టోఫెల్ ప్రశ్నాపత్రాన్ని హ్యాక్ చేసిన ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

టోఫెల్ ప్రశ్నాపత్రాన్ని హ్యాక్ చేసిన ముఠా అరెస్ట్

Published Sun, Aug 30 2015 10:30 AM

toefl entrance exam paper leak gang busted in hyderabad

హైదరాబాద్ : టోఫెల్ పరీక్ష ప్రశ్నాపత్రం హ్యాక్ చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ రెడ్డితోపాటు నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు. కంప్యూటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ట్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. టోఫెల్ పరీక్షకు దాదాపు 10 గంటల ముందే పరీక్ష పత్రాన్ని ఈ ముఠా డౌన్లోడ్ చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసం 78 సర్వర్లను వీరు హ్యాక్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement