బీఏసీకి ఒక్కరినే పిలుస్తారా?: ఎర్రబెల్లి | Sakshi
Sakshi News home page

బీఏసీకి ఒక్కరినే పిలుస్తారా?: ఎర్రబెల్లి

Published Sat, Nov 22 2014 1:15 AM

only one member  invited to the meeting Affairs Council

హైదరాబాద్: సభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశానికి తమ పార్టీ నుంచి ఒక్కరినే ఆహ్వానించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేశారు. శుక్రవారం టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉప నాయకుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డి తదితరులు స్పీకర్‌తో ఆయన చాంబర్‌లో సమావేశమయ్యారు. సంఖ్యా బలం దృష్ట్యా టీడీపీ నుంచి బీఏసీకి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరారు.  విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం హామీని అమలు చేయాలని కూడా స్పీకర్‌ను కోరారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement