నిజాంల కాలంలో నిర్మాణం.. ఇప్పటికీ చెక్కుచెదరని కట్టడం
⇒నిర్మాణ వ్యయం రూ. 27.11 లక్షలు
⇒నిర్మాణ సమయం 1917 – 1922
⇒నీటి నిల్వ సామర్థ్యం : 21 మీటర్లతో 1.52 టీఎంసీలు
⇒ఆయకట్టు 10,500 ఎకరాలు
ప్రకృతి అందాల మధ్య ఉన్న పోచారం ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పోచారం అభయారణ్యం కూడా ఉండడంతో సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది.
కామారెడ్డి నుంచి ఎస్.వేణుగోపాలచారి: ప్రకృతి రమణీయతకు మారుపేరు పోచారం ప్రాజెక్టు పరిసరాలు. ఎప్పుడూ పర్యాటకు లతో అలరారే ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏడాదికేడాది తగ్గుతూ వస్తోంది. కామా రెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం శివారులో గల మంచిప్ప వాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1917లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్త యింది. 21 అడుగుల ఎత్తుతో 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు ఆనకట్టను నిర్మిం చారు. నిర్మాణంలో రాళ్లు, డంగుసున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా అప్పట్లోనే 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ తవ్వించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. అప్పటి హైదరాబాద్ స్టేట్లో తొలి మానవ నిర్మిత ప్రాజెక్టుగా ఇది పేరుగాంచింది. నిర్మించి వందేళ్లయినా చెక్కు చెదరకపోవడం గమనార్హం.
నీటి నిల్వ సామర్థ్యం..
మొదట 3.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించినప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. యేటా పూడిక పేరుకుపోవ డంతో నీటి నిల్వ సామర్థ్యం 1.52 టీఎంసీలకు పడిపోతోంది.
ఏ, బీ జోన్లుగా ఆయకట్టు..
నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. ప్రాజెక్టు నీటిని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో గల వ్యవసాయ భూములకు అందిస్తారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ప్రధానకాలువ డిస్ట్రిబ్యూటరీ 01 నుంచి 48 వరకు ‘ఏ’జోన్గానూ, 49 నుంచి 73వ డిస్ట్రిబ్యూటరీ వరకు ‘బీ’జోన్గానూ విభజించారు. యేటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీ సీజన్లో ఒక ఏడాది ‘ఏ’ జోన్కు, మరో ఏడాది ‘బీ’జోన్కు మాత్రమే నీటిని అందిస్తారు.
వైఎస్సార్ ఇచ్చిన నిధులతో..
వైఎస్సార్ 2001లో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో పర్యటించారు. పోచారం ప్రాజెక్టు పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. అధికారంలోకి వస్తే పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణకు నిధులిస్తామని హామీ ఇచ్చారు. అధికారం లోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. రూ.14.30 కోట్లు మంజూరు చేశారు.
⇒ 2006 ఏప్రిల్ 7న వైఎస్సార్ సీఎం హోదాలో నాగిరెడ్డిపేటకు వచ్చి పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
నూరేళ్ల ‘పోచారం’
Published Tue, Aug 22 2017 4:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement