♦ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు
♦ ‘పాలమూరు-రంగారెడ్డి’లో ప్రవేశపెట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికప్పుడు పెరిగే ధరలకు అనుగుణంగా ధరల సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు కల్పించే అంశమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాల మూరు కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న బిడ్ డాక్యుమెంట్లో ఈ వెసులుబాటును నీటి పారుదల శాఖ పొందుపరచగా, దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిజానికి ఇప్పుడు అమలవుతున్న ఈపీసీ విధానంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు కాం ట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయాలనే నిబంధన ఉంది. కార్మికుల వ్యయాన్ని పెంచకూడదనే నిబంధనను ప్రభుత్వం అనుసరిస్తోంది.
నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కాం ట్రాక్టర్లు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. సకాలంలో భూ సేకరణ పూర్తి కాకపోవడం, అటవీ అనుమతులు రాకపోవడంతో మెటీరియల్, లేబర్ ధరలు భారీగా పెరిగి ఆర్ధిక నష్టాలను కలిగిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ వినతిని పరిశీలించిన నీటి పారుదల శాఖ పాలమూరు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బిడ్ డాక్యుమెంట్లో లేబర్, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్కు పెరిగే ధరలకు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేయాలనే వెసులుబాటును చేర్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ విధానం ప్రపంచబ్యాంకు, జైకా సహకారంతో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో మా త్రమే అమల్లో ఉంది. దీన్ని ప్రస్తుతం కొత్తగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ బిడ్ డాక్యుమెంట్ను న్యాయ, ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉండగా ఇప్పటికే న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్ధిక శాఖ దీనిపై పరిశీలన చేస్తోంది.. అక్కడ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ధరల సర్దుబాటు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా కారణంతో ఆలస్యం జరిగి, ధరలు పెరిగినా కాంట్రాక్టర్ వెనక్కిపోకుండా ఉండేందుకే ఇలాంటి వెసులుబాటును చేర్చామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ధరలు పెరిగితే.. అదనపు చెల్లింపులు
Published Tue, Oct 6 2015 1:13 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement