♦ మోదీ, నితీశ్ తదితరుల పేర్లు ప్రస్తావించిన చంద్రబాబు
♦ వీరిలో చాలామందికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేవని వ్యాఖ్య
♦ పార్టీ నేతలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగాఉండాలి
సాక్షి, హైదరాబాద్: నిత్యం ప్రజల్లో ఉండే తాను రెండు విడతలు సీఎం పదవికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, ప్రజలతో అంతగా సన్నిహిత సంబంధాలు నెరపనివారు మళ్లీ మళ్లీ సీఎంలు అవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (గతంలో గుజరాత్ సీఎంగాపనిచేశారు) నవీన్ పట్నాయక్ (ఒడిశా), నితీశ్కుమార్ (బీహార్), జయలలిత (తమిళనాడు), రమణ్సింగ్ (ఛత్తీస్గఢ్), శివ్రాజ్సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)ల పేర్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీరిలో చాలామందికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేవన్నారు. సోమవారం నాటి కేబినెట్ భేటీ నుంచి అధికారులు నిష్ర్కమించిన తర్వాత.. మంగళవారం నుంచి జరిగే జనచైతన్య యాత్రలను విజయవంతం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేయటం తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయినవారి గురించి, ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకున్నా మూడు అంతకంటే ఎక్కువసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టినవారి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీకి పొరుగున ఉన్న రాష్ట్రాల సీఎంలు ప్రజలను నేరుగా కలిసిన సందర్భాలు తక్కువన్నారు.
అయినప్పటికీ అక్కడి ప్రజలు వారిని గెలిపిస్తున్నారని, మన రాష్ట్రంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా ఓడిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫలితాలు ఎన్నిక, ఎన్నికకు భిన్నంగా ఉంటున్నాయని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు అయిదేళ్లకోమారు ప్రజా తీర్పును కోరాల్సిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉండాలని సూచించారు. సీనియర్లు పరిస్థితులకు అనుగుణంగా అందరితో కలసి మెలసి పనిచేయాలన్నారు. మంత్రులు కుల సంఘాల సమావేశాలకు వెళ్లవద్దని సూచించారు.
ఏ పార్టీవారినైనా చేర్చుకోండి..
పార్టీకి ఉపయోగపడతారనుకునే నేతలు ఏ పార్టీలో ఉన్నా చేర్చుకునే ప్రయత్నం చేయాలని బాబు చెప్పారు. త్వరలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలి వరద సహాయ పనుల్లో కొందరు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారని వ్యాఖ్యానించారు. మారిై టెమ్ బోర్డు చైర్మన్గా సీఎం ఉండాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. యనమల రామకృష్ణుడు, కె.అచ్చన్నాయుడు తదితరులు ఇది సరికాదని చెప్పటంతో ఈ పదవిని పార్టీ నేతకు కేటాయించాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటుచేసే నగరాభివృద్ధి సంస్థలకు సీఎం చైర్మన్గా ఉండాలా లేదా మరొకరిని నియమించాలా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. సీఎం అలాంటి చిన్న సంస్థలకు చైర్మన్గా ఉండటం సరికాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు సమర్థించారు.
మళ్లీ మళ్లీ వాళ్ళే సీఎంలు అవుతున్నారు
Published Tue, Dec 1 2015 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement