కేసీఆర్ స్ఫూర్తితో విదర్భ సాధిస్తాం | Sakshi
Sakshi News home page

కేసీఆర్ స్ఫూర్తితో విదర్భ సాధిస్తాం

Published Thu, Dec 1 2016 3:25 AM

arjun patil and ramnival prices cm kcr

రాష్ట్ర సాధన సమితి నాయకులు అర్జున్‌పాటిల్, రాంనివాల్
కాళేశ్వరం: తెలంగాణ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మహారాష్ట్రలోని విద ర్భ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిం చుకుందామని విదర్భ ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి(వీఆర్‌ఎస్), ఆలిండియా మహాత్మాఫూలే వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మెగజే అర్జున్‌పాటిల్, సమితి చీఫ్ కోఆర్డినేటర్ రాంనివాల్ పిలుపునిచ్చారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర సాధన సమితి సభతో పాటు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో నాగ్‌పూర్ వరకు సాగే ’దిండి యాత్ర’ను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసెంబ్లీ శీతకాల సమావేశాల సందర్భంగా 50 వేల మందితో ఆందోళన  చేపడున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement