హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి పట్ల తన కుయుక్తులు మరోసారి ప్రదర్శించారు. పొత్తు ధర్మం తప్పారు. కమలనాథులకు షాక్ ఇచ్చారు. ముందు కేటాయించిన ఒక శాసనసభ స్థానం వదులుకొని బిజెపి ఎంత సామరస్యంగా వ్యవహరించినప్పటికీ చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు. బిజెపికి కేటాయించిన స్థానాల్లో పోటీకి దిగిన ఇద్దరు టిడిపి అభ్యర్థులకు చంద్రబాబు పార్టీ బిఫారాలు ఇచ్చారు. టిడిపి నేతలకు దిమ్మతిరిగిపోయింది.
టిడిపి-బిజెపి పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లా కడప శాసనసభ స్థానాలను బిజెపికి కేటాయించారు. బిజెపి సంతనూతలపాడు స్థానం దారా సాంబయ్యకు, కడప స్థానం కె.హరినాథ్రెడ్డికి కేటాయించింది. ఆ రెండు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారికి టిడిపి బిఫారాలు కూడా ఇచ్చేశారు. చంద్రబాబు వైఖరిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టిడిపితో పొత్తు వద్దని స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ బిజెపి అధిష్టానం వారి మాటలను పెడచెవిన పెట్టింది. నామినేషన్లు వేసే సమయంలో పొత్తు బెడిసి కొట్టింది. బిజెపితో పొత్తులేదని నిన్న, మొన్న టిడిపి నేతలు ప్రచారం చేశారు. నిన్న రాత్రి మళ్లీ ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఇచ్ఛాపురం శాసనసభ స్థానంను బిజెపి వదులుకొని టిడిపికి కేటాయించింది. బిజెపి 4 లోక్సభ, 13 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. నరసరావుపేట, కోడుమూరులలో అభ్యర్థులను మార్చడానికి కూడా బిజెపి అంగీకరించింది. మళ్లీ పొత్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తెల్లారిన తరువాత మళ్లీ కథ మొదలు. చంద్రబాబు తన నైజం చూపారు. బిజెపి అంత దిగి వచ్చినా ఆయన తన శైలి మార్చుకోలేదు. చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు.
చంద్రబాబు చంద్రబాబే!
Published Sat, Apr 19 2014 3:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement