యువరైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Published Sat, Jul 4 2015 8:22 PM

Farmer commits Suicide

నర్సింహులపేట (వరంగల్) : అప్పుల బాధతో వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గండి అర్జున్(28) అత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వై.వెంకటప్రసాద్, బంధువుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గండి అర్జున్ తనకున్న వ్యవసాయ భూమి నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఎండ తీవ్రతతో అవి మొలకెత్తలేదు. కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం కలసిరాక అప్పులపాలయ్యాడు.

ఈ క్రమంలో శుక్రవారం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన అర్జున్ భూమిలో పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడం చూసి మనస్తాపానికి గురయ్యాడు. అక్కడే పురుగుల ముందు తాగడంతో స్థానిక రైతులు గమనించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య మహేశ్వరి, ఇద్దకు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 

Advertisement
Advertisement