఆయన సేవలను మరింత చిరస్మరణీయం చేస్తాయి. లక్షలాది కుటుంబాలు తరతరాలు ఆ మహనీయునికి రుణపడి ఉంటాయి. (క్లిక్ చేయండి: ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం) – బి.వి. అప్పారావు, విశాఖపట్నం -
ఆడారిపై ఐటీ గురి
విశాఖ డెయిరీ వర్గాల్లో అలజడి నగరంలోనూ, జిల్లాలోనూ సోదాలు పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు స్వాధీనం! కీలకపత్రాలను రహస్యంగా తరలించిన డెరుురీ సిబ్బంది? విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం : ముప్పై ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా విశాఖ డెయిరీ చైర్మన్ గిరీలో కొనసాగుతున్న ఆంధ్ర కురియన్ ఆడారి తులసీరావు ఆదాయపు పన్ను ఉచ్చులో పడ్డారు. ఇన్నాళ్లూ తనకు ఎదురులేదన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన ఆయన పెను సంకటంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకునిగా కంటే డెరుురీ చైర్మన్గానే ఆయన పెంచుకున్న పరపతికి ఐటీ అధికారులు చెక్ పెట్టారు. విశాఖ డెరుురీతో పాటు ఆయన, ఆయన కుమార్తె, కుమారుడు, ఇతర బంధుమిత్రుల ఆదాయం, ఆస్తుల చిట్టాను విప్పుతున్నారు. విశాఖలోనూ, జిల్లాలోనూ తీవ్ర అలజడి రేపుతున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే.. మంగళవారం సూర్యోదయానికి ముందే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయారు. అప్పటికే తమ వద్ద ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనూహ్యంగా సాగుతున్న ఈ సోదాలతో చైర్మన్ తులసీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, డెరుురీలో ఆయనకు అనుంగు శిష్యులుగా ఉన్న డెరైక్టరు, డెరుురీ ఉద్యోగులు అవాక్కయ్యారు. నగరంలోని అక్కిరెడ్డిపాలెంలో ఉన్న విశాఖ డెరుురీతో పాటు అక్కడకు సమీపంలో డెరుురీ ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి ఆస్పత్రిలోనూ సోదాలు నిర్వహించారు. ఇంకో బృందం నగరంలోని గ్రాండ్బే హోటల్ వద్ద ఉన్న కుమారుడు ఆనంద్ ఇంటి వద్ద సోదాలు జరిపారు. మరో బృందం తులసీరావు స్వస్థలం యలమంచిలి వెళ్లి అక్కడ ఆయన నివాసంలోనూ, కుమార్తె, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమాకుమారి ఇంటిలోనూ దాడులు చేశారు. యలమంచిలి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, ఇతర ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాలపై ఆరా తీశారు. ఆడారి పేరిట 25 ఎకరాల పంట భూములున్నాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అంతేకాదు.. జిల్లాలోని చోడవరం మండలం అంబేరుపురం పాల సొసైటీకి వెళ్లి అక్కడ రికార్డులను తనిఖీ చేశారు. తులసీరావుకు సన్నిహితంగా ఉండే డెరుురీ డెరైక్టర్ గంగరాజును ప్రశ్నించారు. ఇంకా జిల్లాలోనూ, నగరంలోనూ పలుచోట్ల ఐటీ అధికారుల బృందం సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. కీలక పత్రాలు రహస్యంగా తరలింపు.. ఐటీ అధికారుల దాడుల సంగతి తెలుసుకున్న వెంటనే డెరుురీ ఉద్యోగులు జాగ్రత్త పడ్డట్టు తెలిసింది. సుమారు 30 మంది డెరుురీలో క్యాజువల్ వర్కర్లతో ఎరుుర్ బ్యాగులతో ఫైళ్లు, ఇతర ముఖ్య పత్రాలు, దస్త్రాలు, నగదును దొడ్డిదారిలో తరలించినట్టు సమాచారం. అక్కిరెడ్డిపాలెంలోని వివేకానందకాలనీ శివారు ప్రాంతానికి గుంపులుగా చేరుకుని ఆ బ్యాగులను తుప్పల్లో దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు యువకులు బహిర్భూమికి వెళ్తున్నట్లు నటించి స్థానికులు ఎవరూ గుర్తించడం లేదని తెలుసుకుని వారు భారీ బ్యాగును చంకన పెట్టుకొని మింది వైపు నుంచి శ్రావణ్ షిప్పింగ్ వైపు రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లారని తెలుస్తోంది. కుటుంబీకులకే పెత్తనం.. : విశాఖ డెరుురీకు చెందిన షీలానగర్లోని కృషి ఐకాన్ ఆస్పత్రికి తులసీరావు మేనల్లుడు డాక్టర్ పెతకంశెట్టి సతీష్ ఎండీగాను, కుమారుడు సీఎండీగాను, కోడలు మేనేజింగ్ ట్రస్టీలుగాను వ్యవహరిస్తున్నారు. ఇలా తులసీరావు కుటుంబం మొత్తం డెరుురీ ఆస్తుల్లో భాగస్వాములుగా ఉండడం వివాదాస్పదమవుతోంది. కృషి ఐకాన్ ఆస్పత్రి రూ.వందల కోట్లతో నిర్మించి, ఆధునిక పరికరాలను అమర్చి అల్లుడికి తులసీరావు కానుకగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఒంటెత్తు పోకడల వల్లే... : ఆది నుంచి తులసీరావుది ఒంటెద్దు పోకడేనన్న విమర్శలున్నారుు. గత నెల రోజుల క్రితమే డెరుురీ ఛైర్మన్గా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయనకు బంగారు కిరీటాన్ని సమర్పించడం, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ఆహ్వానించకపోవడం పెను దుమారం రేపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement