గుర్‌కీరత్ డబుల్ | Sakshi
Sakshi News home page

గుర్‌కీరత్ డబుల్

Published Sat, Oct 3 2015 1:05 AM

గుర్‌కీరత్ డబుల్

జడేజాకు ఆరు వికెట్లు 
 ఉమేశ్ యాదవ్ సెంచరీ 
 రంజీ ట్రోఫీ రౌండప్

 
మొహాలీ: భారత వన్డే జట్టులోకి ఎంపికైన గుర్‌కీరత్ సింగ్ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో సత్తా చాటాడు. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుర్‌కీరత్ (207 బంతుల్లో 201 నాటౌట్; 25 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం గీతాన్ష్ ఖేరా (102 నాటౌట్) సెంచరీ చేయడంతో పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువరాజ్ సింగ్ (23) విఫలమయ్యాడు. అనంతరం రైల్వేస్  వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.

 రాజ్‌కోట్: రవీంద్ర జడేజా (6/27) చెలరేగడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 204 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అనంతరం ఫాలోఆన్‌లో త్రిపుర 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

 నాగపూర్: భారత పేసర్ ఉమేశ్ యాదవ్ (119 బంతుల్లో 128 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) దూకుడైన బ్యాటింగ్‌తో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఒడిషా 2 వికెట్లకు 79 పరుగులు చేసింది.
 మొరాదాబాద్: మొహమ్మద్ సైఫ్ (287 బంతుల్లో 198; 18 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (164 బంతుల్లో 155; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 5 వికెట్లకు 656 పరుగులు చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement