న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై గతంలో పలుమార్లు ఘాటైన విమర్శలు చేసిన ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మనసు మార్చుకున్నాడు. భారత జట్టులో యువరాజ్ చోటు కోల్పోవడానికి ధోనీయే కారణమని గతంలో నిందించిన యోగ్రాజ్.. ఇప్పుడు అతన్ని క్షమిస్తున్నట్టు చెప్పాడు. అంతేగాక ధోనీని దేవుడు క్షమించి, కాపాడాలని కోరాడు.
‘ధోనీని దేవుడు కాపాడాలి. కటక్ వన్డేలో అతను సెంచరీ చేయాలని కోరుకున్నా. నేను ధోనీని క్షమించాను. నా కొడుకు యువరాజ్కు చెడు చేసినందుకు ధోనీ క్షమించాల్సిందిగా దేవుణ్ని ప్రార్థిస్తున్నా. దేవుడు అతని వెన్నంటే ఉండి మంచి చేయాలని కోరుకుంటున్నా. యువీ మూడేళ్ల సమయాన్ని ధోనీ వృథా చేశాడు. అతను ఈ విషయాన్ని గ్రహించి దేవుడికి క్షమాపణలు చెప్పాలి. నాకు, నా పిల్లలకు చెడు చేసినవారిని నేను క్షమిస్తాను. అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ రాణించడం కోసం యువీ ఎంతో కష్టపడ్డాడు. యువీ కోసం ఎప్పుడూ దేవుణ్ని ప్రార్థిస్తుంటా. యువీకి నిత్యం అండగా ఉంటున్న నా కోడలు హజెల్ కీచ్కు అభినందనలు. యువీ, హజెల్ ఎప్పుడూ ఇలాగే కలసి ఉండాలని ఆశిస్తున్నా’ అని యోగ్రాజ్ అన్నాడు. కటక్ వన్డేలో యువీ, ధోనీ సూపర్ సెంచరీలతో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.
దేవుడా.. ధోనీని క్షమించి, కాపాడు
Published Sat, Jan 21 2017 10:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తనిఖీల్లో రూ.1.6 లక్షల పట్టివేత
మళ్లీ మోదీనే ప్రధాని
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్
గల్లంతైన మృతదేహాలు లభ్యం
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
అర్ధరాత్రి ఇళ్లలో చోరీ
బతికున్న రైతును చంపేసి..
పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు
మండుటెండలో ‘ఆసరా’ వెతలు
నిజాయతీ చాటుకున్న ఉపాధ్యాయుడు
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement