- ముగ్గురు నిందితుల అరెస్టు
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ మాధవరెడ్డి
నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గత నెల 29న రాత్రి జరిగిన జంట హత్యల కేసు మిస్టరీని పట్టణ పోలీసులు ఛేదించారు. నిందితులైన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నిర్మల్కు చెందిన పాతర్ల రాములు, రమేశ్, జాకీర్ నిత్యం మద్యం తాగేవారు. ఎప్పటిలాగే గత నెల 29న రాత్రి పాతబస్టాండ్ సమీపంలోని తెల్లకల్లు దుకాణానికి వెళ్లి కల్లు కొనుగోలు చేశారు.
ఇంకా కల్లు ఉద్దెర ఇవ్వాలని దుకాణంలో పనిచేసే మేకల నర్సింహులుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఉద్దెరకు ఇవ్వడం కుదరదని చెప్పి నర్సింహులు, అందులో పనిచేసే బాపురావు రాత్రి దుకాణాన్ని మూసివేసి ఆరుబయట నిద్రించారు. దీంతో దుకాణం నుంచి వెళ్లిపోయిన రాము లు, జాకీర్, రమేశ్ వారు కొనుగోలు చేసిన కల్లు తాగారు. తిరిగి కల్లు దుకాణం వద్దకు వచ్చి నిద్రిస్తున్న వీరిద్దరిని చూశారు. ఉద్దెరకు కల్లు ఇవ్వలేదనే కసితో జాకీర్, రమేశ్ కర్రలతో నర్సింహులుపై విచక్షణారహితంగా దాడి చేశారు. నర్సింహులుపై దాడి చేయడాన్ని చూసిన బాపురావు గట్టిగా అరుస్తూ అడ్డుకోబోయాడు.
దీంతో అతడిపై ముగ్గురు దాడి చేసి హతమార్చారు. అతడి జేబులో ఉన్న రూ.300 ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానితులైన రమేశ్, జాకీర్, రాములును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రక్తం మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. కాగా, నిందితుల్లో ఒకరైన రమేశ్పై గతంలో అనేక కేసులు ఉన్నాయి.
రివార్డులు అందజేత...
పట్టణంలో కలకలం రేపిన జంటహత్యల కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బందికి ఎస్పీ నుంచి అందిన రివార్డులను డీఎస్పీ మాధవరెడ్డి అందజేశారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది ఫయాజుల్లా హుస్సేన్, బాబురావు, సందీప్, పర్వేజ్, రమేశ్లను అభినందించారు. సమావేశంలో పట్టణ సీఐ పింగళి, ప్రశాంత్రెడ్డి ఉన్నారు.
కల్లు ఉద్దెర ఇవ్వలేదనే కసితో అఘాయిత్యం
Published Tue, Sep 2 2014 3:57 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రశాంత పోలింగ్కు పటిష్ట చర్యలు
టీడీపీ చీప్ ట్రిక్స్
డబ్బు పంపిణీపై దృష్టి పెట్టిన అభ్యర్థులు
అద్భుతంగా చందనోత్సవం: స్వరూపానందేంద్ర సరస్వతి
ఎలక్షన్ స్పెషల్స్!
స్టీల్ప్లాంట్పై ప్రకటన చేస్తే పోటీకి దూరం
కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
ఐటీతో రాజకీయ కుట్ర
నేటితో ప్రచారానికి తెర
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement