♦ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొట్టుకొచ్చిన నోట్లు
♦ నోట్ల కోసం బారులు తీరిన జనం
♦ దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు
సాక్షి, ముంబై : డబ్బులు చెట్లకు కాయవని, ఆకాశం నుంచి ఊడి పడవని అందరికీ తెలుసు. కానీ డబ్బుల వర్షం కురిస్తే, కళ్ల ముందే అలా అలా తేలుతూ పోతే.. అవీ వెయ్యి రూపాయల నోట్లు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద మంగళవారం సాయంత్రం అచ్చం ఇలాగే జరిగింది.ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ సముద్రంలో రూ. వెయ్యి నోట్లు తేలుతూ వస్తున్నాయి. క్షణాల్లో ఈ విషయం దావానలంలా వ్యాపించింది. దీంతో మత్స్యకారులు, ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నోట్ల ‘వేట’లో పడ్డారు.
తలా కొన్ని నోట్లను దక్కించుకున్నారు. జనప్రవాహం, నీటి ఉధృతి పెరగడంతో అక్కడికి వచ్చిన వారంతా చేసేదేమీ లేక ఉసూరుమంటూ చూస్తూ ఉండిపోయారు. మరికొంత మంది ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ప్రాణాలకు తెగించి డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న వారిని వారించి, జనాన్ని చెదరగొట్టారు. ‘ముందు ఒక నోటు కనపడింది. పెద్దగా పట్టించుకోలేదు. కానీ వరుసగా చాలా నోట్లు కనిపించాయి. అంతే సముద్రంలోకి దూకేశా. ఈ డబ్బు చూస్తూంటే భలేగా ఉంది’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు హరి సూరియా అనే స్థానికుడు.
అయితే ఈ వెయ్యి రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం అంతుబట్టడంలేదు. దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ ధనవంతుడు రూ.లక్షలున్న డబ్బుల సంచిని సముద్రంలోకి విసిరేశాడనే కథనం ప్రచారంలో ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎదురుగా ఉన్న ప్రఖ్యాత తాజ్ హోటల్లో బస చేసిన వ్యక్తే ఈ కరెన్సీని విసిరేసి ఉండవచ్చన్న ఉదంతి కూడా ఉంది. పోలీసులు సీసీ టీవీ కెమరాల వీడియో ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇంకా ఏ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. కొద్ది రోజులాగితే మొత్తం వ్యవహారం బయటపడొచ్చు.
సముద్రంలో రూ.వెయ్యి నోట్లు
Published Thu, Aug 13 2015 1:11 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement