విత్తన కంపెనీలతో కేసీఆర్ కుమ్మక్కు: శ్రవణ్ | Sakshi
Sakshi News home page

విత్తన కంపెనీలతో కేసీఆర్ కుమ్మక్కు: శ్రవణ్

Published Mon, Oct 5 2015 2:52 AM

విత్తన కంపెనీలతో కేసీఆర్ కుమ్మక్కు: శ్రవణ్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: విత్తన ధరలను పెంచడానికి విత్తనాల కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కరువు, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి, ధరలు పెంచడం దారుణమని విమర్శించారు. అసెంబ్లీని కౌరవ సభలా నడిపించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు అడిగితే కేసులు పెడుతూ, ఎన్‌కౌంటర్ల పేరిట కాల్చి చంపుతూ హంతకులే సంతాపాన్ని ప్రకటించినట్టుగా ఎంపీ కవిత మాట్లాడుతున్నారని శ్రవణ్ విమర్శించారు.

Advertisement
Advertisement