'కేసీఆర్పై ఆ వ్యాఖ్యలు సరికావు' | Sakshi
Sakshi News home page

'కేసీఆర్పై ఆ వ్యాఖ్యలు సరికావు'

Published Tue, Jun 28 2016 8:28 PM

'కేసీఆర్పై ఆ వ్యాఖ్యలు సరికావు' - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలు సరికావని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. చట్టప్రకారం హైకోర్టు విభజన చేయాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు.

హైకోర్టు విభజన పూర్తైన తర్వాతే న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితో కేంద్రం కావాలనే హైకోర్టు విభజనను ఆలస్యం చేస్తుందని ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు.

Advertisement
Advertisement