- రచ్చబండ కార్డులపై సరుకులు నిలిపివేత
- ఫొటో, ఆధార్ నంబర్లు ఇవ్వని ఫలితం
- జిల్లాలో 40వేల మంది
- వచ్చే నెల 5లోగా వివరాలిస్తేనే కోటా
సాక్షి, కరీంనగర్ : రేషన్ సరుకులు అందాలంటే.. ఫొటో, ఆధార్ నంబర్ సమర్పించాలని ఇది వరకే స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి వివరాలు సేకరిస్తోంది. అయినా జిల్లాలో వేలాదిమంది రేషన్కార్డుదారులు వివరాల సమర్పణకు వెనకడుగు వేస్తున్నారు. వివరాలివ్వని వారందరూ బోగస్కార్డుదారులేనని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకే వారికి సరుకులు నిలిపేశారు. గతంలో ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి.. రేషన్ కార్డులు లేని 86,350 మందికి కార్డులు అందజేసింది.
ఇతర కార్డులపై అందజేస్తున్న మాదిరిగానే వీరికి బియ్యం, చక్కెర, కిరోసిన్, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు తదితర నిత్యావసర వస్తువులన్నీ అందిస్తోంది. రచ్చబండలో జారీ చేసిన కార్డుల్లో చాలా మంది అనర్హులున్నారని, కుటుంబంలో ఇతర సభ్యులకు కార్డులున్నా తప్పుడు సమాచారంతో మళ్లీ కార్డులు పొందారనే విమర్శలు వచ్చాయి. ఈ కార్డులపై రేషన్ కోటా కూడా పెరగడంతో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఫొటో, ఆధార్నంబర్ సేకరించాలని అధికారులను ఆదేశించింది.
రచ్చబండ కార్యక్రమాల్లో కార్డులు పొందిన వారిలో 47 వేల మంది ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పించారు. 13,350 మందిలో ఫొటో సమర్పిస్తే.. ఇంకొందరు ఆధార్ నంబర్ మాత్రమే ఇచ్చారు. 26 వేల మంది మాత్రం రెండింటిలో ఏ గుర్తింపూ ఇవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా వివరాలు సమర్పించకపోవడంతో.. పూర్తి సమాచారం ఇవ్వని వారికి నిత్యావసర వస్తువులు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
వ చ్చే నెల ఐదో తేదీలోగా ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పిస్తేనే వారికి ఆ నెల రేషన్ సరుకులు ఇవ్వాలని సూచించింది. ‘వివరాలు సమర్పించని వినియోగదారులు తమ పరిధిలోని రేషన్డీలర్లకు నిర్ణీత సమయంలోగా ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పించాలి. అయినా ఆలస్యం చేస్తే.. ఆ నెల కోటా ఇచ్చే ప్రసక్తే లేదు’ అని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చంద్రప్రకాశ్ తెలిపారు.
రేషన్ బంద్!
Published Sun, Aug 31 2014 3:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement