సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే తొలి మూడు వన్డేలనుంచి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనకు ముందు అతనికి బోర్డు విశ్రాంతి కల్పించింది. ఫలితంగా భారత జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహిస్తాడు. వచ్చే నెల 2న ప్రారంభమయ్యే ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల కోసం జట్టును సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం ఇక్కడ ప్రకటించింది. ధోనితో పాటు భువనేశ్వర్కు కూడా విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్ జట్టులోకి వచ్చారు. మరో వైపు విండీస్తో సిరీస్కు దూరంగా ఉన్న అశ్విన్ తిరిగి జట్టులోకి రాగా...ఆ సిరీస్లో మ్యాచ్ ఆడే అవకాశం రాని కుల్దీప్ యాదవ్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. మూడు మార్పులు మినహా మిగతా జట్టును కొనసాగించారు.
జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, రైనా, రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్, మిశ్రా, విజయ్, ఆరోన్, అక్షర్ పటేల్.
భారత ‘ఎ’ జట్టులో రోహిత్ శర్మ
వన్డే సిరీస్కు ముందు లంకతో జరిగే వార్మప్ వన్డేలో తలపడే భారత ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా విండీస్తో సిరీస్కు దూరమైన రోహిత్ శర్మకు ఇందులో చోటు లభించింది. ముఖ్యంగా అతని ఫిట్నెస్ను పరీక్షించేందుకే ఈ ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ఈ నెల 30న ముంబైలో జరుగుతుంది.
భారత ‘ఎ’ జట్టు వివరాలు: మనోజ్ తివారి (కెప్టెన్), ఉన్ముక్త్ చంద్, మనన్ వోహ్రా, కరుణ్ నాయర్, రోహిత్ శర్మ, కేదార్ జాదవ్, సంజు శామ్సన్, పర్వేజ్ రసూల్, కరణ్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్.
ధోనికి విశ్రాంతి
Published Wed, Oct 22 2014 12:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నోటుతో ఓటుకు ఎర
ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే స్వర్ణయుగం
No Headline
కందుకూరులో.. ఇక దూకుడే
సీఎం సవాల్ను స్వీకరించే దమ్ముందా చంద్రబాబూ?
బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక
గెలిపించండి.. అండగా ఉంటా
నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement