వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం శాసనసభలో
ప్రత్యేక బిల్లు పెట్టే అవకాశం తప్పనిసరి సర్వీసుతో
ప్రయోజనం లేదనే ఈ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో ఏడాదిపాటు పనిచేయా లన్న నిబంధనను రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ప్రత్యేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బిల్లును రూపొం దించే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు..
మెడికల్ విద్యార్థులు తమ కోర్సు ముగిసిన తర్వాత కచ్చి తంగా ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసులో గ్రామీణ ప్రాంతా ల్లో పనిచేయాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు ఈ నిబంధనను అమలుపరిచారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నిబంధన నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం పీజీ, సూపర్స్పెషాలిటీ వైద్య కోర్సు పూర్తి చేసిన వారికి దీన్ని అమలు చేస్తున్నారు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు పూర్తిచేసిన తర్వాతే వారికి ప్రైవేటుగా వైద్యం చేయడానికి తెలంగాణ వైద్య మండలి అనుమతిస్తోంది.
నిపుణుల కమిటీ సూచనలతో..
అయితే తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల నుంచి ఏటా 1,400 మంది వరకు పీజీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. అంటే వీరంతా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలి. ఈ ఏడాది కాలంలో పీజీ వైద్య విద్యార్థులకు నెలకు రూ.40 వేలు, సూపర్ స్పెషాలిటీలకు రూ.45 వేలు, డిప్లొమా వారికి రూ.38 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. వారిని బోధనాసుపత్రులకు పంపినా ఎవరూ కూడా హైద రాబాద్ను వీడి బయటకు పోవడానికి ఇష్టపడటంలేదు. నగరంలో పోస్టింగ్లు ఇచ్చినా అక్కడా బాధ్యతలు నిర్వ హించడంలేదు. ప్రభుత్వ సర్వీసు చేయకుండానే నెలనెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు.
రికార్డుల్లో మాత్రమే వీరు ప్రభుత్వ సర్వీసు చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ తప్పనిసరి ప్రభుత్వ సర్వీసు ఎత్తివేయాలని సూచించింది. తప్పనిసరి సర్వీసును తొలగించి ప్రభుత్వానికి అవసరమైన వారిని పూర్తిస్థాయిలో నియమించాలన్న ఆలోచన ఉంది. ఇష్టమైన వారు.. ఎక్కడికైనా వెళ్లడానికి ఆసక్తి చూపే వారికి ఇప్పుడిస్తున్న దానికంటే ఎక్కువగా వేతనం ఇచ్చి ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమిం చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.
పీజీ వైద్య విద్యార్థుల తప్పనిసరి సర్వీసు రద్దు
Published Thu, Mar 23 2017 3:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement