105 నుంచి 112 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం..
‘ఆరా’ సర్వేలో వెల్లడి
15 నుంచి 18 ఎంపీ స్థానాలు వైఎస్సార్ సీపీవేనని స్పష్టీకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని అగస్త్య రీసెర్స్ అండ్ అనాలసిస్ ఏజెన్సీ (ఆరా) జరిపిన సర్వేలో తేలింది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు మూడింట రెండొంతులు వైఎస్సార్ సీపీ వశమవుతాయని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 శాతం ఓట్లతో 105 నుంచి 112 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని వెల్లడించింది. ఇక్కడి 25 లోక్సభ స్థానాల్లో 15 నుంచి 18 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని తెలిపింది.
తెలుగుదేశం - బీజేపీల కూటమి 55 నుంచి 65 అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 10 లోక్సభ స్థానాలు సాధించవచ్చని అంచనా వేసింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్కు, టీడీపీ-బీజేపీ కూటములకు వచ్చే ఓట్ల మధ్య 8 శాతం వ్యత్యాసముందని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు 10 నుంచి 15 స్థానాలు, 1 లోక్సభ స్థానం పొందవచ్చని తెలిపింది.
తెలంగాణలో హంగ్: తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ స్థానాలు పొందుతుందని, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇక్కడ టీడీపీ, బీజేపీల కూటమిది మూడో స్థానమేనని తెలిపింది. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ స్థానాలకుగాను 40 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 52 నుంచి 57 స్థానాలు పొందుతుందని వెల్లడించింది. కాంగ్రెస్, సీపీఐల కూటమి 31 శాతం ఓట్లతో 43 నుంచి 45 స్థానాలు పొందవచ్చని తెలిపింది. టీడీపీ, బీజేపీల కూటమికి దక్కేది 12 నుంచి 15 అసెంబ్లీ స్థానాలేనని సర్వేలో స్పష్టమైంది.
ఇక్కడ వైఎస్సార్సీపీకి 3 నుంచి 6 అసెంబ్లీ సీట్లు, ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలు వస్తాయని తెలిపింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్కు 7 నుంచి 9, కాంగ్రెస్-సీపీఐ కూటమికి 4 నుంచి 6, టీడీపీ-బీజేపీ కూటమికి 2 నుంచి 3, ఇతరులకు 1 లేదా 2 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలిపింది. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక లోక్సభ స్థానం దక్కవచ్చని పేర్కొంది.
సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ హవా
Published Tue, Apr 22 2014 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement