ఇటీవల ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగి, ఉద్రిక్తతలు చెలరేగిన ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ ప్రాంతంలో పర్యటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. అక్కడ ఆయన పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేమని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ ఆదిత్య మిశ్రా తెలిపారు. మొత్తం రాజకీయ నాయకులందరి పర్యటనలను జిల్లా యంత్రాంగం నిషేధించినందున రాహుల్ సహా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు. తొలుత ఈ ప్రాంతాల్లో పర్యటించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పీఎల్ పునియా భావించారు. తనకు అనుమతి రాకపోవడంతో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఇళ్లు కాలిపోయిన దళిత కుటుంబాలను కలిసి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించాలని రాహుల్ భావించారు.
మే 5వ తేదీన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా షబ్బీర్పూర్ గ్రామంలో ఠాకూర్లు ఊరేగింపు జరపగా దానికి దళితులు అడ్డు చెప్పడం, ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలలో ఒక ఠాకూర్ యువకుడు మరణించడంతో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు చెలరేగాయి. దళితులకు చెందిన 50 గుడిసెలు తగలబడ్డాయి. వారిలో కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ వారం ప్రారంభంలో ఆ గ్రామాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి సందర్శించిన తర్వాత మళ్లీ గొడవలు చెలరేగి మరో వ్యక్తి మరణించాడు. దాంతో ఇక ఇక్కడకు రాజకీయ నాయకులు ఎవ్వరినీ అనుమతించకూడదని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పరిస్థితి మొత్తం సాధారణ స్థితికి చేరుకునేవరకు ఎవరికీ అనుమతి ఇవ్వబోమని అదనపు డీజీ ఆదిత్య మిశ్రా చెప్పారు.
రాహుల్ పర్యటనకు.. అనుమతి నో
Published Fri, May 26 2017 3:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
గంటల్లోనే పరిహారం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement