* ప్రకటించి ఏడాదైనా ముందుకు కదలని పనులు
* నేడు కాకినాడలో ఆకర్షణీయ నగర వార్షికోత్సవం
కాకినాడ : దేశవ్యాప్తంగా 100 నగరాలతో పోటీపడి తొలివిడత స్మార్ట సిటీ జాబితాలో స్థానం దక్కించుకున్న కాకినాడ ఆకర్షణీయ నగరం దిశగా అంతంతమాత్రంగా అడుగులేస్తోంది. మొదటి ఏడాదికి నిధులు విడుదలైనా, అవి చేతికి అందక పనులు నెమ్మదించాయి. స్మార్ట్సిటీ మిషన్ను ప్రకటించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం ఆకర్షణీయ నగరాల్లో వార్షికోత్సవాలను జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది.
నిధులు చేతికందక..
తొలివిడత స్మార్ట్సిటీగా ఎంపికైన కాకినాడకు ప్రభుత్వం రూ.376 కోట్లు దాదాపు మూడు నెలల క్రితమే విడుదల చేసింది. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, మిగిలిన 50 శాతం కేంద్రవాటాగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఆ నిధులు చేతికి అందలేదు.
విడుదలైన స్మార్ట్సిటీ నిధులు ఖర్చు చేయాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతితో పీడీ అకౌంట్ ప్రారంభించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయగా క్లియరెన్స్రాలేదని, అందువల్లే నిధులు ఇంకా జమకాలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య కొలిక్కి వచ్చి పనులు వేగవంతం చేస్తామని వారు చెబుతున్నారు.
సోలార్ పరికరాల ఏర్పాటు
స్మార్ట్ సిటీలో భాగంగా విద్యుత్ ఆదాచేసే క్రమంలో సోలార్ పరికరాల ఏర్పాటుకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.40కోట్ల విలువైన ఐదుమెగా వాట్ల విద్యుత్ పరికరాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. సుమారు 42 ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఈ-పాఠశాలలు ప్రారంభం
స్మార్ట్సిటీలో భాగంగా రామకృష్ణారావుపేటలోని మున్సిపల్ స్కూల్లో ఈ-పాఠశాలకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. కంప్యూటర్ ల్యాబ్స్, ప్రొజెక్టర్లు, ఆడియో, సీడీ, డీవీడీ, వీడియో ద్వారా విద్యాబోధన చేసేలా ఈ-పాఠశాలలకు శ్రీకారంచుడుతున్నారు. తొలివిడత ఒక పాఠశాలలో ప్రారంభిస్తున్నా, మలివిడత 23 స్కూళ్లల్లో ప్రవేశపెట్టనున్నారు.
హైజనిక్ స్టాల్స్
తోపుడుబళ్ల స్థానంలో హైజనిక్ ఫుడ్ వెండింగ్ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో దాదాపు 100 వరకు మెషీన్లను ఇక్కడ ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించి శనివారం వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నేడు ప్రత్యేక సదస్సు
స్మార్ట్సిటీ తొలివార్షికోత్సవ సదస్సును శనివారం ఉదయం ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొననున్నారు.
వేగవంతంగా స్మార్ట్సిటీ పనులు
స్మార్ట్సిటీ దిశగా పనులన్నీ వేగవంతమవుతున్నాయి. తొలుత సోలార్ పరికరాల ఏర్పాటు, ఈ పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. ఆ తరువాత మిగిలిన పనులను వేగవంతం చేస్తాం. ఇప్పటికే కాకినాడ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్గా రిజిష్టర్ చేయించాం. అవసరమైన అన్ని ప్రతిపాదనలు ఒక్కొక్కటిగా వేగవంతం చేస్తాం.
- ఎస్.అలీమ్భాషా, కాకినాడ కమిషనర్
స్మార్ట్ కి స్టార్టింగ్ ట్రబుల్
Published Sat, Jun 25 2016 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement