ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కొత్త బాధ్యతలు తలకెత్తుకోవడానికి ముందుకొచ్చారు. ఈ నెలాఖరులో జరగాల్సిన తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - ‘మా’) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన బరిలో దిగుతున్నారు. ఈ సంగతి ఆయన సోమవారం మధ్యాహ్నం మీడియా సాక్షిగా ప్రకటించారు. ‘‘గడచిన 37 ఏళ్ళుగా నా సినిమాలతో అందరినీ అలరిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ వచ్చిన నేను ఇటీవల మా అబ్బాయి పెళ్ళి కూడా చేసేశాక, కొత్త బాధ్యతలు తీసుకోదలిచాను.
ఒక పక్క నటుడిగా పాత్రలు పోషిస్తూనే, కొంత సమయాన్ని నా తోటి కళాకారుల సేవ కోసం వినియోగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ‘‘ఇవాళ కళాకారులకు ఆరోగ్యం అతి పెద్ద సమస్యగా మారింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా కళాకారులందరికీ ఒకేలా ఆరోగ్యపరమైన సదుపాయం కలిగేలా చూడాలనీ, అందరినీ కలుపుకొని ఒకే తాటి మీద వెళ్ళాలనీ భావిస్తున్నా’’ అని ఆయన వివరించారు. గతంలో చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసి, కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ, ఈ నెల 29న జరిగే ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవికి అందరి సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని రాజేంద్రప్రసాద్ భావిస్తున్నారు. రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగువాళ్ళమే కాబట్టి, రెండు రాష్ట్రాల నటీనటులూ తనకు మద్దతుగా నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలోనే వారసుడి తెరంగేట్రం: కాగా, తన సినీ వారసుడి తెరంగేట్రానికి పనులు చురుకుగా సాగుతున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కుమారుడు బాలాజీ త్వరలోనే ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించే చిత్రంతో హీరోగా ముందుకు రానున్నట్లు ఆయన చెప్పారు. ఆ సినిమాకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.
‘మా’ అధ్యక్ష పదవి బరిలో...
Published Tue, Mar 3 2015 12:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement