- గుత్తి సమీపంలో అదుపు తప్పి ఓల్వో బస్సు బోల్తా
- 17 మందికి తీవ్ర గాయాలు
- ఐదుగురి పరిస్థితి విషమం
- బాధితుల్లో హిందూపురం, హైదరాబాద్, పత్తికొండ, కరీంనగర్ వాసులు
- సకాలంలో స్పందించిన పోలీసులు
అందరూ గాఢనిద్రలో ఉన్నారు. బస్సు రయ్య్య్...మని పరుగులు తీస్తోంది. మరికొన్ని గంటలు గడిస్తే గమ్యస్థానం చేరుకుంటారు. అంతలోనే ఒకరిపై మరొకరు పడిపోయారు. అందరికీ ఎక్కడబడితే అక్కడ రక్తగాయాలయ్యాయి. హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరిగిందో తెలియగానే ఒక్కసారిగా నిద్రమత్తు వదిలింది. ఒకవైపు రక్తమోడుతున్నా.. మరోవైపు తమ వారి కోసం చీకట్లోనే వెతకడం ఆరంభించారు. కొన ఊపిరితో ఉన్నారని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. తెలతెలవారుతుండగా జరిగిన ఈ ఘటనతో వన్నేదొడ్డి-కొత్తపేట గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
- గుత్తి / గుత్తి రూరల్ (గుంతకల్లు)
గుత్తి మండలం వన్నేదొడ్డి– కొత్తపేట గ్రామాల మధ్య శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన ఓల్వో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో 15 మంది ప్రయాణికులు సహా, బస్సు డ్రైవర్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఎలా జరిగిందంటే..
హైదరాబాద్కు చెందిన టి–ఆర్టీసీ బస్సు 48 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి బెంగుళూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని వన్నేదొడ్డి– కొత్తపేట గ్రామాల మధ్య లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే అదృష్టశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ హిందూపురం, హైదరాబాద్, పత్తికొండ, కరీంనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన వారు.
గాయపడింది ఎవరెవరంటే...
హిందూపురానికి చెందిన సాల్మన్ సుధీర్, హైదరాబాద్కు చెందిన భాగ్యవతి, జ్యోతి(మనవరాళ్లు), హల్కా, విజయ్(దంపతులు), అఖిల, సురేశ్, విజయేంద్ర, ప్రణీత, వినయ్, గౌరి, సుజయ్, భరత్, బస్సు డ్రైవర్లు సీహెచ్వీ రావు(కరీంనగర్), శీనయ్య(హైదరాబాద్), కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నీలకంఠ, పంజాబ్కు చెందిన కుస్కుమార్ గాయపడిన వారిలో ఉన్నారు.క్షతగాత్రులందరినీ గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో అఖిల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి, జ్యోతి, భాగ్యవతి, హల్కా, విజయ్ను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గుత్తి ఎస్ఐ చాంద్బాషా, ఏఎస్ఐ ప్రభుదాస్ సహా పామిడి సీఐ నరేంద్రరెడ్డి, పెద్దవడుగూరు ఎస్ఐ రమణారెడ్డి తమ సిబ్బందితో వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. చీకటిలోనే గాయపడ్డ వారిని అతికష్టమ్మీద బయటకు తీసుకురాగలిగారు. ఆ తరువాత వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించారు. తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల చొరవను అభినందించారు.
ఫర్లాంగు దూరం ముందుకెళ్లి ఉంటే..
ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరో ఫర్లాంగు ముందుకెళ్లి బస్సు అదుపు తప్పి ఉన్నట్లైతే పెను ప్రమాదం జరిగేది. బస్సు బోల్తాపడిన సమీపంలోనే 33 కేవీ విద్యుత్ టవర్ ఉంది. దాన్ని బస్సు ఢీకొని ఉన్నట్లైతే ఏ ఒక్కరూ మిగిలి ఉండేవారు కాదు. అడుగుల దూరంలోనే ఘోరం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెల్లవారుజామున హాహాకారాలు
Published Sat, May 27 2017 11:45 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. మోదీకి కృతజ్ఞతలు
హీట్ పెంచేలా మృణాల్.. చీరలో మరింత అందంగా ఆషిక!
ఒడిశా: పాలిటిక్స్కు వీకే పాండియన్ గుడ్బై
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
నా బయోపిక్లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
బన్నీతో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న బాలీవుడ్ హీరో
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
తప్పక చదవండి
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- ‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
Advertisement