రసూల్పురా: క్షణికావేశం రెండు నిండు ప్రాణాలు బలిగొంది. భర్తలో మార్పు రావడంలేదని ఇల్లాలు, తల్లి లేకుండా తాము ఉండలేమని ఇద్దరు కూతుళ్లు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసింది. కాలిన గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న ముగ్గురిలో తల్లి కవిత మృత్యువుతో పోరాడుతుండగా, ఆమె ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18), భావన (16) మృతిచెందారు. కవిత తండ్రి శ్యాంసుందర్ లోహియా, సోదరుడు ఆనంద్ లోహియాలు శనివారం కార్ఖాన పీఎస్లో కవిత భర్త దినేష్పై ఫిర్యాదు చేశారు.
మూడు సంవత్సరాలుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, వారి మృతికి కారణమైన దినేష్ను కఠినంగా శిక్షించాలని వారు సీఐ నాగేశ్వర్రావును కోరారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ఉన్న దినేష్, అతడి సోదరుడు నరేష్తో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి సిబ్బంది పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను శ్యాంసుందర్ లోహియా కుటంబ సభ్యులకు అప్పగించారు.
ముందుగానే పెట్రోల్ తెచ్చుకున్నారు..
దినేష్ ప్రవర్తనను మార్చుకోకపోవడంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలని పెట్రోల్ పంప్ నుంచి లీటరున్నర పెట్రోల్ తెచ్చుకున్నారు. శుక్రవారం ఒంటిపై పోసుకుని కవిత నిప్పంటించుకోగానే, తల్లి లేకుండా తాము బతుకలేమని ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో పలు అనుమానస్పద అంశాలపై పోలీసులు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన అనంతరం ఇంట్లోని సీసీ కెమెరాలు మాయమైనట్లు సమాచారం.
కాగా వాచ్మెన్ను కూడా దినేష్ పంపించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఏపీ టెక్ట్స్బుక్ కాలనీలోని పాత ఇంటిని కొలుగోలు చేసి దానిని కూల్చివేసి తిరిగి భవనాన్ని నిర్మించుకున్నారని, చుట్టు పక్కల వారితో కలసి మెలసి ఉండేవారు కాదని కాలనీ వాసులు పేర్కొన్నారు.
ఇద్దరిని బలిగొన్న ‘క్షణికావేశం’
Published Sun, Oct 26 2014 12:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement