రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరు
ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ!.. 27న తిరుగు పయనం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన సీఎం.. రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగనున్న రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్నాథ్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో సీఎం భేటీ అయ్యే అవకాశాలు న్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం కోరనున్నారు. అలాగే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఉన్న పదకొండు ప్రాజెక్టుల్లో వరద కాల్వ, దేవాదుల, భీమా ప్రాజెక్టులకు రూ.5,490 కోట్లు మంజూరు చేయాలని విన్నవించనున్నారు.
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కేటాయించాలంటూ గతంలో నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులనూ మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. గ్రానైట్, బీడీ, చేనేత పరిశ్రమల ఉత్పత్తులపై జీఎస్టీని సడలించాలని, ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధానికి సీఎం విన్నవించనున్నారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన మూడో విడత రూ.450 కోట్ల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింతను వేగవంతం చేయాలని కోరనున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడును కలసి సీఎం శుభాకాంక్షలు తెలుపనున్నారు. అలాగే పదవీ కాలం ముగియనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయనకు కేటాయించిన ప్రత్యేక నివాసంలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఇప్పటికే ఖరా రైన షెడ్యూలు ప్రకారం ఈ నెల 27న ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.
గవర్నర్ ఢిల్లీ పర్యటన
రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నూతన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరవుతారు.
ఢిల్లీకి సీఎం కేసీఆర్
Published Tue, Jul 25 2017 4:02 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement