సాక్షి, న్యూఢిల్లీ: మెహ్రోలీ, కృష్ణానగర్, తుగ్లకాబాద్ శాసనసభ నియోజకవర్గాలకు వచ్చే నెల 25న ఉప ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలతోపాటు ఢిల్లీలోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ శనివారం ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 28న వెలువడనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23న జరుగుతుంది. నామినేషన్లను వచ్చే నెల ఐదో తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏడున నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. పదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 29న ముగుస్తుందని ఈసీ ప్రకటించింది. మెహ్రోలీ, కృష్ణానగర్, తుగ్లకాబాద్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ప్రవేశ్వర్మ, హర్షవర్ధన్, రమేష్ బిధూడీ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో వారంతా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా ఇవ్వడంతో ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. అయితే శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరుపుతారని అంతా ఆశిస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్....ఉప ఎన్నికల ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు ఇప్పట్లో జరగకపోవచ్చనికొందరు రాజకీయ పండితులు అంటున్నారు. మరికొందరు మాత్రం ఉప ఎన్నికల ప్రకటన కు, అసెంబ్లీ రద్దుకు సంబంధం లేదని అంటున్నారు. శాసనసభ ఎన్నికలు జరిపించే అవకాశాలు ఉన్నాయని వార ంటున్నారు.
లోక్సభ ఎంపీలుగా మారిన ముగ్గురు ఎంపీలూ... శాసనసభకు మే నెలాఖరున రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నికలు నిర్వహిం చాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రకటన నెలరోజుల ముందుగా చేయాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల కారణాల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఉప ఎన్నికల ప్రకటన చేసిందని వారంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక శాసనసభను రద్దు చేస్తారా ? అనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అందువల్ల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కేంద్రం ఇచ్చే జవాబుపై ఆధారపడి ఉంటుందని వార ంటున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఢిల్లీ శాసనసభ భవితవ్యం తేలే రోజునే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
మోగిన ఉప ఎన్నికల నగారా
Published Sat, Oct 25 2014 10:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement