అటవీ శాఖలో బోగస్ కొలువుల బాగోతం ఇంకా సద్దుమణుగక ముందే రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఉద్యోగాల్లో ఇలాంటి అక్రమమే మరొకటి వెలుగు చూసింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమార్కులు అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. కొలువుల ఆశ చూపి నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు తెరలేపారు. రూ.లక్షల్లో దండుకున్నారు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజీవ్ విద్యామిషన్ పరిధిలో జిల్లాలో 52 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరైంది. అకౌంటెంట్లు, ఏఎన్ఎంలు, అటెండర్లు(ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్), వాచ్మెన్లు, స్వీపర్లు ఇలా వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.30 నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువులు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటూ అమాయక అభ్యర్థులను మభ్య పెట్టారు.
సర్కారు కొలువు వస్తుందని.. ఎప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగులమయ్యే అవకాశాలున్నాయని భావించిన అమాయక అభ్యర్థులు అక్రమార్కుల బుట్టలో పడ్డారు. ఇలా వసూలు చేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాల్సిన ఈ పోస్టులకు కొందరు అభ్యర్థుల వద్ద ఆర్వీఎం కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం.
అడ్డదారిలో ఔట్ సోర్సింగ్ ఎంపిక..
ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాంతోపాటుగా బహిరంగ ప్రదేశాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ఈ నోటిఫికేషన్ను ఉంచాలి. అలా చేస్తేనే వివిధ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటాయి.
కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎలాంటి టెండర్లు పిలవకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీనీ ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన వారికి ఏజెన్సీని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో ఉండే జిల్లా మహిళా సమాఖ్యనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మాకు ఎలాంటి సంబంధం లేదు - పి.యాదయ్య, ఆర్వీఎం పీవో
కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించాం. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఈ అక్రమాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు ఇచ్చిన, ఉద్యోగాలిపిస్తామని చెప్పి డబ్బులు పుచ్చుకున్న వారే బాధ్యులవుతారు. ఔట్సోర్సింగ్ ఎంపిక ఇంకా పూర్తికాలేదు.
ఆర్వీఎంలో అక్రమం
Published Mon, Nov 24 2014 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement