-
#MIvsGT: ఊహించని షాక్.. హార్దిక్ రియాక్షన్ వైరల్!
#Hardik Pandya Reaction After Loss Battle To Umesh Yadav: ఐపీఎల్-2024.. గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్.. టాస్ గెలిచి.. ప్రత్యర్థిని 168 పరుగులకు కట్టడిచేసిన ముంబై ఇండియన్స్.. లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన.. ఆఖరి ఐదు ఓవర్లలో 43 పరుగులు కావాలి.. అప్పటికి ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. తిలక్ వర్మ నిలకడగా ఆడుతుండగా.. డెవాల్డ్ బ్రెవిస్ అప్పటికే జోరు మీదున్నాడు.. అతడి తర్వాత టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు కూడా ఉన్నారు. ఈ సమీకరణాలన్నీ చూసి ముంబై గెలుపు లాంఛనమే అనే అంచనాలు.. అయితే, పదహారో ఓవర్ ఐదో బంతి నుంచి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలుపెట్టారు గుజరాత్ బౌలర్లు. మోహిత్ శర్మ బ్రెవిస్(46)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. అనంతరం.. పద్దెనిమిదవ ఓవర్ ఆఖరి బాల్కు టిమ్ డేవిడ్(11)ను కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాతి రెండో బంతికే స్పెన్సర్ జాన్సన్ తిలక్ వర్మ(25)కు సెండాఫ్ ఇచ్చాడు. అనంతరం పందొమ్మిదో ఓవర్ చివరి బంతికి గెరాల్డ్ కొయెట్జీ(1)ని కూడా పెవిలియన్కు పంపాడు. అప్పటికి స్కోరు 150-7. ముంబై విజయానికి ఆరు బంతుల్లో 19 పరుగులు కావాలి. టిమ్ డేవిడ్ స్థానంలో క్రీజులోకి వచ్చి సింగిల్తో మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాపైనే ఆశలన్నీ! అందుకు తగ్గట్లుగానే ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చిన ఉమేశ్ యాదవ్కు సిక్సర్తో ఆహ్వానం పలికాడు హార్దిక్. మరుసటి బంతికే ఫోర్ బాదాడు. 6️⃣ • 4️⃣ • 𝗪 Skipper Hardik leads the fightback, but Umesh won the battle ⚔️🔥#IPLonJioCinema #TATAIPL #IPL2024 #GTvMI pic.twitter.com/R3K3ArF7OM — JioCinema (@JioCinema) March 24, 2024 అప్పుడు సమీకరణం.. నాలుగు బంతుల్లో 9 పరుగులు.. కానీ హార్దిక్కు.. ముంబై ఇండియన్స్కు ఊహించని షాకిచ్చాడు ఉమేశ్. పేసీ షార్ట్ బాల్తో పాండ్యాను బురిడీ కొట్టించి క్యాచ్ అవుట్గా వెనుదిరిగేలా చేశాడు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఉమేశ్ యాదవ్ వికెట్ను సెలబ్రేట్ చేసుకుంటూ హోరెత్తింది. Now that's a 𝘾𝙤𝙢𝙚𝙗𝙖𝙘𝙠 😍 Umesh Yadav with the all important wicket of Hardik Pandya when it mattered the most 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI | @gujarat_titans pic.twitter.com/1ijg3ISCCt — IndianPremierLeague (@IPL) March 24, 2024 దెబ్బకు హార్దిక్ పాండ్యా ముఖం మాడిపోయింది. ఆ తర్వాతి బంతికి పీయూష్ చావ్లాను అవుట్ చేసిన ఉమేశ్ యాదవ్ ముంబై గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి బంతికి షమ్స్ ములానీ సింగిల్ తీసి ఇన్నింగ్స్ ముగించగా.. గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచి గెలుపుతో సీజన్ను ఆరంభించింది. కాగా గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకే అహ్మదాబాద్ ప్రేక్షకులు ఆది నుంచే అతడిని ట్రోల్ చేస్తూ అరచి గోలగోల చేశారు. ఇలా హార్దిక్(4 బంతుల్లో 11 రన్స్) అవుట్ కావడం, ముంబై ఓడిపోవడంతో వారి సంబరాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
టీమిండియాలో నో ఛాన్స్.. కథ ముగిసిందని అర్ధం కాదు! భారత సెలక్టర్లపై?
ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్లో ఆఖరి మ్యాచ్లకు కూడా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దూరమయ్యాడు. కోహ్లితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్గా వెన్ను గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు ఎవరూ ఊహించిన విధంగా సెలెక్టర్లు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. ఉమేశ్కు మరోసారి నిరాశే.. ఇక ఇది ఇలా ఉండగా.. జట్టులో చోటు అశించిన వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్కు మరోసారి నిరాశే ఎదురైంది. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్నప్పటికి ఉమేశ్ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఉమేశ్ యాదవ్ సెలెక్టర్లపై పరోక్షంగా స్పందించాడు. తన ఇన్స్టాగ్రామ్లో ఓ క్రిప్టిక్ స్టోరీని ఉమేశ్ పోస్టు చేశాడు. ‘పుస్తకాలపై దుమ్ము పట్టినంత మాత్రాన కథ ముగిసిందని అర్థం కాదు’ అంటూ రాసుకొచ్చాడు. యాదవ్ చివరగా భారత తరపున గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్పై ఆడాడు. అయితే ఉమేశ్కు టెస్టుల్లో భారత గడ్డపై ఘనమైన రికార్డు ఉంది. స్వదేశంలో 2018 తర్వాత కేవలం 11 టెస్టులే ఆడిన యాదవ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 57 టెస్టుల్లో 170 వికెట్లు ఉమేశ్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో కూడా 7 ఇన్నింగ్స్లలో 19 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్తో మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహద్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్. Umesh Yadav gets emotional after the Indian squad announcement vs England.#INDvsENG #CricketTwitter #Cricket pic.twitter.com/daU6gBRYOP — 𝗦𝘁𝗿𝗼𝗸𝗲𝗢𝗚𝗲𝗻𝗶𝘂𝘀✍ 🇮🇳 (@Stroke0Genius41) February 10, 2024 -
బ్యాట్తో విజృంభించిన ఉమేశ్ యాదవ్
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో భాగంగా హ్యాంప్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో బంతితో కాకుండా బ్యాటింగ్లో చెలరేగాడు. ఎసెక్స్ తరఫున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఉమేశ్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Umesh Yadav smashed a fifty in just 45 balls in the County Championship. pic.twitter.com/2YMfZ15SDW— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 ఉమేశ్తో పాటు కెప్టెన్ టామ్ వెస్లీ (50), సైమర్ హార్పర్ (62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆడమ్ రొస్సింగ్టన్ (104) సెంచరీతో కదంతొక్కాడు. మాథ్యూ క్రిచ్లీ (99) పరుగు తేడాతా శతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఎసెక్స్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (0), నిక్ బ్రౌన్ (3), పాల్ వాల్టర్ (14) నిరాశపర్చగా.. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యుడు డానియెల్ లారెన్స్ (36) పర్వాలేదనిపించాడు. హ్యాంప్షైర్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫెలిక్స్ ఆర్గన్, మొహమ్మద్ అబ్బాస్ తలో 2 వికెట్లు, బార్కర్, కైల్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పాయింట్ల పట్టికలో ఎసెక్స్ రెండో స్థానంలో, హ్యాంప్షైర్ ఐదో స్థానంలో ఉన్నాయి. సర్రే అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
Team India Cricketers: భారత్లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లరంటే పడిచచ్చిపోయే అభిమానులకు కొదవే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్లు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మరి క్రికెట్ రంగానికి చేసిన, చేస్తున్న సేవలకు గానూ ప్రతిఫలంగా సముచిత గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా?! సముచిత గౌరవం సచిన్ టెండుల్కర్ టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు. అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే.. భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండుల్కర్. కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్కప్ ఫైనల్లో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 సాధించి లెజెండరీ కెప్టెన్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్కు భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది. ప్రభుత్వ ఉద్యోగంలో.. హర్భజన్ సింగ్ భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వందలకు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్.. భజ్జీని డిప్యూటి సూపరిండింటెండ్గా నియమించింది. జోగీందర్ శర్మ టీ20 ప్రపంచకప్-2007 చూసిన వారికి జోగీందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్తో జరిగిన హోరాహోరీ పోరులో జోగీందర్ తీసిన వికెట్తో భారత్ రెండోసారి(వన్డే ఫార్మాట్తో కలిపి) విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగీందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా అవకాశం వచ్చింది. ఉమేశ్ యాదవ్ మహారాష్ట్ర పేసర్ ఉమేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే భారత త్రివిధదళాల్లో ఏదో ఒక విభాగంలో పనిచేయాలని కల కన్నాడు. కానీ క్రికెటర్ అయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న అతడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నాగ్పూర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా అవకాశం కల్పించింది. యజువేంద్ర చహల్ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పి టీమిండియాకు విజయాలు అందించిన సందర్భాలెన్న! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో.. అత్యధికంగా 91 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన ఏకైన టీమిండియా బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇలా భారత క్రికెట్కు తన వంతు సేవ చేస్తున్న చహల్కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. టాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చింది. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం!
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
Advertisement