war
-
ఇరాన్పై ట్రంప్ ఆగ్రహం...
-
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్పై యుద్ధ ప్రభావం⇒ డాలర్తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
యుద్ద సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా..?
డ్రాగన్ కంట్రీ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్వార్థం కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి సిద్ధం కానీ తను మాత్రం ఎన్నడూ ఇబ్బందులకు గురి కాదు.ప్రస్తుతం ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇరాన్- అమెరికా యుద్ధం వస్తుందని ముందే ఉహించిన చైనా ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉంచుకుందట.. అవీ ఏకంగా IEA అంతర్జాతీయ ఇంధన సంస్థ నిల్వల కంటే కూడా అధికంగా ఉన్నాయని సర్వేలు తెలిపాయి.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దంతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రధాన అంశం చమురు. ఆయిల్ రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ముందే ఉహించిన చైనా తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీగా చమురునిల్వలు ఉంచుకుందట.. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు ఈ వివరాలే చెబుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా వద్ద సుమారుగా 1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.అయితే ఇది అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే అధికమని సర్వేలు చెబుతున్నాయి. అదే అమెరికా వద్ద ప్రస్తుతం 405 మిలియన్ బారెళ్ల నిల్వలు మాత్రమే ఉన్నాయని.. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే 172 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించారని పేర్కొన్నాయి..అయితే యుద్దం అంచనాని ముందే పసిగట్టిన చైనా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనా తన చమురు దిగుమతులను ఏకంగా 15.8% పెంచుకుందని సర్వే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రస్తుతం యుద్దం నేపథ్యంలో చమురు సంక్షోభాన్ని పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అందుకే ఇది వరకూ ప్రపంచ దేశాలు చమురు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా చైనా మాత్రం ఎటువంటి ఆందోళన చెందలేదు. -
యుద్ధ ట్యాంకర్లతో మిలిటరీ స్పెషల్ వీడియో.
-
Magazine Story: యుద్ద కాండ
-
భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
-
24 గంటల్లో.. యుద్ధం మొదలవుతుంది KA పాల్ సంచలన వ్యాఖ్యలు
-
దీదీకి వార్నింగ్ మోదీకి స్ట్రాంగ్ కౌంటర్
-
అమెరికా నౌకలపై ఇరాన్ దాడి!
-
ఇరాన్- అమెరికా మధ్య అసలేం జరగనుంది..?
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఓ వైపేమో డొనాల్డ్ ట్రంప్ చర్చలకు రాకుంటే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంటే మరోవైపేమో ఇరాన్ హర్మూజ్ బ్లాకేడ్ విరమించేదాకా చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగనుంది. అసలు యుద్ధం ముగింపు దశకు చేరుకుందా.. లేక మరింత ఉదృతమవుతుందా అనే సమాచారం తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి..!యుద్ధం ఎందుకు మెుదలైందిఅమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అయితే దానికి మెుదటి కారణం ఇరాన్ తన అణు అణు బాంబును తయారు చేసే స్థాయికి చేరుకోవడమైతే మరోటి ఆ దేశంలోని ప్రజల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టడం. ఈ రెండు కారణాలపై మెుదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ చివరికి అనుకున్న పని చేశారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించారు.మెుదటి రోజే ఖమేనీ హత్యదీంతో ఫిబ్రవరి 28 న ఇరాన్పై ఆపరేషన్ "ఎపిక్ ప్యూరీ" పేరుతో అమెరికా దాడులు ప్రారంభించింది. యుద్దం ప్రారంభించిన మెుదటిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని అంతం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం అధికారికంగా ధృవీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్దం తీవ్రంగానే ఉండబోతుందని ఆందోళన చెందింది. అయితే ఇరాన్ సైతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఏకకాలంలో ధీటుగా ఎదుర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు టెల్ అవీవ్ పై మిసైల్స్ అటాక్ చేసింది. ఇరాన్ ఏంతకీ వెనక్కి తగ్గలేదు.హర్ముజ్ దిగ్భందనంప్రపంచ చమురు రవాణాకు ఏంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది. అటువంటిది ఈ జలసంధిని ఇరాన్ బ్లాక్చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చమురు, గ్యాస్ సరఫరా లేక చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇంధన కొరతను తట్టుకోలేక లాక్డౌన్ సైతం విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది.ట్రంప్ అంచనాలు తలకిందులు.యుద్దం విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా తలకిందులైంది. యుద్ధాన్ని కేవలం వారం రోజుల్లో ముగిస్తానని అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తొలుత నుంచి చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్నకు ఆ రెండు విషయాల్లో చుక్కెదురైంది.. వారం రోజుల్లో కాదు కదా యుద్ధం ప్రారంభమై 40 రోజుల దాటినా ఇరాన్ వెనుకంజవేయలేదు.. మరో వైపు అక్కడి ప్రజలు ఇరాన్కు అండగా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డారు.ట్రంప్ చర్చల రాగంఅయితే మెుదటి నుంచి ఇటు ఇరాన్.. అటు అమెరికా ఎక్కడా తగ్గలేదు.. ఇరాన్లోని అణుస్థావరాలను విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశామని అమెరికా వాదిస్తుంటే.. అమెరికా ఫైటర్ జెట్స్ను కూల్చేసేమని తమతో యుద్దంలో అమెరికా ఓడిపోయిందని పరస్పరం వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను చర్చలకు సిద్ధమని ట్రంప్ ఏప్రిల్ 8న ప్రకటించారు. అయితే చివరి వరకూ చర్చలపై ఏటూ తేల్చని ఇరాన్.. ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కాస్త తగ్గింది. చర్చలకు రాకుంటే ఇరాన్ నాగరికతనే అంతం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు వారాల పాటు సీజ్ఫైర్ ఒప్పందం జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలుదీంతో ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 11, 12 తేదీలలో చర్చలు జరిగాయి. అయితే అమెరికా నిబంధనలు నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి.ఇరాన్ అణుబాంబు తయారిని పూర్తిగా నిలపివేయాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ పెట్టింది. దీంతో ఇరాన్ ఈ చర్చలకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.దీంతో అమెరికా హర్ముజ్ను బ్లాకేడ్ చేసింది. దీంతో ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. తాను కూడా హర్ముజ్ను అష్టదిగ్భందనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తన దుందుడుకు స్వభావంతో వ్యాఖ్యానించారు. ఇరాన్ మిలటరీ సర్వనాశనం అయ్యిందని వారికి యుద్దం చేసే సత్తాలేదని ఆరోపించారు.యుద్ధం ముగుస్తుందా?ప్రస్తుతం యుద్దం ముగుస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అమెరికా ప్రధాన లక్షం ఇరాన్కు అణుబాంబు లేకుండా చేయడం అయితే దానికి టెహ్రాన్ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. మరోవైపు ఇతర విషయాలలోనే రెండు దేశాలు పరస్పర వైవిధ్యాలు కలిగి ఉన్నాయి. ఇరాన్ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ సైతం ఇటీవల ఈ వ్యాఖ్యలే చేశారు. అమెరికా ఒత్తిడి చేస్తున్న ఇరాన్ రెండో దఫా చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలో ఏవరో ఒకరు పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గితే తప్ప దీనికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం కనిపించడం లేదు. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
ప్రపంచానికి హెచ్చరిక భారీ షాక్ ఇచ్చిన ఇరాన్
-
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
-
రాడార్లకు చిక్కకుండా ఇరాన్కు చైనా విమానాలు..?
ఇటీవల అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు చైనాపై సంచలన ఆరోపణలు చేశాయి. ఇరాన్కు యుద్ధంలో చైనా సహకరిస్తోందని ఆ దేశానికి పరోక్షంగా ఆయుధాలు అందజేస్తుందన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని చైనా ఖండించింది. తాజాగా మధ్యప్రాచ్యంలో నాలుగు చైనా కార్గో విమానాలు రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం అమెరికా నిఘా వర్గాలు ఇరాన్కు చైనా భారీగా మ్యాన్పాడ్ ఆయుధాలను తరలిస్తోందని ఆరోపించాయి. మ్యాన్పాడ్ అంటే భుజంపై ఎక్కడికైనా మోసుకెళ్లగల ఆయుధాలు. వీటిసాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను సులభంగా కూల్చివేయవచ్చు. ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇవి ఎంతో కీలకంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని నివేదికలు అమెరికా సీక్రెట్ ఏజెన్సీల సర్వేలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.చైనా కార్గో విమానాలుకొన్నిరోజుల క్రితం.. కేవలం 48 గంటల వ్యవధిలో నాలుగు చైనా కార్గో విమానాలు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేసి చైనా భూభాగంలో దిగాయని పలు నివేదికలు కథనాలు ప్రచురించాయి. ట్రాన్స్పాండర్ అనేది సాధారణంగా విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో వెళుతుంది అనే వివరాలని ప్రసారం చేసే ఒక పరికరం. దీనిని ఉద్దేశపూర్వకంగా ఆపివేయడాన్ని డార్క్ ఫ్లైట్ అంటారు. సాధారణంగా వెళ్లే గమ్యం వెల్లడించకుండా ఉండడానికి సైనిక కార్యకలాపాలు, రహస్య లావాదేవీల సమయంలో ఇటువంటి పద్దతులను ఉపయోగిస్తారు.ఆయుధాల తరలింపు?అయితే కొన్ని సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం.. ఆ విమానాలు ఇరాన్కు ఆయుధాలు తరలించడానికి ఉద్దేశించినవని అందులో మందుగుండు సామాగ్రితో పాటు ఇతర ఆయుధాలు తరలిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే చైనా, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం బాధ్యతాయుతమైన దేశమని యుద్ధాన్ని ప్రోత్సహించే ఏ పనులు తాము చేయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలు రావడం ఆందోళన కలిగించే అంశం.అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ రకమైన నివేదికలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. -
ఉత్తర ఇజ్రాయెలపై హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు
-
ఇది నా పదో విజయం.. ట్రంప్ సంచలన పోస్ట్
-
అద్భుతం జరగబోతుంది.. ఇక అంతా మంచి రోజులే..
-
ప్రపంచ యుద్ధ భయం.. కానీ స్టాక్ మార్కెట్లు ధ రికార్డులే కొడుతున్నాయి
-
యుద్ధం ముగిసినట్లే..! ట్రంప్ కీలక ప్రకటన
-
యుద్ధం ముగిసినట్టే..!
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. లెబనాన్పై భీకర దాడులు టైర్ (లెబనాన్): లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్ ఇరాన్కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.ఇరాన్కు పాక్ బృందం అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంచేందుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్..!
-
అమెరికా చమురు దిగ్బంధంపై చైనా వార్నింగ్
-
24 గంటల్లో హార్ముజ్ దాటిన 20 నౌకలు
-
మా అప్పు ఇస్తావా.. చస్తావా..! పాక్ చావుకొచ్చిందిగా..!
-
మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈలోపు పోప్ లియో XIV ఇరాన్ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్ పోప్పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్ కాదు మెలోనీనే కరెక్ట్ పర్సన్ కాదంటూ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది. -
ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
అమెరికా-ఇరాన్ యుద్ధం.. భారత్ మధ్యవర్తిత్వం?
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం మరో కీలక దశకు చేరుకుంది. ఏప్రిల్ 16 రేపు ( గురువారం) ఇరాన్-అమెరికా మధ్య రెండో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత్ సైతం మధ్యవర్తిత్వం వహించచ్చన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారత్ మాత్రమేన్ననారు.సెర్గియా గోర్ ఇటీవలే వాషింగ్టన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్థావించారు. ఇరాన్- అమెరికా యుద్ధం విషయంలో భారత్ మధ్యవర్తిత్వం వహించవచ్చా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఇలా మాట్లాడారు"పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడంలో భారత్ మధ్యవర్తిత్వాన్ని అమెరికా స్వాగతిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపడంలో ఏదేశాలైనా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆ అవకాశం ఉంది. ఈ విషయంలో ట్రంప్ ఏ ఒక్క దేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం కోసం ఎవరొచ్చినా స్వాగతిస్తారు". అని అన్నారు.అమెరికాలో డొనాల్డ్ ట్రంప్తో సహా పలు కీలక నేతలతో సమావేశం నిర్వహించానని వారు పలు కీలక విషయాలను ప్రస్థావించారని పేర్కొన్నారు. వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలపై మరో కొద్ది రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు. అయితే అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత గల హర్ముజ్ జలసంధిని కేవలం ఒక్క దేశం దిగ్భందించిందని ఇది చాలా ప్రమాదకరమని ఇరాన్ పేరు ప్రస్థావించకుండా మాట్లాడారు.కాగా నిన్న (మంగళవారం) నరేంద్ర మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగింది. " నా స్నేహితుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. యుద్ధ ఉద్రిక్తతల వేళ ఇరు దేశాధినేతల చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. -
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఐఎంఎఫ్ విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్' నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి సుమారు 3.1 శాతంగా ఉంటుంది పేర్కొంది. జనవరిలో ఇది 3.3 శాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారాయి.ఈ యుద్ధం ఇరాన్ - అమెరికా,ఇజ్రాయెల్ దాడుల మధ్య ఉద్రిక్తతలతో ప్రారంభమై.. ఆ ప్రాంతంలో తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాల కారణంగా ముఖ్యంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాను అడ్డుకోవడం వల్ల ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదలతో.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం.. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరవచ్చని అంచనా. ఇది జనవరిలో చెప్పిన అంచనాల కంటే చాలా ఎక్కువ.అయితే.. 1970లలో జరిగిన చమురు సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా చమురు మీద ఆధారపడటం తగ్గింది. పునరుత్పాదక శక్తి, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరంగా నిలబడే అవకాశం ఉంది.యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. అప్పుడు గ్లోబల్ వృద్ధి రేటు 2.5 శాతం లేదా 2 శాతానికి కూడా పడిపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలపై సమానంగా ఉండదని ఐఎంఎఫ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!మధ్యప్రాచ్యం - మధ్య ఆసియా ప్రాంతాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గి 1.9 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కూడా ప్రభావితమవుతున్నాయి. అమెరికా వృద్ధి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, చైనాలో వృద్ధి కొంచెం మందగించనుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
యుద్ద నష్టం ఇన్ని లక్షల కోట్లా..? ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్ మౌళిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్, విద్యుత్ ప్లాంట్లపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించింది.ఇరాన్ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటి వరకూ జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా విడుదల చేసింది. టెహ్రాన్పై జరిపిన దాడులలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 25 లక్షల కోట్లు నష్టం ఇరాన్కు వాటిల్లిందని తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య మరింతగా పరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇంత పెద్ద మెుత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామని తెలిపింది.అయితే ఇరాన్ తొలుత నుంచి అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చల్లోనూ యుద్ద నష్టపరిహరం తన డిమాండ్లలో ఉంచింది. ఇంత పెద్దమెుత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒక వేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ
-
తగ్గేదేలే.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్
-
అమెరికాకు ఇరాన్ సైన్యం వార్నింగ్..
-
యుద్ధం: ఒక్కపూటే భోజనం.. ఆకలికి తట్టుకోలేక, ఆకులు తింటూ..
ఖార్టూమ్: యుద్ధం సృష్టించే విధ్వంసాలు అన్నీఇన్నీ కాదు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోతాం. ఇదే విధంగా నష్టపోయింది సూడాన్. అక్కడ లక్షలాది మంది రోజుకు ఒక్క పూట భోజనంతోనే జీవిస్తున్నారని ఎన్జీఓలు చెబుతున్నాయి. ఆ దేశంలో ఆహార సంక్షోభం ఇక్కడితోనూ ఆగకుండా మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఎన్జీఓల తాజా నివేదిక చెబుతోంది. చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.“సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది. ఈ యుద్ధం సూడాన్లో ప్రజలు ఆకలి కేకలు పెట్టేలా చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఇది ఒకటి. లక్షలాది మందిని నిరాశ్రయులుగా మార్చింది” అని యాక్షన్ అగైనెస్ట్ హంగర్, కేర్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, మెర్సీ కార్ప్స్, నార్వీజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ తాజాగా నివేదికలో పేర్కొన్నాయి.దాదాపు మూడు సంవత్సరాల ఘర్షణ, హింస, సూడాన్ ఆహార వ్యవస్థను క్రమంగా దెబ్బతీసింది. ఘర్షణ తీవ్రంగా ఉన్న ఉత్తర దార్ఫూర్, దక్షిణ కొర్డోఫాన్ రాష్ట్రాల్లో లక్షల కుటుంబాలు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయగలుగుతున్నాయి. వారు ఒక్కోసారి పూర్తిగా ఒక రోజు మొత్తం భోజనాన్ని మానేస్తున్నారు. అలాగే, జీవించేందుకు చాలా మంది ఆకులు, పశువుల మేత తినే స్థితికి చేరుకున్నారు. చిన్నారులకూ ఈ కష్టాలు తప్పడం లేదు. ఇది ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతోందని ఎన్జీఓల నివేదిక తెలిపింది.వేలాది మంది మృతిసూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య 2023 ఏప్రిల్లో యుద్ధం ప్రారంభమైంది, ఇది తీవ్ర హింసకు దారి తీసి ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా మారింది. 1.2 కోట్ల మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలివెళ్లాల్సి వచ్చింది. 3.3 కోట్లకు పైగా ప్రజలకు మానవతా సాయం అవసరం ఉంది.గత మూడేళ్లలో 40,000 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సహాయ సంస్థలు నిజమైన మరణాల సంఖ్య దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నాయి. 2026 మానవతా అవసరాలు, ప్రతిస్పందన ప్రణాళిక ప్రకారం, సూడాన్ జనాభాలో 61.7 శాతం (2.89 కోట్లు) మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.సైన్యం మద్దతుతో ఉన్న సూడాన్ ప్రభుత్వం కరువు పరిస్థితి లేదని చెబుతుండగా, తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులకు తాము బాధ్యత కాదని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చెబుతోంది.ఉమ్ బారు ప్రాంతంలో తీవ్రమైన పోషకాహార లోపం కరువు స్థాయిని మించి ఉందని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ గుర్తించింది. అక్కడ ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం రేటు కరువు స్థాయికి దాదాపు రెట్టింపు ఉంది. అలాగే కర్నోయి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.యుద్ధం వల్ల మహిళలు, బాలికలు అధికంగా ప్రభావితమయ్యారు. ఎందుకంటే వారు పొలాలకు, మార్కెట్లకు, నీటికి వెళ్లినప్పుడు అత్యాచారం, వేధింపులను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. -
ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: ప్రపంచాన్ని ప్రస్తుతం భారీ ఆర్థిక భూకంపం కుదిపేస్తోంది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు.. దాని సెగ ఇప్పుడు సామాన్యుని జేబుకు కూడా గట్టిగానే తగులుతోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోతున్న నేపధ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, ప్రతి వస్తువుపై ధరల మంట తప్పదని స్పష్టం చేసింది.ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ‘సీబీఎస్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే పరిస్థితుల తీవ్రతను తెలియజేశారు. గత ఐదు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా కావాల్సిన 13 శాతం చమురు, 20 శాతం గ్యాస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ఇది ఒక చిన్న కుదుపు కాదని, ఒక పెద్ద షాక్ అని ఆమె అభివర్ణించారు. దీని ప్రభావం వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అత్యంత దారుణంగా నష్టపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధరల పెరుగుదల భారాన్ని తమ ఆదాయంపై పడుతున్న అదనపు పన్నులా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంక్షోభం కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. రవాణా, ఎరువుల సరఫరా, వ్యవసాయ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎరువుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఆసియాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్లో వెంటనే కాల్పుల విరమణ జరిగినా, తక్షణ ఉపశమనం మాత్రం ఉండదని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. ధ్వంసమైన గ్యాస్, ఇంధన మౌలిక సదుపాయాలు పూర్తిగా కోలుకునేందుకు మరో మూడు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేసింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా పడిపోయే అవకాశం ఉందని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు పేదలకు అండగా నిలవాలని ఐఎంఎఫ్ సూచించింది.ఇది కూడా చదవండి: ‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్? -
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ సంధి కుదరకపోతే మళ్లీ యుద్ధం తప్పదా?
-
పాఠశాలలు, ఆసుపత్రులపై టార్గెట్.. ఇరాన్ లో యుద్ధ విధ్వంసం బట్టబయలు
-
ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..!
వారు ఎంచుకున్నది కాదు.. కోరుకున్నది అంతకన్నా కాదు... కానీ భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పట్లేదు. ఇరాన్లోని ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్గత అశాంతి కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పిల్లలు, మహిళలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది...యుద్ధం ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు 340 మంది పిల్లలు యుద్ధ దాడుల్లో మరణించగా, 1,767 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయీబే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మినాబ్ నగరంలో కాకుండా, ఇతర ఐదు వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలపై జరిగిన దాడుల్లో మరో 12 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 7 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నపిల్లలే.మధ్యప్రాచ్య వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది గర్భిణీ స్త్రీలు యుద్ధ నీడలో ఉన్నారు. సరైన వైద్యం లేక రోడ్లపై, కార్లలో, కిక్కిరిసిన శిబిరాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.చమురు ధరల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్లు, పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాలో 6 నెలల వరకు ఆలస్యం కావచ్చని యూనిసెఫ్ అంచనా వేస్తోంది.బాంబు దాడులు, తరలింపు ఆదేశాల వల్ల మొత్తం 12 లక్షల మంది పిల్లలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.ఏ యుద్ధమైనా సరే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. అది ఒక దేశపు సామాజిక పునాదులను, ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అభద్రతా భావం మహిళల జీవితాల్ని ప్రభావితం చేస్తే, యుద్ధం నేర్పిన భయం, ఆకలి, కోల్పోయిన బాల్యం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అది కోట్లాది మంది అమాయకుల కన్నీటి గాథ. (చదవండి: అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..! అలా గాలిలోనే..) -
రష్యా యుద్ధంలో భారతీయులు..?
ఉక్రెయిన్తో జరిగే యుద్ధంలో రష్యా భారతీయులను బలవంతంగా వాడుకుంటుందని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీనిని తీవ్ర ఆందోళన విషయంగా పేర్కొన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్దం మెుదలై దాదాపు నాలుగేళ్లు పూర్తైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులను లాగారనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ మేరకు బాధితులకు సంబంధించిన 26 కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.ఈ తరహా కేసులు రష్యాలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్రం వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల నుంచి మోసపోయిన భారతీయులు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేయబడ్డారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్- అక్టోబర్ కాలంలో వ్యక్తులు కుప్యాన్స్క్, సెలిడోవ్, మాకివ్కా మరియు చెలియాబిన్స్క్ వంటి సున్నిత ప్రదేశాలలో వారిని మోహరించారని తెలిపారు. వారి క్షేమ సమాచారంపై ఇప్పటి వరకూ ఏలాంటి సమాచారం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే వారి సమాచారంపై మాస్కోలోని రాయభార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏలాంటి స్పందన లేదని తెలిపారు.ఈ కేసు పూర్వాపరాలను పరీశీలించిన సుప్రీంకోర్టు దీనిని అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్లకు వెంటనే వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున హాజరైన తుషార్ మోహతా ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆదేశాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.కాగా రష్యాకు భారత్కు ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఇరు దేశాలు మంచి స్నేహ సంబంధం గలవి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ భారతీయులలో కొంత ఆందోళన రేకేత్తిస్తుంది. -
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102 -
ఇరాన్ మాజీ మంత్రి మృతి.. కమల్ ఖారాజీ మరణంతో ఉద్రిక్తతలు
-
‘కాల్పుల విరమణ’కు తూట్లు!
ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతేశాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు. అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్హౌస్లో, ట్రంప్కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది. కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలిగింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు. -
యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం?
ఇరాన్ యుద్ధం భారత్ శక్తి, ఆహార భద్రతలలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. ఆర్థిక కోణంలోనే కాకుండా సైనిక భద్రతా కోణంలో కూడా ఇరాన్ యుద్ధం భారత్కు గుణపాఠాలు నేర్పుతున్నది. సాధారణంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఉంటుంది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో అది ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్నది. మన దేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతులలో 50 శాతం, ఎల్పీజీ దిగుమతులలో సుమారుగా 80–90 శాతం హార్మూజ్ జల సంధి నుండే రావాలి. ముడిచమురును మనం రష్యా, యూఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో మొదలగు దేశాల నుండి అదనంగా కొనటం ద్వారా పూరించుకోగలుగుతున్నాము. సుమారుగా 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము. కానీ ఎల్పీజీ (వంటగ్యాస్) దిగుమతులు ప్రధానంగా ఖతర్ నుండి హార్మూజ్ జలసంధి ద్వారానే రావాలి. యుద్ధం ప్రారంభం కావడా నికి ముందు బ్యారెల్కి 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరుకొంది. కాల్పుల విరమణ వార్తలు చమురు ధరలకు కాస్త ఉపశమనం కలుగజేస్తున్నాయి. బ్యారెల్కు ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన సుమారుగా 15–16 బిలియన్ డాలర్లు చమురు దిగుమతికి అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. సౌదీ, యూఏఈ, ఖతర్ దేశాల చమురు క్షేత్రాలు, చమురుశుద్ధి కేంద్రాలకు నష్టం వాటిల్లటంతో, యుద్ధం ముగిసిన తరువాత కూడా చమురు ధరలు తగ్గకపోవచ్చు. చమురు, తత్సంబంధ ఉత్పత్తుల లభ్యతలో సమస్యలు ఉండవచ్చు.ఎరువుల ఉత్పత్తికి దెబ్బఇరాన్ యుద్ధం నేపథ్యంలో చర్చ ఎక్కువగా ముడిచమురు, ఎల్పీజీ మీదనే కేంద్రీకృతమయింది. ఇంతకంటే పెనుముప్పు దాగున్నది. ఎరువుల తయారీకి కావలసిన సహజ వాయువు, ఎల్ఎన్జీ, అమోనియా, ఫాస్పారిక్ ఆమ్లం, గంధకం, పొటాష్ వంటి ముడిసరుకుల కొరకు మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడు తున్నాము. బొగ్గు ఆధారిత ఎరువుల ఉత్పత్తిని గత రెండు దశా బ్దాలుగా సహజవాయువు/ఎల్ఎన్జీ ఆధారంగా మార్చివేశాం. ఎల్ఎన్జీ విషయంలో సుమారుగా 50 శాతం దిగుమతులపై ఆధార పడుతున్నాము. ఖతర్ నుండి ఎల్ఎన్జీ; యూఏఈ, ఒమన్ల నుండి ఎల్ఎన్జీ/సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నాము. యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువుల తయారీకి వాడే అమో నియాను సౌదీ, ఖతర్, ఒమన్, యూఏఈ నుండి దిగుమతి చేసు కుంటున్నాము. సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పీ) తయారీకి వాడే గంధకం ప్రధానంగా సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ల నుండి దిగుమతి అవుతున్నది. ఎమ్ఓపీ (మ్యురేట్ ఆఫ్ పొటాష్)లో వాడే పొటాష్ దిగుమతిలో 42 శాతం సౌదీ నుండి వస్తున్నది. ఒమన్ నుండి సుమారుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. యుద్ధం వలన ఎరువుల ముడిసర కుల దిగుమతికి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా ధరలు కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చును. రానున్న ఎల్నినో వాతావరణ నేపథ్యంలో, ఎరువుల సమస్య అగ్నికి ఆజ్యంలా తోడయితే మన ఆహార భద్రత ప్రమాదంలో పడవచ్చు.ఆర్థిక మాంద్యం తప్పదా?పరోక్షంగాయుద్ధ ప్రభావం, ఫార్మాస్యూటికల్, ప్యాకేజింగ్, నిర్మాణ సామగ్రి, అల్యూమినియం, సెమికండక్టర్ తయారీ రంగా లపై కూడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీమా ఖర్చులు పెరగటంతో అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయం పెరిగి అన్ని వస్తువుల దిగుమతులు మరింత ప్రియమవుతాయి. కోవిడ్ దెబ్బ నుండి కోలు కొని అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చూపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం ద్రవ్యోల్బణాన్ని మంచి నియంత్రణలో ఉంచగలిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 4 శాతం కిందకు పడిపోయింది. అయితే, దిగుమతుల వ్యయం, ధరల పెరుగుదల వలన బడ్జెట్ లోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి క్రమంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సంవత్సర కాలంగా రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. పెట్టుబడులు భారత దేశం నుండి తరలిపోతున్నాయి. యుద్ధ అనిశ్చితి నేపథ్యంలో మొదటగా బంగారం, తరువాత డాలర్ (అమెరికన్ మార్కెట్) వైపు పెట్టుబ డులు తరలిపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించటంతో దిగుమ తులు ఖరీదవుతున్నాయి. పెరిగిన చమురు ధరల ప్రభావం నుండి సామాన్య పౌరుడిని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించ టానికి చమురు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధనాల ధరలను మాత్రం పెంచారు. యుద్ధం మరో నెల పైన కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ 150 డాలర్లకు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడిక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచక తప్పదు. బహుశా ప్రభుత్వం ఐదు రాష్ట్రాలలో ఎన్ని కలు పూర్తయ్యేవరకు వేచి చూస్తుంది. ఆస్ట్రేలియా, ద.కొరియా, నేపాల్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, యూఎస్ఏ మొదలగు దేశాలలో ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన పొదుపుపై ఆ దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇంధన పొదుపు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించటం; పనివేళలు, పని దినా లను తగ్గించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువులను ఎదుర్కోవాలంటే...మన వంటిల్లు హార్మూజ్ జలసంధికి బందీ అవటం, మన ఎరువుల ఉత్పత్తికి గల్ఫ్ దేశాలపై ఆధారపడటం దేశ శక్తి భద్రత, ఆహార భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇంధన శక్తి, ఆహార ఉత్పత్తి దేశ మనుగడను శాసిస్తాయి. ఇలాంటి కీలక రంగాలలో స్వయం సమృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి. చమురు, సహజ వాయువుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. బొగ్గు, జల విద్యుచ్ఛక్తి, సౌర శక్తి, పవన శక్తి వంటి శక్తి వనరుల అభివృద్ధి మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాలి. సౌర శక్తి, పవన విద్యుచ్ఛక్తి ప్లాంట్ల నిర్మాణానికి కావలసిన పరికరాలకు చైనామీద ఆధారపడుతున్నాము. కీలక రంగాలలో దిగు మతులపై ఆధారపడకూడదు. ముఖ్యంగా అస్థిర (గల్ఫ్) దేశాల మీద, శత్రు దేశాల (చైనా) మీద అసలు ఆధారపడకూడదన్నది యుద్ధం మనకు నేర్పుతున్న గుణపాఠం. ఇరాన్ యుద్ధంలో విద్యుచ్ఛక్తి కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేంద్రాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవటం శత్రువుకు కలిసివస్తుంది. భారతదేశం కూడా చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తే, మొదటి దెబ్బ మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పైన, క్షిపణి కేంద్రాలపైన, యుద్ధయాన స్థావరాలపైన ఉంటుంది. డ్రోన్ల దండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మన విద్యుచ్ఛక్తి కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు దాడికి గురవుతాయి. ప్రాంతీయంగా వీటిని వికేంద్రీ కరించాల్సి ఉంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
-
నయిమ్ ఖాసిమ్ ను చంపేశాం ఇజ్రాయెల్ కీలక ప్రకటన
-
మా చేయి ట్రిగ్గర్ పైనే ఉంది... ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ స్టాంగ్ వార్నింగ్!
-
ఇంటి భోజనం తెచ్చుకోండి.. ఇంటి నుంచే పని చేయండి!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో అప్పట్లో ఐటీ సంస్థలలో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధంతో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ మొదలైంది. అయితే ఈసారి కొన్ని బహుళ జాతి సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సూచిస్తే.. మరికొన్ని కంపెనీలేమో ఇంటి నుంచి పని చేయాలని చెప్పాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ వంటి ఇంధన వనరుల కొరత తీవ్రమైన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల వాహన వినియోగం తగ్గింది. టెక్నాలజీ సంస్థలు నిత్యం ఉద్యోగస్తుల పికప్, డ్రాప్ సర్వీస్లనూ తగ్గించాయి. మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల కొరత ఐటీ ఆఫీసు క్యాంటీన్లలో మెనూ తగ్గింది. దీంతో ఐటీ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) తమ ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుంచి పని, హైబ్రిడ్ వర్క్ మోడళ్లను అవలంబిస్తున్నాయి. ఐటీ హబ్లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాల్లో హైబ్రిడ్, వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇంటి నుంచి భోజనం..వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్ ఐటీ కారిడార్లలో వసతి గృహాల్లో వంట గదులకు తాళం వేశాయి. ఆఫీసు క్యాంటీన్లలో వెండర్లు సేవలను నిలిపివేశాయి. దీంతో పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు క్యాంటీన్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. వీలైనంత వరకూ ఉద్యోగులు సొంత ఆహారాన్ని తెచ్చుకోవడం (బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్) విధానాన్ని పాటించాలని చెప్పాయి. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైన నేపథ్యంలో కంపెనీలు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడని ప్రత్యామ్నాయ ఆహార విక్రేతలతో ఒప్పందం చేసుకుంటున్నాయి. తగ్గిన ఆన్సైట్ వర్క్బహుళ జాతి సంస్థలు ఆన్సైట్ వర్క్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రధానంగా బడా ఐటీ సంస్థలు అమెరికా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలలో ఉద్యోగులను ఆన్సైట్కు పంపిస్తుంటాయి. అయితే తాజాగా ఆయా దేశాల్లో యుద్ధ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రయాణ పరిమితులను అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల భద్రత కోసం ఆన్సైట్ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, కేపీఎంజీ, జేపీ మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ప్రధాన టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల భద్రత, వ్యాపార కొనసాగింపు భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. -
ఇరాన్ యుద్దానికి బ్రేక్: ట్రంప్
ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. ఇప్పటికే విధించిన డెడ్లైన్ని మరో రెండు వారాల పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ దీనిని ప్రతిపాదించగా..దీనికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.ఇరాన్ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్తో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్ నుంచి వాషింగ్టన్కి 10 సూత్రాల ప్రతిపాదన అందిందని ట్రంప్ చెప్పారు. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపాదనలు వర్కబుల్ అని పేర్కొన్నారు. అలాగే.. కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. ఒకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ పున ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గనున్నాయి. -
షాకిచ్చిన ఇరాన్.. హర్మూజ్ మళ్లీ క్లోజ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికాసేపట్లో ముగియనుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అందోళన నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడంతో దాడుల తీవ్రత మరింత పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దాడుల తీవ్రతను పెంచేందుకు అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు పేల్చేస్తామని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇరాన్ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటామన్న ట్రంప్కాల్పుల విరమణ ప్రతిపాదనలకు ఒప్పుకోని ఇరాన్అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధం! -
ఇరాన్పై దాడులు మొదలుపెట్టిన అమెరికా
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందే ఇరాన్పై దాడులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇరాన్లోని అల్యూమినియం ఎక్కువగా ఉత్పత్తి చేసే అరక్ అల్యూమినియం కంపెనీపై ఇజ్రాయెల్-అమెరికా క్షిపణలు.. బుధవారం వేకువజామున దాడి చేశాయి. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. దీంతో సదరు కంపెనీ ఉన్న మాషార్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల (అమెరికాలో మంగళవారం రాత్రి 8 గంటలు) వరకు ఇరాన్కి అమెరికా గడువు విధించింది. అప్పటిలోగా హర్మూజ్ని తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలని నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా.. అమెరికా, దాని మిత్రదేశాలు తమ దెబ్బ రుచిచూస్తాయని ఇరాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మద్య జరుగుతున్న చర్చలకు ముగింపు పలికింది. శాంతి చర్చల్లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకురాగా దాన్ని ఇప్పటికే ఇరాన్ తిరస్కరించింది. -
ముగింపు లేని యుద్ధోన్మాదం
ట్రంప్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేయడం వారి విజ్ఞతకు నిదర్శనం. యుద్ధంలో గెలిచే శామనీ, ఇరాన్ లొంగిపోయిందనీ ట్రంప్ చేసిన ప్రకటనను మొదట్లో అందరూ నిజమేనని నమ్మారు. కానీ ఇరాన్ ప్రతిఘటన తీవ్రంగా ఉండటం, పెద్ద సంఖ్యలో అమెరి కన్ సైనికులు చనిపోవడం, హోర్మూజ్ జలసంధిని ఇరాన్ పరిరక్షించుకోవడం వంటి పరిణామాలు చూసిన తరువాత యుద్ధానికి సంబంధించి అధ్యక్షుడు తమకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని వారికి అర్థమైంది. ఇప్పటికే అమెరికాలో చమరు, గ్యాస్ ధరలు పెరిగాయి. తమ దేశం ఈ యుద్ధంలో అడ్డంగా ఇరుక్కుపోయిందనీ, దానినుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతున్నారనీ ప్రజలు గ్రహించారు. ‘ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఎన్నో ఏళ్లుగా వింటున్నాం. అలాగే అక్కడ ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తున్నారని కూడా విన్నాం. ఇప్పుడు నాకు అవేవీ వినబడటం లేదు. నా దేశంలో నేను కొనే గ్యాస్ (పెట్రోల్) ధర అమాంతం పెరిగిపోవడం ఒక్కటే నన్ను బాధిస్తోంది’ అని ‘బీబీసీ’ వార్తా సంస్థతో ఓ సగటు అమెరికన్ అనడం పరిస్థితికి అద్దం పడుతోంది. యుద్ధ విరమణ చేయించాలంటే తమకు భారీ ఎత్తున నష్టపరి హారం చెల్లించాల్సిందేనని ఇరాన్ షరతు విధించడం అమెరికాకు ఊహించని పరిణామం. ఇరాన్ను తక్కువగా అంచనా వేసి ఎదురు దెబ్బతిన్న నేపథ్యంలో, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న నిర్ణయం తనది కాదని చెప్పుకోవడానికి ట్రంప్ తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతా లలో కూడా ట్రంప్కు వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘నోకింగ్స్’ పేరుతో సాగుతున్న ఈ నిరసన జ్వాలలు యూరప్ నగరా లకు సైతం పాకాయి. భారత్ మాత్రం ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు... ట్రంప్కు మోదీ లొంగిపోయాడని విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాని సంయ మనం పాటిస్తున్నారు.స్వప్రయోజనాలే మిన్న ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింప జేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కొన్ని దేశాలు తమ సొంత ప్రయోజ నాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం మరో పార్శ్వం. హోర్మూజ్ జలసంధి నుంచి తమ రవాణా నౌకలు సజావుగా ప్రయా ణించడానికి సహకరించాలని ఇరాన్కు చైనా విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధంలో తమ పక్షాన నిలవాలని చైనాకు షరతు విధించింది. ప్రçస్తుతం చైనా కూడా తటస్థ వైఖరితోనే ఉంది. మరోవైపు ఇరాన్తో జరిపే చర్చలకు అమెరికా తమ దేశాన్ని వేదికగా చేసుకోవాలని కోరుతున్న పాకిస్తాన్ ఇరుపక్షాల నుండి లబ్ధి పొందాలని చూస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నట్లు పాకిస్తాన్ దళారీ పాత్ర పోషించి రెండు వైపులా లాభాలు పిండుకోవడానికి ఆరాటపడుతున్నది. ఇరాన్ కనుక హోర్మూజ్ జలసంధిని మూసివేసినట్లయితే భారత్ సహా పలు దేశాలు ఆర్థికంగా దెబ్బ తినడం ఖాయం. అందువల్ల ఇరాన్ను అమెరికాతో యుద్ధ విరమణ సంధికి ఒప్పించడానికి పశ్చిమాసియా, యూరప్ దేశాలు ఆతృత పడుతున్నాయి. ఇంగ్లాండ్లో ఆర్థిక పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అందువల్లనే ఆ దేశం కూడా వీలైనంత త్వరగా యుద్ధానికి స్వస్తి పలకాలని ట్రంప్కు సూచిస్తోంది.రష్యన్ మహా రచయిత టాల్స్టాయ్ చెప్పినట్లు, ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాకు రోజుకో బిలియన్ డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకులు, వారి కుటుంబ సభ్యులకు జరిగిన నష్టాన్ని లెక్కించడానికి ఏ కొలమానం ఉంది? ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అందుకే దాడి అని చెప్పిన ట్రంప్ మాటల్లోని డొల్లతనం కూడా ప్రపంచానికి అర్థమయ్యింది. ఇరాన్కు నిజంగానే అణ్వాయుధాలు ఉన్నట్లయితే వాటిని ఇంత కాలం ప్రయోగించకుండా ఉంటుందా? దేశ సార్వభౌమాధికారాన్ని ఎంత శక్తిమంతమైన దేశం ప్రశ్నించినా... చిన్న దేశాలు సహించవని చెప్పడానికి ఇరాన్ ఒక ఉదా హరణగా నిలుస్తుంది. గతంలో అమెరికాకు వియత్నాం, క్యూబాల నుంచి కూడా ఇటువంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయి. ఆ చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోని అమెరికన్ పాలకులు పదేపదే అవే తప్పులను చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధ నియ మాలను ఉల్లంఘిస్తూ వైరిపక్షాలు ఆడుతున్న ఈ వికృత క్రీడకు ఇప్పట్లో ముగింపు ఉంటుందా?డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు -
15 వేల క్షిపణులు.. 45 వేల డ్రోన్లతో ఇరాన్ రెడీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కి ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగిసిపోనున్న వేళ.. పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ ని ఒక్కరాత్రిలో తుడిచిపెట్టేస్తానని ట్రంప్ అల్టిమేటం ఇవ్వడం ఉత్కంఠకి గురిచేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ట్రంప్ బెదిరింపులకు దీటుగా బదులిచ్చింది.తమ వద్ద 15 వేల క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. అలానే 45 వేల డ్రోన్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మరోవైపు తమ దేశ ప్రజలను కూడా ఇరాన్ అప్రమత్తం చేసింది. ప్రజలంతా ఇంటి లోపలే ఉండాలని.. విద్యుత్ కేంద్రాలు, సైనిక కేంద్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలానే బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం సూచించింది. -
కోమాలో మోజాబా ఖమేనీ!
-
ఇది పవిత్ర యుద్ధం.... అమెరికాకు యేసుక్రీస్తు మద్దతు
-
యుద్దానికి సై.. US Vs ఇరాన్
-
ప్రపంచంలో అమెరికాను ఓడించే దేశం లేదు..
-
ప్రమాదపుటంచుల్లో దేశాలు
ఇజ్రాయెల్తో కలిసి ఏకపక్షంగా ఇరాన్పై యుద్ధం ప్రారంభించింది మొదలు అది ఇవాళో, రేపో పూర్తికాబోతున్నదని చెప్పడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అలవాటైపోయింది. తాజాగా ప్రకటించిన సోమవారం డెడ్లైన్ కూడా ఆ ప్రస్తావనే లేకుండా ముగిసిపోయింది. కావలసినట్టుగా కథనాలను వండివార్చిపెట్టే ఒక వార్తాసంస్థ ద్వారా మాత్రం అమెరికా, ఇరాన్లు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ‘ఇస్లామాబాద్ ఒడంబడిక’ కుదుర్చుకున్నాయనీ, రెండంచెల ఈ పథకంలో తక్షణ కాల్పుల విరమణ, అనంతరం కుదరబోయే సమగ్ర ఒప్పందం భాగమనీ సోమవారం లీక్ వదిలారు. కాల్పుల విరమణ 45 రోజులపాటు అమల్లో ఉంటుందని కూడా ఆ కథనం చెబుతోంది. కానీ 38వ రోజుకూడా యథావిధిగా దాడులు జరిగి, ఇరాన్కు చెందిన ఒక సహజవాయు క్షేత్రం ధ్వంసమైంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్లోని సమస్త మౌలిక సదుపాయాలనూ మంగళవారం ధ్వంసం చేయబోతున్నానని ట్రంప్ ప్రకటించినా అటునుంచి రాజీ స్వరం వినబడలేదు. పైపెచ్చు ఆయన వ్యాఖ్యలు తూగుతప్పిన మాటలని ఇరాన్ ప్రతిస్పందించింది. ‘మీ ప్రతిపాదనను పరిశీలించటానికి తగిన సమయం తీసుకుంటాం. ఈలోగా ఏ ఒత్తిడికీ లొంగేది లేదు. హార్మూజ్ను తెరిచేదిలేద’ ని కటువుగా సమాధానమిచ్చింది.నిఘా సంస్థలూ, రక్షణ దళాల ముఖ్యులూ హెచ్చరిస్తున్నా యుద్ధానికి కాలుదువ్విన ట్రంప్ దాన్నుంచి బయటపడే మార్గం కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఏ విధంగా చూసినా బలాబలాల విషయంలో తమతో సరిపోలని ఇరాన్ వంటి ఒక చిన్న దేశాన్ని పోరాడక తప్పని స్థితిలోకి నెట్టడం ద్వారా ప్రచార యుద్ధంలో దానిదే పైచేయి అయ్యేలా చూసిన ఘనత ట్రంప్కే దక్కుతుంది. సమవుజ్జీలు కాని ఇద్దరి మధ్య పోరు జరుగు తున్నప్పుడు సహజంగా బలహీనుడికే సహానుభూతి దక్కుతుందన్న ఇంగిత జ్ఞానం ఆయన మరిచారు. విద్యుదుత్పాదన ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు, నిర్లవణీకరణ ప్లాంట్లు మంగళవారం ధ్వంసం చేస్తామనటం అంటే యుద్ధనేరాలకు పాల్పడతానని చెప్పడమే! అమెరికా అధ్యక్షుడొకరు ఇలా బాహాటంగా ప్రకటించటం మునుపెన్నడూ లేదు. యుద్ధంవల్ల పౌరజీవితాలకు నష్టం వాటిల్లకూడదని, వారి ప్రాణాలకు ముప్పు రాకూడదని జెనీవా ఒప్పందాలూ, హేగ్ ఒడంబడికలూ, న్యూరెంబర్గ్ నియమాలూ, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రమూ ఘోషిస్తున్నాయి. ట్రంప్ వర్తమాన స్థితి నియంత్రణ లేని ట్రెడ్మిల్ ఎక్కిన మనిషిని పోలి ఉంది. అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది, దిగటానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లాపడే ప్రమాదం ఉంటుంది. యూదు జాతీయుడైన ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నెర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కుమ్మక్కై ఇరాన్ రెండ్రోజులకే పాదాక్రాంతమవుతుందని ట్రంప్ను నమ్మించిన పర్యవసానమే ఈ యుద్ధమని ‘మాగా’ శిబిరంలో అందరికీ తెలుసు. అమె రికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మొదలుకొని ‘మాగా’ సిద్ధాంతవేత్త స్టీవ్ బేనన్ వరకూ అందరిలోనూ వైట్హౌస్ను ‘ఇజ్రాయెల్ లాబీ’ శాసిస్తోందన్న ఆగ్రహావేశాలున్నాయి. ట్రంప్ బలమైన మద్దతుదారు చార్లీ కిర్క్ హత్య ఇలాంటి గొడవల పర్యవసానమేనని వదంతులున్నాయి. దానిపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో ‘మాగా’ మద్దతు దారు, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నిష్క్రమించాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో పడినందువల్లే యుద్ధంలో పాలుపంచుకోవాలంటూ యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిళ్లు తెచ్చారు. అవి ఫలించకపోవటంతో శాపనార్థాలు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క 70వ దశకంలో తప్ప ప్రపంచానికెప్పుడూ ఈ స్థాయిలో ‘ఆయిల్ షాక్’ తగల్లేదు. అసలే ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే లోటు బడ్జెట్లుండే కాలం గతించి, అవి రివాజుగా మారిన ఈ వర్తమానంలో ‘పులి మీద పుట్ర’లా ట్రంప్ తీసుకొచ్చిన ఈ యుద్ధంతో... ఇజ్రాయెల్, అమెరికాలను గుడ్డిగా సమర్థించే దేశాలు సైతం కష్టాల్లో కూరుకుపోయాయి. సగటు లోటు జీడీపీలో 2 శాతం మించని దేశాల్లో ఇప్పుడది 20 శాతానికి ఎగబాకే ముప్పు ముంచుకొస్తోంది. ఈ దశలో కూడా ట్రంప్ కళ్లు తెరవకపోతే ప్రపంచం మరింత సంక్షోభంలో పడుతుంది. -
ఇరాన్ తుడిచిపెట్టుకునిపోవచ్చు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్కి విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రెస్ మీట్ పెట్టారు. వైట్ హౌస్లో మాట్లాడుతూ తమ దేశానికి చెందిన రెండో పైలట్ని కూడా ఇరాన్ నుంచి రక్షించామని చెప్పుకొచ్చారు. అలానే డెడ్లైన్కి ముందు ఇరాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.'రేపటి(మంగళవారం) వరకు ఇరాన్కి గడువు ఉంది. డెడ్ లైన్ తర్వాత ఇరాన్కి గడువు పొడిగింపు ఉండదు. ఇరాన్ దిగిరాకపోతే ఆ దేశ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తాం. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా కొనసాగుతుంది. రెండో పైలట్ని ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించాం. అతడి కోసం భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ని సమర్థంగా నిర్వహించినందుకు గర్విస్తున్నాం. ఏడు గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో అమెరికన్ సైనికులు గాయపడలేదు''ఏ దేశానికి లేని విధంగా అమెరికాకు ఆయుధాలు ఉన్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం. శత్రువులకు చిక్కకుండా ఎత్తయిన కొండపైకి పైలెట్ చేరుకున్నాడు. అన్ని ప్రమాదాలని ధ్వంసం చేసి పైలట్ని రక్షించాం. మా హెలికాప్టర్లు పది నిమిషాల్లో తమ పని పూర్తిచేశాయి. వేలాది విమానాలతో దాడి చేస్తే ఇరాన్ ఒక్క విమానాన్నే కూల్చింది. రేపు ఇరాన్ తుడిచిపెట్టుకునిపోవచ్చు' ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.శుక్రవారం ఇరాన్ ఐఆర్జీసీ దళాలు ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ను కూల్చిశాయి. దీంతో అందులో ఉన్న పైలట్, మరో పైలట్ (వెపన్ ఆఫీసర్) ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే వారిలో ఒకరిని అమెరికా ముందుగానే రక్షించింది. రెండో పైలట్ని చాలా కష్టపడి రక్షించుకుంది. హాలీవుడ్ సినిమాను తలపించే రీతిలో 24 గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్లో అదృష్టం రెండు దేశాల వైపు దోబూచులాడి చివరికి అగ్ర దేశాన్నే వరించింది. శత్రుగడ్డపై చిక్కుకున్న తమ పైలట్ను అమెరికా బలగాలు ప్రాణాలకు తెగించి రక్షించాయి.అంతకు ముందు అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనని ఇరాన్ తిరస్కరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. 'నేను చాలా నిరాశకు గురయ్యాను. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు' అని హెచ్చరించారు. ఇరాన్ చేయాల్సినవి చేస్తే ఈ ఉద్రిక్తతలు త్వరగా ముగిసిపోవచ్చని పేర్కొన్నారు. ఆ దేశానికి విధించిన గడువును మంగళవారం తర్వాత ఇక పొడిగించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ప్రెస్మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. -
శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే
-
45 రోజుల పాటు కాల్పుల విరమణ
-
ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం
-
Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఏకంగా 30కి పైగా విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ సైన్స్ మంత్రి హొస్సేన్ సిమై సర్రాఫ్ స్వయంగా వెల్లడించారు. విద్యా, వైద్య కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.తాజాగా ఉత్తర టెహ్రాన్లోని ‘షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ’తో పాటు పశ్చిమాన ఉన్న ‘మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం’పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో క్యాంపస్ భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 1960లో స్థాపించిన ఈ వర్సిటీ వేలాది మంది విద్యార్థులకు, పరిశోధకులకు ఓ కీలక కేంద్రం. దాడితో దెబ్బతిన్న ప్రాంతాన్ని శనివారం మంత్రి సర్రాఫ్ పరిశీలించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30కి పైగా వర్సిటీలపై దాడులు జరిగాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, ఆస్పత్రులు, పౌర ఆరోగ్య కేంద్రాలపై జరుగుతున్న దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘన చరిత్ర కలిగిన బయోమెడికల్ కేంద్రం ‘పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్’పై కూడా దాడులు జరిగాయని, భవనాలు భారీగా దెబ్బతినడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హూ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. దాడి జరిగినప్పటికీ పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో అత్యవసర సేవలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి నిరంతరాయంగానే కొనసాగుతున్నాయని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ ఆరోగ్య శాఖ, ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపాయి.ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా దేశాల్లోనూ ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయని, వాటికి తక్షణ సాయం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ భీకర పోరు కారణంగా ఆయా దేశాల్లో ఇప్పటికే 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలసబాట పట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: మ్యాగీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు! -
345 మంది భారత మత్స్యకారులకు ఊరట
చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్లో చిక్కుకుపోయిన 345 మంది భారతీయ మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం వీరంతా చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతల కారణంగా గత నెల రోజులుగా పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్లో చిక్కుకున్న మన మత్స్యకారులను రక్షించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. వారిని ఆర్మేనియా మీదుగా విజయవంతంగా భారత్కు తరలించింది. ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి, మత్స్యకారుల తరలింపునకు సహకారం అందించిన ఆర్మేనియా ప్రభుత్వానికి, ఆ దేశ విదేశాంగ మంత్రి అరరత్ మీర్జోయాన్కు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమాసియాలో సంఘర్షణ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 1,500 మందికి పైగా భారతీయులు ఇరాన్ సరిహద్దుల గుండా ఆర్మేనియా, అజర్బైజాన్ మార్గాల ద్వారా సురక్షితంగా భూమార్గం గుండా బయటపడ్డారు. గల్ఫ్ దేశాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రవాస భారతీయుల భద్రత, రక్షణ తమకు ముఖ్యమని ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఇదిలా ఉండగా శుక్రవారం అబుదాబిలో జరిగిన ఒక దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. శత్రువుల క్షిపణిని గాల్లోనే అడ్డుకున్న సమయంలో, దాని శకలాలు కింద పడి మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు మన దేశానికి చెందిన పౌరులు ఉన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన అబుదాబిలోని భారత ఎంబసీ, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు వైద్య సహాయం అందిస్తోంది. గాయపడిన ఐదుగురిలో నలుగురు ఇప్పటికే కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని భారత ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: కువైట్లో ఉద్రిక్తత: ఆయిల్ కాంప్లెక్స్పై భీకర డ్రోన్ దాడి -
ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
-
ఇరాన్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు ఇక చుక్కలే..
-
ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్
-
గుండె గుభేల్: యుద్ధం మరో 20 రోజులు?
న్యూఢిల్లీ: అమెరికా- ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఆహార భద్రతకు గుదిబండలా మారాయి. అగ్రరాజ్యం అమెరికా అంచనా ప్రకారం ఈ యుద్ధం మరో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశం ఉండటంతో, సామాన్యుని సరుకుల బిల్లు తడిసి మోపెడయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలను పెంచడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి.రికార్డు స్థాయిలో ఆహార ధరల సూచీఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ (ఎఫ్ఏఓ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ప్రపంచ ఆహార ధరల సూచీ 2.4 శాతం మేరకు పెరిగింది. ఇది గత ఏడాది సెప్టెంబర్ తర్వాత నమోదైన గరిష్ట స్థాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, వ్యవసాయ పెట్టుబడి వ్యయాలు భారం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ యుద్ధం గనుక మరో 20 రోజులకు పైగా కొనసాగితే.. రైతులు సాగును తగ్గించడం లేదా తక్కువ ఎరువులు వాడే పంటల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఎఫ్ఏఓ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో ఆందోళన వ్యక్తం చేశారు.చుక్కలు చూపిస్తున్న నూనె, పంచదార..వంట నూనెలు, పంచదార ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు 5.1శాతం పెరగగా, పామాయిల్ ధరలు 2022 నాటి గరిష్ట స్థాయికి చేరాయి. పంచదార ధర కూడా 7.2శాతం మేరకు పెరిగి రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. మరోవైపు గోధుమల ధరలు కూడా 4.3 శాతం పెరగడం గమనార్హం.భారత రైతులకు ఎరువుల కష్టంఈ యుద్ధం భారతీయ రైతాంగంపై నేరుగా ప్రభావం చూపనుంది. భారత్ తన ఎరువుల అవసరాల్లో దాదాపు 26 శాతం పశ్చిమ ఆసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా ఎరువుల కొరత తప్పదని ‘కేర్ ఎడ్జ్’ రేటింగ్స్ హెచ్చరించింది. మరోవైపు భారత్లో పొద్దుతిరుగుడు నూనె వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మేరకు తగ్గే అవకాశం ఉందని ‘క్రిసిల్’ అంచనా వేసింది.ఎల్పీజీపై ఐఓసీ (ఐఓసీ) క్లారిటీవంట గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 28 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నామని తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, సరఫరా స్థిరంగా ఉందని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. ఏదిఏమైనప్పటికీ యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ‘ధరల మంట’ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని చంపేయండి’.. పాక్లో అల్లకల్లోలం -
‘మమ్మల్ని చంపేయండి’.. పాక్లో అల్లకల్లోలం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం, ఆపై ప్రధాని దిగిరావడం.. వెరసి పాకిస్తాన్ ప్రస్తుతం ఒక అగ్ని గుండంలా మారిపోయింది.యుద్ధం మొదలై నెల రోజులు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. 85 శాతం చమురును ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా దిగుమతి చేసుకునే పాకిస్తాన్కు ఇది శాపంగా మారింది. శుక్రవారం రాత్రి పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఏకంగా 42.7 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 485కి చేరుకుంది. ఈ నిర్ణయంతో జనం బెంబేలెత్తిపోయారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గక తప్పలేదు. పెంచిన ధరను అదే రోజు రూ. 378కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ తగ్గిన ధర కనీసం నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. మీ జీవితాలు సాధారణ స్థితికి వచ్చే వరకు నేను విశ్రమించను’ అని ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పెట్రోల్ ధర తగ్గించినప్పటికీ, డీజిల్ ధర సామాన్యుడిని వణికిస్తోంది. లీటర్ డీజిల్ ధరను రూ. 335.86 నుంచి ఏకంగా రూ. 520.35కి పెంచారు. అయితే, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దానిపై విధించే లెవీని తొలగించింది. మరోవైపు బంగ్లాదేశ్లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎల్పీజీ (ఎల్పీజీ), సీఎన్జీ (సీఎన్జీ)ధరలను 29 శాతం మేర పెంచారు.పాక్ ప్రభుత్వం ప్రకటించిన ఊరట చర్యలుపాకిస్తాన్లో ప్రజా నిరసనల సెగను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక రాయితీలను ప్రకటించిందిఉచిత ప్రయాణం: ఇస్లామాబాద్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సుల్లో 30 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.సబ్సిడీలు: సింధ్ ప్రభుత్వం మోటార్ సైకిలిస్టులకు, చిన్న రైతులకు ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది.రవాణా ఛార్జీలు: పెరిగిన ధరల భారాన్ని ప్రయాణికులపై వేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ రవాణాదారులను కోరారు.వీధుల్లోకి జనం: ‘మమ్మల్ని చంపేయండి’లాహోర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ‘ప్రభుత్వం మాపై పెట్రోల్ బాంబు వేసింది. మమ్మల్ని చంపేయండి. ఈ భారాన్ని మేము భరించలేము’ అని నిరసనకారుడు నవీద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నిరసనకారుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఇది కేవలం యుద్ధం వల్ల వచ్చిన ధరల పెరుగుదల కాదని, ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.ముందున్నది గడ్డు కాలమే..పాకిస్తాన్ జనాభాలో దాదాపు 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంధన ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. మార్చి 28న ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రాథమిక ఒప్పందం కుదిరినప్పటికీ, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే వారాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటివే. యుద్ధం సద్దుమణగకపోతే దాయాది దేశ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.ఇది కూడా చదవండి: స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి.. -
ఇరాన్ స్కూల్స్ ను టార్గెట్ చేసిన అమెరికా-ఇజ్రాయెల్
-
అజిత్ దోవల్ రెడ్ ఫైల్ లో ఏముంది? యుద్ధానికి సిద్ధమవుతున్న ఇండియా!
-
యుద్ధం వల్ల రేడియేషన్ వచ్చేసింది జాగ్రత్త
-
ఇరాన్ వీధుల్లో శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
-
ఒప్పందం చేసుకోండి.. ట్రంప్ అసహానానికి గురవుతున్నారు: జేడీవాన్స్
ఇరాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. -
యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు
లండన్: ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది. -
ఒంటరి మానవుడు ట్రంప్!
ఇరాన్తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది. మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. -
యుద్ధంలోకి నేరుగా గల్ఫ్ దేశం?
మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా గల్ఫ్ దేశం నేరుగా యుద్ధంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. హార్మూజ్ జలసంధిపై మూసివేతతో వాణిజ్య సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యుఏఈ నేరుగా యుద్ధంలోకి దిగేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు.ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి సైనిక చర్య చేపట్టాలని UAE నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని బహ్రెయిన్తో కలిసి యూఏఈ పావులు కదుపుతోన్నట్లు వాల్స్ట్రీట్ జనరల్ కథనం పేర్కొంది.హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించడంతో పాటు అక్కడ సైనిక పహారా కాయడానికి ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకవేళ యుఏఈ యుద్ధంలో దిగితే ఆ అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నమెుదటి గల్ఫ్ దేశంగా నిలుస్తోంది. టెహ్రాన్ను ఎదుర్కోవడానికి తమ దేశం ముఖ్యమైన దేశాలతో కొత్త పొత్తులను నిర్మిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన తరువాత యూఏఈ యుద్ధంలోకి దిగుతుందని ప్రచారం జరుగుతుంది. -
హర్ముజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ భీకర దాడి..
-
Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు
కన్యాకుమారి/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు, కన్యాకుమారికి చెందిన సుమారు 600 మంది మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశాయి. స్వదేశంలో నెలల తరబడి చెమటోడ్చినా దక్కని ఆదాయం, అక్కడ కేవలం పది రోజుల్లోనే చేతికి అందేది. ఆ ఆశే వారిని ఏడు సముద్రాలు దాటించి, ఇరాన్ తీరానికి చేర్చింది. అయితే నేడు అక్కడ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇరాన్లోని బుషెహర్, దాని పరిసర తీర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ‘స్క్రోల్ ఇన్’కు ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం గత ఫిబ్రవరిలో ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ మరణించిన తర్వాత మొదలైన వైమానిక దాడులు, బాంబుల వర్షం.. ఇరాన్లోని మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం తిండి, నీరు, కనీస వైద్యం అందక పడవలపైనే కాలం వెళ్లదీస్తున్న వీరి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.ఒకే సిమ్ కార్డు.. 12 మంది వినియోగంకన్యాకుమారిలోని మత్స్యకార కుటుంబానికి చెందిన షాజీ.. ఇరాన్లో చిక్కుకున్న భర్త రవికుమార్ నుంచి వచ్చే ఫోను కోసం నిత్యం ఎదురు చూస్తుంటుంది. ఇరాన్లో చిక్కుకున్న బాధితుల వద్ద కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా కరువయ్యాయి. రవికుమార్తో పాటు మరో 12 మంది కలిసి కేవలం ఒకే ఒక్క సిమ్ కార్డును వాడుతున్నారు. ‘బాంబుల శబ్దంతో నిద్ర పట్టడం లేదు.. ఆహారం నిండుకుంది’ అని వారు ఫోన్లో చెబుతుంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎటు నుంచి క్షిపణులు వస్తాయో తెలియని స్థితిలో మత్స్యకారులు కాలం వెళ్లదీస్తున్నారని ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపారుఅప్పుల ఊబిలో కుటుంబాలుతమ వారిని క్షేమంగా తిరిగి భారత్ రప్పించేందుకు ఇక్కడి మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాయి. మేరీ రాజ్ అనే మహిళ తన 20 ఏళ్ల కుమారుని ఉపాధి కోసం తన ఒంటి మీద ఉన్న నగలను తాకట్టు పెట్టి, రూ.1.5 లక్షలు అప్పు చేసింది. విదేశాల్లో బాగా సంపాదిస్తారని అక్కడికి పంపిస్తే, ఇప్పుడు ప్రాణాలతో కుమారుడు వస్తే చాలని మేరా రాజ్ దేవుడిని వేడుకుంటోంది.అక్కడి సౌకర్యాలే శాపమయ్యాయా?భారతదేశంలో చేపల వేట తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో మత్స్యకారులు ఇరాన్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇరాన్లో అనారోగ్యానికి గురైతే హెలికాప్టర్లు పంపే స్థాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం కారణంగా అక్కడి యజమానులు కూడా చేతులెత్తేస్తున్నారు. మత్స్యకారుల పాస్పోర్టులు యజమానుల వద్దే ఉండటం, భాష తెలియకపోవడం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంపాదన ఆశ చూపి తీసుకెళ్లిన యజమానులు ఇప్పుడు భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేయడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది.ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనయుద్ధ ప్రాంతం నుంచి విద్యార్థులను తరలించిన కేంద్ర ప్రభుత్వం, సముద్రం మధ్యలో చిక్కుకున్న మత్స్యకారుల విషయంలో అలసత్వం వహిస్తోందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోలాహలంలో ఉన్న అధికారులు, ఈ నిరుపేద మత్స్యకారుల గోడును పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న తమ వారిని కాపాడాలని కన్యాకుమారి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత -
సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్లో క్షణాల్లో డెలివరీ
సాక్షి, రాజమహేంద్రవరం: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొందరికి వంటింటి కష్టాలు తెచ్చి పెడుతోంటే.. కొంతమంది గ్యాస్ సరఫరా డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గ్యాస్ కొరతను బూచిగా చూపుతూ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసిన 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 45 రోజులకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి ధర గృహ వినియోగానికి అవసరమయ్యే ఒక్కో సిలిండర్ సాధారణ ధర రూ.900 ఉంటే.. ప్రస్తుతం అవసరాన్ని బట్టి రూ.2,000ల నుంచి రూ.2,500లకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.3,500కు పైగా పలుకుతోంది. అధిక ధరలైనా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా డీలర్లు బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొన్ని ఏజెన్సీలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చిన్నపాటి హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు వంటివి నిర్వహించే చిరు వ్యాపారులపై వంట గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్ద హోటళ్లు, కేఫ్లు 1.20 లక్షలు ఉంటాయి. వీటిపై సుమారుగా 3 లక్షలకు పైగా శ్రామికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు మూసివేశారు. మరికొన్ని హోటళ్లు కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నాయి. వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయంతోనే బతుకుబండి లాగుతుంటారు. ప్రస్తుతం గ్యాస్ లభించకపోవడం, దొరికినా.. అధిక ధర వెచ్చించాల్సి వస్తుండటంతో ఆహార పదార్థాల ధరలను ఆ మేరకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వ్యాపారాలు ఆపేస్తే పస్తులు ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు చెల్లించే వారికి గ్యాస్ క్షణాల్లో ప్రత్యక్షం అవుతోంది. సాధారణ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం రోజుల సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్లు పెట్టుకుని బ్లాక్లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొందరు అధికారులు గ్యాస్ బ్లాక్ దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫారసుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. దొంగ బుకింగ్లు వినియోగదారుల పేరుతో అక్రమంగా బుకింగ్లు చేసి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో గ్యాస్ సరఫరా దారులు అడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.23 రోజులుగా అవస్థలు జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉండగా.. 18.32 లక్షల జనాభా ఉంది. 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. 8.67 లక్షల వివిధ రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 23 రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా బుకింగ్లు ఇప్పటికే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అధికారుల గణాంకాల మేరకు సాధారణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు 11,500 గ్యాస్ సిలిండర్లు బుక్ అవుతాయి. యుద్ధం ఆందోళనల నేపథ్యంలో రోజుకు 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్లు నమోదవుతున్నాయి. ఒక్కో సిలిండర్కు సగటున రూ.1,000 అధికంగా వసూలు చేస్తున్నారని భావించినా.. రోజుకు రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు అడ్వాన్స్గా బుక్ చేసి పెట్టుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ క్షణాల్లో ముగిసేది. ప్రస్తుం సర్వర్లు బిజీగా మారిపోవడంతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు
టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమి నుంచి అందుతున్న మృతుల గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ఇరాన్: మరణాల హోరుయుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల సంస్థ ‘హర్నా’ లెక్కల ప్రకారం, ఇక్కడ ఇప్పటివరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా, కనీసం 236 మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900 గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేస్తోంది. యాక్టివ్ వార్ జోన్ కావడంతో అసలు మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు..యుద్ధం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదులెబనాన్: ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో 1,268 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 124 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు కూడా హతమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు ఇండోనేషియా యూఎన్ శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు.ఇరాక్: ఇక్కడ పౌరులు, మిలిషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు.గల్ఫ్ దేశాలు: యుద్ధం సెగ గల్ఫ్ దేశాలకూ తగిలింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈలో 10 మంది, కువైట్లో ఏడుగురు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్ తదితర ప్రాంతాలుఇటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిస్సైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్లో 19 మంది పౌరులు, సరిహద్దు పోరులో 10 మంది సైనికులు మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్లో ఇరాన్ మిస్సైల్ పడి నలుగురు పాలస్తీనా మహిళలు మృతి చెందగా, సిరియాలో మరో నలుగురు బలయ్యారు. ఇరాక్లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు, ఛిద్రమైన ఎన్నో కుటుంబాల గాథలు. యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో ఈ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. -
పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్
-
అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
యుద్ధం వెనుక లాభాల ఆటా?
-
డీల్ కి ఇరాన్ ఒప్పుకోకపోతే..!ఎనర్జీ టార్గెట్ పై ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
-
చమురు ట్యాంకర్ పై డ్రోన్లతో ఇరాన్ దాడి.. నౌకలో 24 మంది సిబ్బంది
-
జవాన్లకు న్యాయ సౌలభ్యం కల్పించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర శ్లాఘనీయమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వారికి మెరుగైన న్యాయసౌలభ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం సరిహద్దుల్లో ఒక యుద్ధం, న్యాయపరమైన హక్కుల కోసం మరో యుద్ధం, ఇలా రెండు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులను వారికి రానివ్వరాదన్నారు. లేహ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. కోర్టులు న్యాయవ్యవస్థ, రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పిస్తుండగా, సాయుధ బలగాలు అందుకు అవసరమైన ఆదర్శాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయని ఆయన తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, గౌరవం, సమానత్వం, న్యాయం దేశ ప్రజలకు అందించేందుకు తగిన రక్షణను, పరిస్థితులను కల్పించిన ఘనత సైనికులకే దక్కుతుందన్నారు. -
అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?
-
ట్రంప్ కొత్త యుద్ధ వ్యూహం? ఇరాన్ ఆయిల్పై కన్ను
-
తొలిసారి ఆ మిస్సైల్స్ వాడుతున్న US ఇక ఇరాన్ పని అయిపోయినట్టే..!
-
యుద్దం వేళ.. పాక్లో కీలక భేటీ! శాంతి చర్చలకు రంగం సిద్ధం
-
పాక్ కు షాకిచ్చిన ఇరాన్ .
-
ఇజ్రాయెల్ ధీమా.. తగ్గేదేలే అంటున్న ఇరాన్
-
యుద్ధ పరిస్థితులే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్కవరింగ్కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్ వ్యూఇండిగో పెయింట్స్బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్ఖాన్ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్హెచ్సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
మోజ్తాబా ఖమేనీ లేఖ విడుదల.. ఏమన్నారంటే?
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా చేస్తున్న దురాక్రమణ ఖండించి ఇరాన్కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ బ్రతికి ఉన్నారో లేదో తెలియదు అని అన్నారు. అమెరికా జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోజ్తాబా ఖమేనీ ఇరాక్కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు.ఆ లేఖలో " అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధంలో మా దేశానికి మద్దతుగా నిలిచిన ఇరాక్ మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అలాగే ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలు". అని లేఖలో పేర్కొన్నారు. ఇరాన్పై జరుగుతున్న దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఇరాక్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవడాన్ని అభినందించారు.కాగా ఆయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ మూడవ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకూ మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం కొన్ని రాతపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు. గతంలో జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. -
యుద్ధం లాభదాయకమే: కియోసాకి కామెంట్స్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక విశ్లేషకుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదని చెబుతూనే, అది ఏ విధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందో ఆయన వివరించారు.నాటి యుద్ధ జ్ఞాపకాలు..వియత్నాం యుద్ధ కాలం నాటి ఒక నిరసన గీతాన్ని ప్రస్తావిస్తూ.. "యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు" అని ఆయన పేర్కొన్నారు. స్వయంగా వియత్నాం యుద్ధంలో (1966, 1971-72) పాల్గొన్న కియోసాకి, తన స్నేహితులను కోల్పోయిన బాధను గుర్తు చేసుకున్నారు. మూడు వారాల క్రితమే తాను వియత్నాం వెళ్లి తన పాత స్నేహితులకు వీడ్కోలు పలికి, మనశ్శాంతిని పొందినట్లు ఆయన తెలిపారు.యుద్ధం వల్ల భారంగా మారుతున్న సామాన్యుడి జీవితంప్రస్తుతం 'పవిత్ర భూముల్లో' (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కేవలం ప్రాణనష్టం మాత్రమే కాకుండా, యుద్ధానికి దూరంగా ఉన్న దేశాల్లోని ప్రజలు కూడా ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు. యుద్ధాల వల్ల దేశాల అప్పులు విపరీతంగా పెరుగుతాయన్నారు. పెరిగే ధరల వల్ల సామాన్యుడు పేదరికంలోకి నెట్టబడతాడని, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు.సంక్షోభంలోనే సంపద సృష్టియుద్ధం అనేది మానవత్వానికి నష్టమే అయినా, ఆర్థికంగా అది కొంతమందికి లాభాలను తెచ్చిపెడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. "యుద్ధం వల్ల దేశాలు అప్పుల ఊబిలో ఉన్నంత మాత్రాన మీరు ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదు. సరైన ఆర్థిక విద్య (Financial Education) ఉంటే ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధనవంతులు కావచ్చు" అని ఆయన సూచించారు. మీ మెదడు, మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే మీ గొప్ప ఆస్తులని, మంచి గురువులను ఎంచుకుని ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు.“WAR: What is it good for?Absolutely nothing.”The above are words from a Vietnam era protest song.Tragically war is profitable. If war was not proftsble….would we have wars?FYI: I served in Vietnam twice…once in 1966 and 1971-72.I lost many friends in Vietnam. I…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 29, 2026 -
యుద్ధానికి నెల రోజులు.. ఊహించని మలుపు అగ్నిగుండంగా మిడిల్ ఈస్ట్!
-
ఎరువు.. ఇక బరువే..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల కొరత వచ్చే ఖరీఫ్ సాగుకు ప్రతిబంధకంగా మారే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా టన్ను ధర (ప్రస్తుతం 680 డాలర్లు) యుద్ధం మొదలయ్యాక 48% పెరిగింది. దీంతో మొత్తంగా వార్షిక ఎరువుల సబ్సిడీ 25% పెరిగి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందని ‘క్రిసిల్’(క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అంచనా. కింకర్తవ్యం? దిగుబడులు తగ్గకుండా చూసుకుంటూనే రసాయనిక ఎరువుల కొరతను అధిగమించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలేమిటి? నిపుణులు ఏమంటున్నారంటే? -(సాక్షి, స్పెషల్ డెస్క్) నిల్వలు ఎంత ఉన్నాయి? » రానున్న ఖరీఫ్ పంట కాలానికి మన దేశానికి ఎంత మొత్తంలో రసాయనిక ఎరువుల అవసరం ఉంటుంది? గత ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూరియా 19.3 మిలియన్ టన్ను లు, ఎన్పీకే (మొక్కలకు ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరమైన పోషకాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం) 8.1 మిలియన్ టన్ను లు, డీఏపీ 4.6 మిలియన్ టన్నులు, పొటాష్ 1.1 మిలియన్ టన్నులు వినియోగించాం. » అయితే, ఈ నెల 10 నాటికి భారత ప్రభు త్వం దగ్గర ఉన్న నిల్వ ఎంత? యూరియా 6.2 మిలియన్ టన్నులు, ఎన్పీకే 5.63 మిలియన్ టన్నులు, డీఏపీ 2.51 మిలియన్ టన్నులు, పొటాష్ 1.29 మిలియన్ టన్నులు నిల్వ ఉన్నా యని కేంద్ర ఎరువుల శాఖ, క్రిసిల్ ఇంటెలి జెన్స్ల సమాచారం. అంటే, యూరియా లభ్యత ప్రస్తుతానికి 65% వరకు తక్కువగా ఉంది. » యుద్ధం కారణంగా పశ్చిమాసియా యేతర దేశాల నుంచి ఎరువులను ఎక్కువగా దిగుమతి చేసుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో టన్ను యూరియా ధర ఇప్పటికే 48% పెరిగింది. 2026–27 బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ రూ. 1.7 లక్షల కోట్లని కేంద్రం అంచనావేసింది. మారిన పరిస్థితుల్లో ఇది 25% మేరకు పెరిగి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందని క్రిసిల్ అంచనా.నిబంధనలు సడలించాలి!రసాయనిక ఎరువుల గుళికలను పొడిగా మార్చి వాడితే 20–30 శాతం గుళికల ఎరువులతోనే ఇప్పటికన్నా అధిక దిగుబడి సాధించవచ్చని, 70–80 శాతం ఎరువులను దిగుబడిలో రాజీపడకుండానే ఆదా చేసుకోవచ్చని రోజ్మేరీ ఔషధ పంటపై మా పరిశోధనల్లో రుజువైంది. నానో ఎరువుల పొడిని నేలపై వెయ్యవచ్చు, పిచికారీ చెయ్యవచ్చు. వరి, టమాటా వంటి ఏకదళ, ద్విదళ పంటలన్నిటికీ ఈ టెక్నాలజీ వాడొచ్చు. రసాయనిక ఎరువుల గుళికలను పొడిగా మార్చి వాడటం వల్ల ఎరువును సమర్థవంతంగా వాడుకోవటం సాధ్యమవుతుంది. నిబంధనల నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇస్తే మాత్రమే నానో ఎరువుల పొడి టెక్నాలజీని రైతులకు సత్వరమే అందుబాటులోకి తేవడం సాధ్యపడుతుంది. – ప్రొ. వీవీఎస్ఎస్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? » పొదుపుగా వాడటం: రసాయనిక ఎరువుల అతి వినియోగా న్ని తగ్గించటం, వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) తాజా నివేదిక ప్రకారం సిఫారసు కన్నా యూరియా వినియోగం పంజాబ్లో 61%, తెలంగాణలో 54% ఎక్కువగా ఉంది. » నానో ఎరువులు: నానో ఎరువుల్లో రెండు రకాలున్నాయి.. ఇఫ్కో నానో ద్రవరూప ఎరువుల సాంకేతికత ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) రూపొందించిన నానో పొడి ఎరువుల టెక్నాలజీ రెండోది. నానో యూరియా, నానో డీఏపీ వంటి ‘ద్రవ’రూప ఎరువులను రైతుల సహకార సంస్థ ‘ఇఫ్కో’అభివృద్ధి చేసి ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధకులు రూపొందించిన మరో రకం ‘నానో పొడి ఎరువుల టెక్నాలజీ’కూడా అందుబాటులో ఉంది. గుళికల రూపంలో రసాయనిక ఎరువులను 100 కిలోలు వాడే బదులు, ఈ టెక్నాలజీ తో ఆ గుళికలను పిండిగా మార్చి వాడుకుంటే 20– 30 కిలోలతోనే సరిపోతుంది. 70–80% ఎరువు ఆదా అవుతుంది. అంతేకాదు, చాలు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రొ. వీవీఎస్ఎస్ శ్రీకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. » ప్రకృతి సేద్యపు బాట: ప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని నిర్మాణాత్మకంగా ప్రోత్సహించడం. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చెయ్యడం ద్వారా రైతులను రసాయన రహిత సేద్యం వైపు ఆకర్షించవచ్చు. తొలి ఏడాదే దిగుబడి తగ్గకుండా జాగ్రత్తపడే ప్రకృతి సేద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. విధాన విశ్లేషకులు డా. దొంతి నరసింహారెడ్డి ఒక నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను భారత ప్రభుత్వానికి సూచించారు. -
సూపర్ ‘పవర్గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇరాన్ సరిహద్దులకు 17 వేల మంది అమెరికా సైనికులు
-
యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు
-
ఇరాన్ మిస్సైల్ పై థాంక్యూ ఇండియా
-
ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు
-
పట్టు బిగించిన ఇరాన్.. ఇక భీకర యుద్ధమే
-
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్పై పట్టు బిగించిన ఇరాన్
-
ఇరాన్ కు ట్రంప్ ఆఫర్
-
అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వేళ భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ నాయకత్వం వహించడం భారత్కు ‘అవమానకరం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.భారత్కు దక్కిందేమిటి?ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆపై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు శాంతి చర్చలకు చొరవ చూపుతుంటే, భారత్ వెనుకబడిపోవడంపై థరూర్ అసహనం వ్యక్తం చేశారు.‘ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పేవిధంగా.. భారత్ శాంతి దూతగా నిలుస్తుందని ఆశించి, ప్రభుత్వం వహిస్తున్న మౌనాన్ని సమర్థించాను. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా పాకిస్తాన్కు వెళ్తుంటే చూడటం బాధాకరం. ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.‘దళారీ దేశం కాదు’: జైశంకర్ కౌంటర్విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా స్పందించారు. ‘భారత్ ఏమీ దళారీ దేశం కాదు" అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 1981 నుండి అమెరికా పాకిస్తాన్ను ఒక సాధనంగా వాడుకుంటూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల అన్ని పక్షాలు నష్టపోతున్నాయని, దీనిని త్వరగా ముగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టం చేశారని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం! -
అమెరికా ఫైటర్ జెట్ను కూల్చేసాం.. ఇరాన్ కీలక ప్రకటన
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్కు చెందిన ఫైటర్ జెట్ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Iran's Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3— Press TV 🔻 (@PressTV) March 25, 2026 -
పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?
-
యుద్ధం మరో స్థాయికి.. గల్ఫ్ దేశాలకు 3 వేలమంది అమెరికా పారా ట్రూపర్లు
-
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
యుద్ధం తెచ్చిన కష్టాలు.. హైదరాబాద్ లో నో పెట్రోల్ ?
-
ఫలించని ట్రంప్ పిలుపు.. ఆగని ఇజ్రాయెల్,ఇరాన్ యుద్ధం
-
ఐనా.. ఆగని దాడులు!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినా మిత్ర దేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా దీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులకు దిగింది. అంతేగాక ‘పూర్తి విజయం’సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది! దీనికితోడు అమెరికా కూడా వేలాదిమంది మెరైన్ సైనికులను గల్ఫ్కు పంపిస్తోంది. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడం లేదు.దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాలన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ విషయమై ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్టు వెల్లడించింది. యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ సోమవారం ప్రకటించడం తెలిసిందే. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్కు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జెరేద్ కుష్నర్ వాటిలో పాల్గొంటున్నారు. చర్చలు ఈ వారమంతా కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఖండించింది. చమురు క్షేత్రాలకు నష్టం ఇరాన్లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు విన్పించాయి. దాడుల్లో రెండు ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బ తిన్నట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. ‘‘ఇస్ఫహాన్లోని సహజవాయు కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఖొర్రంషార్లో కీలక విద్యుత్కేంద్రానికి గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి’’అని పేర్కొంది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అపార్ట్మెంట్పై జరిగిన దాడిలో కనీసం ముగ్గురు మృత్యువాత పడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాయబారిని దేశం వీడాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. టెల్ అవీవ్లో విధ్వంసం ఇరాన్ కూడా ఇజ్రాయెల్పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్ హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్మెంట్తో పాటు పలు భవనాలు దెబ్బ తిన్నాయి. నలుగురికి స్వల్ప గాయలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బ తిన్నాయి. దాంతో పలు ప్రాంతాలు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచి్చంది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూలి్చనట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలిపింది. యూఏఈలో జరిగిన దాడుల్లో మొరాకోకు చెందిన ఒక కాంట్రాక్టర్ మరణించినట్టు సమాచారం. బహ్రెయిన్లోని తమ డేటా సెంటర్లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. దాడులతో అక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కావడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్లో 16కు పెరిగిన మృతుల సంఖ్యఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో హెజ్బొల్లా దాడుల్లో ఒక రైతు మరణించాడు. దాంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ 4,5654 మంది గాయపడ్డట్టు ఆ దేశ అత్యవసర వైద్య సేవల విభాగం పేర్కొంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు బలైనవారి సంఖ్య 1,000 దాటింది. ఇక ఇరాన్లో ఇప్పటిదాకా 1,500 మందికి పైగా మరణించారు. యుద్ధ నెపం హెగ్సెత్పై!దాడి చేద్దామన్నది ఆయనే: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధానికి దిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాల్లో పడ్డారు. ఇరాన్పై దాడులు చేద్దామని తొలుత సూచించింది తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెతే అని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు! టెనెసీలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు హెగ్సెత్ ఆయన పక్కనే ఉండటం విశేషం.‘‘ఇరాన్ సమస్యపై ఆ మధ్య నా సన్నిహితులందరినీ పిలిచి లోతుగా చర్చించా. పరిస్థితిని వారికి వివరించా. అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఏం చేద్దామని అడిగా. అందరికంటే ముందు హెగ్సెత్ స్పందించారు. ఇరాన్పై దాడి చేద్దామని చెప్పుకొచ్చారు’’అన్నారు. అంతేగాక పక్కనే ఉన్న హెగ్సెత్కేసి తిరిగి, ‘‘అంతేకదా! ఇరాన్పై దాడి చేద్దామని ముందుగా చెప్పింది నువ్వే కదా! ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు అవకాశమివ్వొద్దని కూడా అన్నావు’’అంటూ అడిగారు. -
యుద్ధంపై మాట మార్చిన ట్రంప్ తప్పించుకునే ప్రయత్నం
-
ఇరాన్, అమెరికా చర్చల్లో భారత్ కీలక పాత్ర?
-
యుద్ధం ముగుస్తుందా..? ట్రంప్ కీలక ప్రకటన
-
ట్రంప్ బ్రేక్ అన్న ఆగని యుద్ధం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ సెగలు
-
హార్ముజ్ దాటేందుకు యత్నించిన షిప్పును స్వాధీనం చేసుకున్న ఇరాన్
-
భారత్ కు పెద్ద సవాళ్లు...యుద్ధంపై మోదీ హెచ్చరిక
-
యుద్ధ బీభత్సం 50 లక్షల కోట్ల నష్టం..
-
ఇరాన్తో చర్చలపై ట్రంప్ మరో రియాక్షన్
-
యుద్దానికి బ్రేక్... వెనక్కి తగ్గిన ట్రంప్!
-
BIG BREAKING: 48 గంటల డెడ్ లైన్ పై ట్రంప్ వెనక్కి..
-
శాంతి వీచికలు..?!
‘‘పశ్చిమాసియాలో కల్లోలానికి పూర్తిగా తెర దించే దిశగా ఇరాన్, అమెరికా నడుమ రెండు రోజులుగా ఫలప్రదంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఎంతో లోతుగా, సవివరంగా జరుగుతున్న ఈ నిర్మాణాత్మక చర్చలు వారమంతా కొనసాగుతాయి. తద్వారా సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. అందుకే ఇరాన్ విద్యుత్కేంద్రాలు, చమురు వ్యవస్థలపై ఐదు రోజుల పాటు ఎలాంటి దాడులూ చేయొద్దని మా యుద్ధ విభాగాన్ని ఆదేశించా. అయితే ఈ విరామం చర్చలు ఏ మేరకు ఫలప్రదమవుతాయనే దానికి లోబడి ఉంటుంది’’ – ట్రూత్సోషల్ పోస్టులో అధ్యక్షుడు ట్రంప్ దుబాయ్: మూడు వారాలకు పైగా కొనసాగుతున్న పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అవి ఈ వారమంతా కొనసాగుతాయని ప్రకటించారు. సోమవారం ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు చేశారు. చర్చల నేపథ్యంలో ఇరాన్లోని కీలక విద్యుత్కేంద్రాలు, చమురు వ్యవస్థలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపేయనున్నట్టు ప్రకటించారు. హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవని పక్షంలో ఇరాన్ చమురు, విద్యుత్ వ్యవస్థలపై భారీగా విరుచుకుపడతామని ఆదివారం ట్రంప్ అలి్టమేటం జారీ చేయడం తెలిసిందే. అదే జరిగితే హార్మూజ్ను పూర్తిగా మూసేయడమే గాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, ఐటీ సెంటర్లు, నీటి శుద్ధి కేంద్రాలు తదితరాలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ఇరాన్ బెదిరింపులకు దిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గిస్తూ ట్రంప్ నుంచి ‘చర్చల ప్రకటన’వెలువడింది. అయితే దాన్ని ఇరాన్ ఖండించడం విశేషం. అమెరికాతో అలాంటి చర్చలేవీ జరగడం లేదని ఇరాన్ విదేశాంగశాఖ పేర్కొంది. బహుశా అంతర్జాతీయంగా చుక్కలనంటుతున్న చమురు ధరలను తగ్గించేందుకు, తదుపరి యుద్ధ వ్యూహాల అమలుకు సమయం తీసుకునేందుకే ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారంటూ అనుమానాలు వెలిబుచ్చింది. ‘‘యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికాయే. కనుక ఆ దేశమే నేరుగా మాతో చర్చలకు రావాలి’’అంటూ డిమాండ్ చేసింది. కానీ ఆ తర్వాత ట్రంప్ ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. చర్చలు కొనసాగుతున్నట్టు పునరుద్ఘాటించారు. ‘‘ఇరాన్ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా పరిణతి, గౌరవాదరాలున్న పలువురు నేతలు ఆ దేశంలో ఉన్నారు. అలాంటి ఒక ఇరాన్ నాయకునితో అమెరికా దూతలు చర్చలు జరుపుతున్నారు’’అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు జరేద్ కుష్నర్ ఓ ఇరాన్ నేతతో ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా చర్చించినట్టు వివరించారు. ఆ నేత ఎవరన్నది వెల్లడించకపోయినా, సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ అయితే కాదని స్పష్టం చేశారు. మొజ్తబా పేరిట అప్పుడప్పుడూ ప్రకటనలు రావడమే తప్ప ఆయన బతికున్నదీ లేనిదీ కూడా అనుమానమేనన్నారు. ఇరాన్కు కూడా ఒక ఒప్పందానికి రావాలనే ఉందని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ‘‘చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయి. అవి ఫలిస్తే త్వరలోనే çహార్మూజ్ తెరుచుకుంటుంది. చమురు ధరలు ఒక్కసారిగా దిగొస్తాయి. అంతేకాదు, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది కూడా’’అని ఆశాభావం వెలిబుచ్చారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై క్షిపణులు, బాంబుల వర్షాన్ని కొనసాగిస్తామని ట్రంప్ హెచ్చరించడం విశేషం. అమెరికా, ఇరాన్ చర్చలకు రెండు రోజులుగా టర్కీ, ఈజిప్్ట, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు ఆక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. అటు విట్కాఫ్, కుష్నర్తో, ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీలతో మూడు దేశాల విదేశాంగ మంత్రులు విడివిడిగా మంతనాలు జరుపుతున్నట్టు వెల్లడించింది. టర్కీ విదేశాంగ మంత్రితో తాను చర్చలు జరిపినట్టు అరాఘ్చీ ధ్రువీకరించారు. కరడుగట్టిన మతవాదిగా పేరుబడ్డ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్తో కూడా విట్కాఫ్, కుష్నర్ చర్చలు జరిపినట్టు వార్తలు వెలువడుతుండటం విశేషం. ఇజ్రాయెల్ మీడియా కూడా వీటిని ధ్రువీకరించింది. మరోవైపు, ఇరాన్ హెచ్చరికల కారణంగానే ట్రంప్ దిగొచ్చారంటూ ఆ దేశ అధికారిక వార్తా సంస్థ పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. యథావిధిగా దాడులు ట్రంప్ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై దాడుల పరంపరను కొనసాగించింది. ఆయన ప్రకటన వెలువడ్డ నిమిషాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు నగరాలపై సోమవారం క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లోని మౌలిక వ్యవస్థలపై భారీ స్థాయిలో మరిన్ని దాడులు చేస్తామని ప్రకటించింది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యాలపై కూడా దాడులను కొనసాగించింది. ఆ దేశంలో మృతుల సంఖ్య దాదాపు 1,100కు చేరింది. లెబనాన్లో తీర ప్రాంత నగరమైన నఖోరాలో తమ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగినట్టు ఐరాస శాంతి పరిరక్షణ దళం (యునిఫిల్) పేర్కొంది. ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. పలు డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ పేర్కొంది. -
ఇజ్రాయెల్ కు పీడకల.. పనిచేయని ఐరన్ డూమ్
-
అంచనాలకు అందని ఇరాన్ డెడ్లీ స్కెచ్
-
అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ భీకర దాడి
-
అమెరికాకు షాక్ ఇరాన్ మిస్సైల్ శక్తి..
-
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
-
యుద్ధంపై వెనక్కి తగ్గిన ట్రంప్..?
పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మెుదలై 20 రోజులు దాటుతున్నా ఇరువర్గాలు శాంతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం ఆపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ చేసిన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల దాడులను తిప్పికొడుతూ ఇరాన్ పెద్దఎత్తున ప్రతిదాడులు చేయడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ సంక్షోభ పరిస్థితులకు ట్రంప్ కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. చమురు సంక్షోభాన్ని తెరదించడానికి IEA అత్యవసర చమురు నిల్వల విడుదలకు అనుమతిచ్చినా ప్రస్తుతం ఏర్పడ్డ చమురు కొరతకు అది ఏ విధంగానూ సరిపోదు. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.తన సోషల్ మీడియా పోస్ట్లో " ఇరాన్లో మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరవుతున్నాం. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ప్రయత్నాలను ముగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ పోస్ట్ చేశారు.. అయితే ఇది వరకే పలు మార్లు ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతిందని దాని పనైపోయిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా వ్యాఖ్యానించారు.కాగా ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా విఫలమైంది. టెహ్రాన్ని చాలా సులువుగా ఓడించవచ్చు అని ట్రంప్ భావించారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకవడుతుంది. హర్మూజ్ క్లోజ్ చేసి చమురు సప్లైని బ్రేక్ చేసింది. అంతేకాకుండా అమెరికా ఫైటర్ జెట్ F-35 పై అటాక్ చేసింది. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోని అతి పెద్దదైన ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడి చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే టెహ్రాన్ ఎక్కడా తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్ట్ ఆసక్తిగా మారింది."We are getting very close to meeting our objectives as we consider winding down our great Military efforts in the Middle East with respect to the Terrorist Regime of Iran..." - President Donald J. Trump pic.twitter.com/YBG9l492Kf— The White House (@WhiteHouse) March 20, 2026 -
ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?
-
యుద్దానికి ముగింపు..? హంటింగ్ ఆఫ్ హార్మూజ్
-
ఎక్కడున్నా వదలం!
దుబాయ్: పశి్చమాసియా యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇజ్రాయెల్–అమెరికా రాజేసిన యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటికీ విస్తరించేందుకు ఇరాన్ ప్రయతి్నస్తోంది. శుక్రవారం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిచి్చంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలన్నింటినీ ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ‘‘పార్కులు, విడిది, పర్యాటక కేంద్రాల వంటివేవీ మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ లక్ష్యాలుగా చేసుకుంటాం’’ అని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ షెకార్చీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా ఇరాన్ నెమ్మదించలేదు. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. కువైట్లో రెండు రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసే మినా అల్ అహ్మదీ రిఫైనరీలో పలు యూనిట్లు మంటల్లో చిక్కాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ రెండు క్షేత్రాలపై గురువారం కూడా ఇరాన్ దాడులు చేయడం తెలిసిందే. సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్ల్లో కూడా భారీ బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్న ఇరాన్ సంస్థలన్నింటినీ మూసేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్లో హైఫాలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి.బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. గురువారం తన గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానంపై చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ను కూడా విడుదల చేసింది. ఈ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు దాడికి గురికావడం వాటి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఇరాన్పై బాంబుల వర్షం పర్షియా నూతన సంవత్సరం ‘నౌరోజ్’ నాడు ఇరాన్పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపైనా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై ఇక దాడులు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్కు మరో మూడు యుద్ధ నౌకలను తరలించాలని అమెరికా నిర్ణయించింది. సిరియాపైనా దాడులు ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్తో పాటు సిరియాకూ విస్తరించింది. స్వెయ్డాతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనారిటీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.వారి భ్రమలు వీడాయి: మొజ్తబా ఇరాన్ నాయకత్వాన్ని, అగ్ర నేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటిప్పుడు భ్రమలు వీడాయన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై మూడు వారాలైనా వాళ్లు గొప్ప ధైర్యస్థైర్యాలు చూపుతున్నారంటూ కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా మొజ్తబాను ఉటంకిస్తూ ఇరాన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధలు చేస్తూ కని్పస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొజ్తబా ఇప్పటిదాకా బహిరంగంగా కని్పంచకపోవడం తెలిసిందే. తండ్రి అయతొల్లా ఖమేనీ తదితరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలొస్తూనే ఉన్నాయి.నాటో దేశాలు పిరికిపందలు: ట్రంప్ వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికిపందలుగా అభివరి్ణంచారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్నాయంటూ నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారమయ్యే చిన్న సమస్య అది. పైగా వాటికి పెద్దగా రిస్కు కూడా లేని వ్యవహారం. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నాయి. నాటో దేశాల ఈ పిరికిపంద చర్యను గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్కు సర్ప్రైజ్ ఇస్తామంటూ ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైనీ ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు.హార్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై బాంబులు హార్మూజ్ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. దాని సమీపంలోని పలు ఇరాన్ నావికా దళ లక్ష్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. ఇరాన్ నావికా, సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్ లాంచర్ వ్యవస్థలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. హార్మూజ్ సుంకం! రూ.18 కోట్లు చెల్లించిన ఓ నౌక ముందుగా ప్రకటించినట్టుగానే హార్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఇరాన్ సుంకం వసూళ్లు ప్రారంభించింది. ఇందుకోసం ఒక చమురు నౌక రూ.18 కోట్ల పై చిలుకు మొత్తం చెల్లించినట్టు లాయిడ్స్ లిస్ట్ శుక్రవారం వెల్లడించింది. అంతేగాక హార్మూజ్ గుండా తాను అనుమతించిన నౌకల రవాణాకు పకడ్బందీగా నమోదు వ్యవస్థను కూడా రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. -
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్లు ఇరాన్ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో బాటుగా, లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
నో స్టాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్
-
ఫైనల్ షాట్..హర్మూజ్ లోనే అమీ తుమీ
-
అమెరికా భయానక దాడులు.. ఇరాన్ కు భారీ నష్టం?
-
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. -
సొంతూరికి వచ్చేదెలా!?
రాజంపేట: పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల్లోని తెలుగువారి పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా కువైట్లోని ‘ఖసీమా’ విమానాశ్రయం మూసివేయడంతో ఉమ్మడి కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రవాసాంధ్రులు అక్కడ చిక్కుకుపోయారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దుకావడంతో, ప్రత్యామ్నాయ మార్గాల్లో స్వదేశానికి రావాలంటే సామాన్యులకు టికెట్ ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. గతంలో రూ.10 వేలకు లభించే టికెట్ ప్రస్తుతం రూ.1.30 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతుండడంతో పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీసాల వెతలు.. కువైట్ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో సౌదీ అరేబియా మీదుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి అక్కడి రాయబార కార్యాలయం చేతులెత్తేసింది. విజిట్ వీసా హోల్డర్లు, అత్యవసర ప్రయాణికులు సొంత ఖర్చులతోనే టికెట్లు బుక్ చేసుకోవాలని, వీసా జారీపై ఎలాంటి హామీలేదని తేల్చిచెప్పింది. వీసా జారీ అనేది సౌదీ ప్రభుత్వ ప్రత్యేక హక్కు అని తెలపడంతో ప్రవాసాంధ్రులు అద్దె గదులకు పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గుండె కోత మిగిల్చిన యుద్ధం.. యుద్ధ వాతావరణం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజంపేటకు చెందిన మర్రి కళ్యాణ్ తన తల్లి మరణిస్తే కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. ఇప్పుడు రావాలన్నా శ్రీలంక మీదుగా లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అలాగే, భార్య ప్రసవానికి వెళ్లాలనుకున్న రాజంపేట రమణ, ఏటా రంజాన్కు ఊరికి వచ్చే నందలూరు మస్తాన్ వంటి వేలాది మంది ఈసారి పండుగలకు దూరమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం..రాష్ట్రానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేశారని.. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. నేను చాలా కాలంగా కువైట్లో ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితిని చూడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు, ఆర్థిక భారం లేకుండా ప్రవాసాంధ్రులను భారత్కు తీసుకురావాలి. ప్రత్యేక విమాన సర్వీసులను వెంటనే ప్రారంభించాలి. – మేడా మనోహర్రెడ్డి, గుండ్లూరు, రాజంపేట మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు.. మా తమ్ముడు తన తల్లి అంత్యక్రియలకు కూడా రాలేకపోవడం బాధాకరం. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రాయితీ ధరకు విమాన ప్రయాణం కల్పించాలి. – మర్రి రవికుమార్, వైస్చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ -
హర్మాజ్ జలసంధి ఆక్రమణ కోసం ట్రంప్ భారీ వ్యహం
-
గల్ఫ్ లో టెన్షన్.. టెన్షన్ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
-
Special Story : తీవ్ర సంక్షోభంలో గల్ఫ్ దేశాలు
-
అమెరికాలో డ్రోన్ల కలకలం.. హై అలర్ట్లో వాషింగ్టన్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. అత్యంత కీలక సైనిక స్థావరం ‘ఫోర్ట్ మెక్నైర్’ (Fort McNair) వద్ద గుర్తు తెలియని డ్రోన్లు తిరుగుతుండటం అమెరికా యంత్రాగాన్ని హడలెత్తిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్లు నివసించే ప్రాంతంలో డ్రోన్లు కనిపించడం అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వైట్హౌస్ అత్యవసర చర్యల్లోకి దిగింది.యుద్ధ మేఘాల మధ్య..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఈ డ్రోన్ల సంచారం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భద్రతా పరమైన ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా తన విదేశీ రాయబార కార్యాలయాలను హై అలర్ట్లో ఉంచడంతో పాటు, స్వదేశంలోని పలు సైనిక స్థావరాలను లాక్డౌన్ చేసింది.ట్రంప్ మాస్ వార్నింగ్మరోవైపు, ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా ఖతార్లోని ఇంధన ప్లాంట్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఖతార్పై మళ్లీ దాడికి దిగితే, ఇరాన్ ఇంధన వనరులను పూర్తిగా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.మండిపోతున్న చమురు ధరలుఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 5 శాతం పెరిగి, మరింత భారంగా మారింది. చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ భీకర పోరులో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మంది, లెబనాన్లో 960 మంది, అమెరికా సైనికులు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షిపణి దాడుల కారణంగా ఖతార్లోని కీలక గ్యాస్ ప్లాంట్లు భారీగా దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా..
ఖార్కివ్: పైన క్షిపణుల మోత.. కింద పిల్లల అక్షరాల పాట.. రష్యా సరిహద్దుకు కూతవేటు దూరంలోని ఉక్రెయిన్ నగరం ఖార్కివ్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఇదే. నిత్యం బాంబు దాడులు, డ్రోన్ల ముప్పుతో వణికిపోతున్న ఈ నగరంలో చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మెట్రో రైలు స్టేషన్లనే తరగతి గదులుగా మార్చివేసింది.పాతాళంలో పాఠశాలలురష్యా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్కివ్ నగరంపై నిత్యం బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న 184 పాఠశాలల్లో 134 ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే, వారికి చదువును అందించేందుకు ఎనిమిది మెట్రో స్టేషన్లను పాఠశాలలుగా మార్చారు. ప్రస్తుతం సుమారు 20 వేల మంది విద్యార్థులు భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువుకుంటున్నారు.ట్రైన్ల పక్కనే పాఠాలుఒకప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో స్టేషన్ హాల్స్ ఇప్పుడు క్లాస్ రూమ్లుగా మారిపోయాయి. ఒలెక్సాండర్ మాసెల్స్కీ మెట్రో స్టేషన్లో సుమారు 2,000 మంది చిన్నారులు షిఫ్టుల వారీగా చదువుకుంటున్నారు. ‘ఇక్కడ యుద్ధం గురించి ఆలోచించాల్సిన పనిలేదు, ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. మా దృష్టి అంతా పిల్లలకు పాఠాలు చెప్పడంపైనే ఉంటుంది’ అని ఇంగ్లీష్ టీచర్ మాక్సిమ్ త్రిస్తాప్షోన్ తెలిపారు.భయం నీడలో భద్రతబయట పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. బస్టాపుల్లో నిలబడితే ఎప్పుడు డ్రోన్ దాడులు జరుగుతాయో తెలియదు. అందుకే పిల్లలను బస్సుల ద్వారా నేరుగా స్టేషన్ లోపలికే తీసుకొస్తారు. ‘నాకు ఇక్కడ చదువుకోవడం ఇష్టం, ఎందుకంటే ఇక్కడ బాంబుల భయం ఉండదు’ అని తొమ్మిదేళ్ల అలీసా అనే విద్యార్థిని చెప్పడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పోషక విలువల కోసం ‘ఉజ్వర్’ అనే పానీయాన్ని కూడా అందిస్తున్నారు.సంస్కృతిని కాపాడుకుంటూ..ఈ మెట్రో పాఠశాలలు కేవలం అక్షరాలు నేర్పడమే కాదు, ఉక్రెయిన్ సంస్కృతిని కాపాడే వేదికలుగా కూడా మారాయి. రష్యన్ భాషా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నగరంలో, పిల్లలు ఇప్పుడు పాఠశాలల ద్వారా ఉక్రేనియన్ భాషను నేర్చుకుంటున్నారు. యుద్ధం తమ గతాన్ని, చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని అధ్యక్షుడు జెలెన్ స్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా యుద్ధం మిగిల్చిన గాయాల మధ్య, క్షిపణి దాడుల భయం లేకుండా ప్రశాంతంగా చదువులు సాగించడం ఈ పిల్లలకు అతిపెద్ద ఊరటగా మారింది. ఖార్కివ్ మెట్రో స్టేషన్లు ఇప్పుడు కేవలం ప్రయాణ ప్రాంగణాలు మాత్రమే కాదు, విజ్ఞాన దేవాలయాలుగా మారాయంటున్నారు స్థానికులు.ఇది కూడా చదవండి: ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం? -
ట్రంప్ సిగ్నల్ ఇస్తే చాలు గాల్లో ఖర్గ్ ఐలాండ్..!
-
80 వేల టన్నుల చమురుతో భారత్కు ‘జగ్ లాడ్కీ’
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతున్న వేళ భారత్కు భారీ ఊరట లభించింది. యూఏఈ (యూఏఈ) నుంచి సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో బయలుదేరిన భారతీయ నౌక ‘జగ్ లాడ్కీ’ (Jag Laadki) బుధవారం గుజరాత్లోని ముంద్రా పోర్టుకు క్షేమంగా చేరుకుంది.దాడి జరిగిన చోటే లోడింగ్ఈ నౌక ప్రయాణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మార్చి 14, 2026న యూఏఈలోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్పై దాడి జరిగిన సమయంలో ‘జగ్ లాడ్కీ’ సరిగ్గా అక్కడే చమురును నింపుకుంటోంది. ఆ టెర్మినల్పై దాడి జరిగి కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, భారత నౌక మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆదివారం ఉదయం సురక్షితంగా బయలుదేరింది. ‘ముర్బన్ క్రూడ్’తో నిండిన ఈ నౌక మూడు రోజుల ప్రయాణం తర్వాత భారత్ తీరానికి చేరింది.వరుస విజయాలు.. ఊపిరి పీల్చుకున్న ఇంధన రంగంపశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్కు చేరిన మూడవ ప్రధాన నౌక ఇది. దీనికంటే ముందు 'శివాలిక్', 'నందా దేవి' అనే రెండు ఎల్పీజీ నౌకలు కూడా విజయవంతంగా భారత్ చేరుకున్నాయి. నందా దేవి.. 46,500 మెట్రిక్ టన్నుల గ్యాస్తో మంగళవారం వాడినార్ పోర్టుకు చేరింది. ఇక్కడి నుంచి ఈ గ్యాస్ను తమిళనాడులోని ఎన్నోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా పోర్టులకు తరలించనున్నారు. శివాలిక్.. సోమవారమే ముంద్రా పోర్టుకు చేరుకుంది. -
Hyderabad: టిఫిన్ బిల్లులో 5 శాతం గ్యాస్ చార్జీలు
సికింద్రాబాద్లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా.. ‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి. తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు. -
ఇరాన్ కు మరో దెబ్బ.. ఖమేనీ కుడి భుజం హతం
-
యుద్ధనౌకలను పంపబోం
వాషింగ్టన్: అగ్రరాజ్యం పిలుపిస్తే అందరూ కట్టకట్టుకుని వస్తారని కలలుగన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భంగపాటు ఎదురైంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకలు వెళ్తే తగలబెడతామని హెచ్చరిస్తున్న ఇరాన్కు మనందరి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో బదులివ్వాలంటూ నాటోలోని సభ్యదేశాలు, ఇతర మిత్రదేశాలకు పిలుపునిచ్చిన ట్రంప్కు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. పైగా చైనా షరతులు విధించి ట్రంప్కు మరింత కోపం తెప్పించింది. యుద్ధంలో భాగస్వాములు కాబోమంటూ మిత్రదేశాలు ముఖంచాటేయడంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలేం జరిగింది? గట్టున కూర్చుని ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు భయపడకుండా హార్మూజ్ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నాటో దేశాలు, మిత్రదేశాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు యుద్ధనౌకలు, డ్రోన్లు పంపే ఆలోచనే లేదు. అమెరికా, యురోపియన్ యూనియన్, గల్ఫ్లోని మిత్రదేశాలతో చర్చించాకే బ్రిటన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది’’అని అన్నారు.‘‘అసలు పశ్చిమాసియా యుద్ధంలో నాటోకు ఎలాంటి సంబంధం లేదు. శక్తివంత అమెరికా నేవీ యుద్ధనౌకలు చేయలేని పనిని యురోపియన్ యుద్ధనౌకలు పూర్తిచేయగలవా?’’అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పోస్టోరియస్ అన్నారు. ‘‘పరిస్థితి కాస్తంత సద్దుమణిగాకే చమురునౌకలకు రక్షణగా మా యుద్ధనౌకలను పంపగలం’’అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తెగేసి చెప్పారు. జలసంధిలో జలసమాధి కావాలా? ‘‘ఇప్పటికప్పుడు యుద్ధనౌకలను పంపే ఆలోచన మాకు లేదు. పశ్చిమాసియాకు సంబంధించిన యురోపియన్ యూనియన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. హార్మూజ్ జలసంధిని తెరపించడం కోసం మేం జలసమాధి కావాలా? మా దేశాలపై బాంబుదాడులు అవసరమా?’’అని ఐరోపా సమాఖ్య విదేశాంగ విధానాల విభాగ చీఫ్ కాజా కల్లాస్ తెగేసి చెప్పారు. ‘‘ముందుగా ఇరువైపులా సైనిక చర్యలను తక్షణం ఆపేయాలి. దాడుల పర్వానికి తెరదించాలి. ఆ తర్వాతే యుద్ధనౌకలను పంపడంపై ఆలోచిస్తాం.యుద్దం ఇలాగే కొనసాగితే చమురు సంక్షోభం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తప్పవు’’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. ‘‘పార్లమెంట్ ఆమోదం లేకుండా యుద్ధనౌకలను హార్మూజ్కు పంపడం కుదరదు. కొరియన్ల భద్రత, ముడిచమురు రావాణామార్గాల రక్షణే మాకు ముఖ్యం’’అని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహన్గుయీ బాక్ చెప్పారు. ‘‘ఎస్కాట్గా యుద్ధనౌకలను పంపాలని మాకు ఎవరి నుంచీ అభ్యర్థన రాలేదు’’అని జపాన్ నూతన మహిళా ప్రధాని సనాయీ తకైచీ అన్నారు. మార్చి 19వ తేదీన ఆమె వాషింగ్టన్లో ట్రంప్తో భేటీకాబోతున్న వేళ అమెరికా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్ సాయుధ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగ్రహం మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంగళవారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇరాన్ ఉగ్రరాజ్యంపై దాడులకు మాతో కలిసి రాబోమని తాజాగా నాటో సభ్యదేశాలు చావుకబురు చల్లగా చెప్పాయి. నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతి ఏటా వందల బిలియన్ డాలర్లను ధారపోసింది. ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న నాటో సభ్యదేశాలు మేం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని భ్రమించా. కానీ వాళ్లు మాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేరు. వాస్తవానికి ఇప్పటికే అమెరికా ఇరాన్ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఇప్పుడు మాకు నాటో నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదు. గతంలోనూ వాళ్లు మాకు సాయం చేయలేదు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియాలదే అదే తీరు. మాకు ఎవరి సాయం అక్కర్లేదు’’అని అన్నారు.


