నైనితాల్: ఉత్తరాఖండ్లో ఓ మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక మ్యాగీ సంస్థలో పనిచేస్తున్న అతడు ఆ సంస్థ మూత పడటంతో ప్రాణం బలి తీసుకున్నాడు. మ్యాగీలో ఆందోళన కలిగించిన లెడ్ మోతాదు నెస్లే కొంపముంచిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ నైనితాల్కు సమీపంలోని రుద్రాపూర్లో ఓ మ్యాగీ ప్లాంట్ ఉంది. ఇందులో లల్టా ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. నెస్లే కంపెనీ ఉత్పత్తులను 90 రోజులపాటు నిషేధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆ సంస్థ మూతపడింది.
దీంతో అందులో పనిచేసేవారంతా రోడ్డున పడ్డారు. మానసికంగా కుంగిపోయిన ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 13 రోజుల తరువాత దాని పరిణామం వెలుగు చూసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు 1100 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారట. మరోవైపు ఉత్తరాఖండ్లోని మ్యాగీ శ్యాంపిళ్లను పరిశీలించిన హైకోర్టు దీనిపై నివేదిక పంపించాల్సిందిగా నెస్లేను కోరింది. తదుపరి విచారణను జూన్ 20 కి వాయిదా వేసింది. కాగా, మ్యాగీ నూడుల్స్ను నిషేధించడంతో రూ.320 కోట్ల విలువైన నూడుల్స్ను ధ్వంసం చేస్తున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మార్కెట్, ఫ్యాక్టరీల్లోని నిల్వలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.
మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్య
Published Tue, Jun 16 2015 12:13 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
రాజస్థాన్లో భూకంపం.. భయంతో జనం పరుగులు
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ఇంత దారుణమా..
ఆస్తి కోసమే బాలిక హత్య
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
Advertisement