ముంబై: మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 231 పరీక్ష కేంద్రాలకు పవర్ జనరేటర్లను, ఇన్వర్టర్లను అందించిందని రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి హైకోర్టుకు తెలిపింది. బోర్డుకు చెందిన అధికారులు ఇటీవల అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి, జనరేటర్లు, ఇన్వర్టర్లును తనిఖీ చేశారని పేర్కొంది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకట్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని విష్ణు గవలి అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ అభయ్ నేత ృత్వంలోని ధర్మాసనానికి బోర్డు ఈ విషయం తెలిపింది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకటిలో పరీక్షలు రాయాల్సివస్తోందని, అన్ని పరీక్ష కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన జనరేటర్లు ఏర్పాటు చేయాలని కోర్టు జులైలో ఆదేశించడంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది.
అయితే 18 పరీక్షా కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయలేద ని విద్యామండలి కోర్టుకు విన్నవించింది. దీంతో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. కేంద్రాల్లో విద్యుత్ కోతల సమస్యను 2008లో కోర్టుకు విన్నవించానని, కోర్టు దాన్ని పిల్గా స్వీకరించిందని విష్ణు గవలి తెలిపారు. 2009 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రభుత్వానికి అన్ని కేంద్రాల్లో 40వేలకు పైగా జనరేటర్లు ఏర్పాటుచేయాలని నిర్దేశించిందని తెలిపారు. అలాగే పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించొద్దంటూ రాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఆదేశించింది.
అన్ని పరీక్ష కేంద్రాల్లో జనరేటర్లు కోర్టుకు తెలిపిన విద్యామండలి
Published Sun, Mar 1 2015 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement