న్యూఢిల్లీ: తన పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలాంటి విజయం చాలా అవసరమని భారత టాప్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. సయ్యద్ మోడి గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ను గెలవడం చాలా సంతోషాన్నిస్తోందన్నాడు. ‘సీజన్ను ఆరంభించడానికి ఇంతకంటే మంచిది లేదు. మలేసియా, సయ్యద్ మోడి ఈవెంట్లలో బాగా ఆడాలని నవంబర్లోనే అనుకున్నా. అయితే మలేసియాలో ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగాను. లక్కీగా ఇక్కడ మాత్రం టైటిల్ను నెగ్గా.
ఈ టోర్నీలో రాణించాననే అనుకుంటున్నా. గతేడాది శ్రీకాంత్ చాలా మెరుగ్గా ఆడాడు. ఒక్కసారిగా నాలుగో ర్యాంక్లోకి దూసుకురావడంతో ఇక అందరూ నా పని అయిపోయిందని విమర్శలు మొదలుపెట్టారు. ఈ టోర్నీని మొదలుపెట్టినప్పుడు చాలా మంది నేను ఫామ్లో లేనని భావించారు. నిరుడు బాగా ఆడలేదు. కాబట్టి ఈసారి కూడా కష్టమేనని వ్యాఖ్యానాలు చేశారు.
అయితే కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నా కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నా. మూడు టోర్నీల్లో రెండింటిలో క్వార్టర్ ఫైనల్స్, ఒకదాంట్లో సెమీస్కు చేరా. కాకపోతే శ్రీకాంత్కు అన్నీ కలిసొచ్చి అద్భుతంగా ఆడాడు. దీంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ దశలో నాకు ఈ విజయం చాలా ముఖ్యం’ అని కశ్యప్ పేర్కొన్నాడు.
ఆందోళన కలిగిస్తోంది...
టైటిల్ గెలవడం ఆనందాన్ని కలిగించినా... మ్యాచ్ మధ్యలో పొత్తి కడుపు కండరం చిరిగిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోందని కశ్యప్ వెల్లడించాడు. ‘నా పొత్తి కడుపు కండరంలో చిన్న చీలిక వచ్చింది. ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉందో తెలియదు. హైదరాబాద్లో మంచి ఫిజియోలు లేరు. ముంబై వెళ్లి పరీక్షించుకోవాలి. గాయంపై కాస్త ఆందోళనతో ఉన్నా. అయితే నేను తర్వాత ఆడబోయే టోర్నీ ఆల్ ఇంగ్లండ్ కాబట్టి చికిత్స తీసుకోవడానికి అవసరమైన సమయం ఉంది. టోర్నీ సమయానికి కోలుకుంటా’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు.
శ్రీకాంత్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ... ‘మంచి ఫామ్లో ఉన్నాడు. పోటీ బాగా ఇచ్చాడు. ఫలితం ఇలాగే ఉంటుందని ముందే ఊహించా. గురుసాయిదత్, ఇతర ఆటగాళ్లతో పోటీపడ్డాను. కానీ ఏడాది కాలంగా శ్రీకాంత్తో తలపడలేదు. మళ్లీ చైనా, హాంకాంగ్ టోర్నీల్లో ఎదురవొచ్చు. ఇది ఒలింపిక్స్ అర్హత ఏడాది కావడంతో షట్లర్లందరికీ చాలా ముఖ్యమైంది. ర్యాంకింగ్పై కాకుండా టోర్నీలు గెలవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టా’ అని కశ్యప్ వివరించాడు.
విమర్శకులకు సమాధానమిదే!
Published Tue, Jan 27 2015 12:34 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement