ఉద్యోగుల ఉరుకులు పరుగులు తప్పిన ప్రాణాపాయం
రికార్డులు, వాహనాలు దగ్ధం
నాంపల్లి: లక్డీకాపూల్లోని సింగరేణి భవన్లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒకపక్క అలారాల మోత.. మరో పక్క భవనం మొత్తం కమ్మేసిన దట్టమైన పొగ. దీంతో ఆందోళనకు గురైన సుమారు 400 మంది ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. వివరాలు.. సరిగ్గా సాయంత్రం 4.30కి సింగరేణి భవన్ సెల్లార్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ పైఅంతస్తులకు చేరింది. అదే సమయంలో లిఫ్ట్లు పని చేయలేదు. మెట్ల మీదుగా దిగుదామంటే పొగ వల్ల ఏమీ కనిపించడంలేదు. దీంతో కొందరు ఉద్యోగులు కిటికీల్లోంచి దూకే ప్రయత్నం చేశారు. కింద ఉన్న వారు నిలువరించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చేసేదేమి లేక పొగతో మూసుకుపోయిన మెట్ల మీదుగానే ఉద్యోగులు బయటకు వచ్చారు. కొందరు ఉద్యోగులు పోలీసు సహాయంతో మొదటి అంతస్తునుంచి కిందకు దిగారు. అప్పటికే సమాచారం అందుకున్న అసెంబ్లీ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి గౌలిగూడ నుంచి మరో ఫైరింజిన్ వచ్చింది. రెండు ఫైరింజిన్ల సిబ్బంది సుమారు 45 నిమిషాలు కష్టపడి మంటలను ఆర్పివేశారు.
తప్పిన పెనుముప్పు...
సింగరేణి భవన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సెల్లార్ నుంచి మంటలు మొదటి అంతస్తుకు విస్తరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు, కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.
పాతరికార్డులు, వాహనాలు దగ్ధం...
సింగరేణి భవన్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సెల్లార్లో భద్రపరిచిన పాత రికార్డులన్నీ దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న వాహనాలు కాలిపోయాయి.
పోలీసుల దర్యాప్తు షురూ...
ప్రమాద స్థలాన్ని సైఫాబాద్ ఏసీపీ సురేందర్రెడ్డి, నాంపల్లి సీఐ మధుమోహన్రెడ్డి పరిశీలించారు. షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా సిగరెట్ తాగి పడేశారా, లేక రికార్డులను కాల్చివేయాలనే దురుద్దేశంతోనే తగులబెట్టారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సింగరేణి భవన్లో అగ్నిప్రమాదం
Published Tue, Aug 4 2015 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement