బాలిక అదృశ్యం | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Published Fri, Nov 27 2015 4:56 PM

Teenage girl missing

బంజారాహిల్స్ (హైదరాబాద్) : తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో నుంచి యువతి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఎన్బీటీ నగర్‌లో నివాసముండే జె.రాములు.. తన బావమరిది బి.నర్సింహ మృతి చెందడంతో చివరి చూపు చూసేందుకు భార్యతో కలిసి గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కూతురు జె.మాధవి(17) కనిపించలేదు. గత కొంతకాలం నుంచి తన కూతురితో పరిచయం పెంచుకుంటున్న గోపాల్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement