కేజ్రీవాల్ కు వరుస కష్టాలు | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ కు వరుస కష్టాలు

Published Tue, Jan 27 2015 6:57 PM

కేజ్రీవాల్ కు వరుస కష్టాలు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్నికల నియమాళి ఉల్లంఘించినందుకు కేజ్రీవాల్ కు మంగళవారం ఎన్నికల సంఘం వార్నింగ్ ఇవ్వగా, తన ఫోటో వాడుకున్నందుకు బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ లీగల్ నోటీసు పంపారు.

ఎవరూ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం తమకే వేయ్యాలని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఎన్నికల ప్రచారంలో ఆప్ పోస్టర్లలో తన ఫోటో వాడుకున్నందుకు  కిరణ్ బేడీ.. కేజ్రీవాల్ లీగల్ నోటీసిచ్చారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తనను చుట్టుముట్టిన కష్టాల నుంచి కేజ్రీవాల్ ఏవిధంగా గట్టెక్కుతారో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement