భారీ వర్షాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు అతలాకుతలం అవుతున్నాయి. ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. మరోవైపు క్లయింటులు మాత్రం తమ అవసరాల కోసం యాజమాన్యాల మీద ఒత్తిడి తేవడం మానట్లేదు. చెన్నైలో పనిచేస్తున్న వాళ్లలో కీలక ఉద్యోగులు చాలామందిని వేరే ప్రాంతాలకు పంపేసి.. అక్కడినుంచి పని చేయాల్సిందిగా కోరతున్నారు. ప్రధానంగా ఐబీఎం, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, టీసీఎస్.. ఇలాంటి పలు కంపెనీల ఉద్యోగులు చాలామంది భారీ వర్షాల కారణంగా ఆఫీసులకు వెళ్లలేకపోతున్నారు. దాంతో, చెన్నైలో ఉన్న చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరుతున్నాయి.
పోనీ కనీసం కొంతమందినైనా 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆప్షన్ ఉపయోగించుకుని పని చేయిద్దామంటే, చెన్నైలో చాలా ప్రాంతాలలో కరెంటు ఉండట్లేదు. దాంతో పాటు.. మొత్తం జలమయం అయిపోవడంతో ఇంటర్నెట్ సదుపాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లతో పని చేయించడం ఎలాగో అర్థం కాక, పని జరిగే వీలు లేక యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. చెన్నై కేంద్రంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు, విద్యుత్ లైన్లు బాగా పాడయ్యాయి. కేవలం వీటి రూపంలో కలిగిన నష్టాలే దాదాపు రూ. 8,481 కోట్ల మేరకు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వస్తుసేవలు, ఇలాంటి సాఫ్ట్వేర్ సేవలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ నష్టం ఎన్ని లక్షల కోట్లకు చేరుకుంటుందో చూడాలి. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. దాంతో అక్కడి ఉన్నతోద్యోగులను అత్యవసరంగా బెంగళూరు పంపేసి.. అక్కడినుంచి ప్రాజెక్టుల పని చూస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వాళ్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ.. వేర్వేరు నగరాలకు సిబ్బందిని పంపుతున్నారు. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి.
సాఫ్ట్వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వర్షాలు
Published Wed, Nov 25 2015 4:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement