మాదక ద్రవ్యాలు తీసుకోవడం నేరం | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాలు తీసుకోవడం నేరం

Published Sat, Nov 26 2016 3:51 AM

మాదక ద్రవ్యాలు తీసుకోవడం నేరం - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ: మాదకద్రవ్యాల వినియో గం తీవ్ర నేరమని మహాత్మాగాంధీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ జె. చాందిని అన్నారు. ఈ విషయంపై కళాశాల విద్యార్థుల్లో విసృ్తత అవగాహన కల్పించేం దుకు కృషి చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ, చెన్నైయ్‌కు చెందిన తమ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ప్రచారానికి చక్కని స్పం దన లభిస్తోందన్నారు. ఏవియేషన్ విద్యార్థులు మహా త్మాగాంధీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో చక్‌దే ఇండియా కార్యక్రమంలో భాగంగా  జిల్లాలో ప్రచారం చేపడుతున్నామని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు  అనూష, షేక్ అబ్దుల్లా, డి.సుమంత్, శశికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement