'అసెంబ్లీ లాంజ్ లో సీఎంల ఫోటోలు ఉండవు' | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీ లాంజ్ లో సీఎంల ఫోటోలు ఉండవు'

Published Wed, Sep 2 2015 12:43 PM

no place for CMs photos in assembly, says Kodela

హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్ లో స్పీకర్ల ఫోటోలు మాత్రమే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్ లో ఉంటాయని చెప్పారు. విభజనలో భాగంగా కమిటీ హాల్ తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఫోటోను తిరిగి యధాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేస్తూ సభలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.

దీనిపై స్పీకర్ స్పందిస్తూ... అసెంబ్లీ, జనరల్ పర్పస్ కమిటీ ఆమోదం మేరకు ఫోటోలు పెట్టడం జరుగుతుందన్నారు. ఫోటోలు అన్ని ఒకే సైజులో, ఒకే వరుసలో పెడతారని చెప్పారు. వైఎస్సార్ ఫోటో తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తనకు లేఖ రాశారని, సభను కించపరిచేలా ఆయన లేఖ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement