ఔటర్‌పై లారీ బోల్తా.. డ్రైవర్ మృతి | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

Published Fri, Nov 18 2016 9:13 AM

driver died in a lorry overturned incident

శంషాబాద్: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హమీదుల్లానగర్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

గచ్చిబౌలి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ హమీదుల్లానగర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement