జోగుళాంబకు బంగారు మాంగళ్యం | Sakshi
Sakshi News home page

జోగుళాంబకు బంగారు మాంగళ్యం

Published Fri, Oct 14 2016 4:22 PM

జోగుళాంబకు బంగారు మాంగళ్యం

అలంపూర్‌రూరల్ : అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారికి గురువారం భక్తుడు బంగారు మాంగళ్యాన్ని బహుకరించారు. బెంగుళూరుకు చెందిన ఎం.సతీష్ అనే వ్యాపారవేత్త రూ.1లక్ష15వేల విలువ చేసే 36 గ్రాముల బంగారు మాంగళ్యాన్ని అందజేశారు. కాగా వీటిని ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య ఆచారికి అందజేశారు. కార్యక్రమంలో భక్తుడు ఎం. సతీష్ కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామ సర్పంచ్ జయరాముడు, వీఆర్‌వో మద్దిలేటి ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ, ఆలయ ఉద్యోగి రంగనాథ్, ప్రదీప్ ఉన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement