మహీంద్రా ‘కేయూవీ100’ విక్రయాలు@ 50,000 | Sakshi
Sakshi News home page

మహీంద్రా ‘కేయూవీ100’ విక్రయాలు@ 50,000

Published Sat, Apr 22 2017 12:50 AM

మహీంద్రా ‘కేయూవీ100’ విక్రయాలు@ 50,000 - Sakshi

న్యూఢిల్లీ: దేశీ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎంఅండ్‌ఎం)కు చెందిన ఎస్‌యూవీ ‘కేయూవీ100’ విక్రయాలు 50,000 యూనిట్ల మైలురాయిని అధిగమించాయి.

పోటీ అధికంగా ఉండే ఎస్‌యూవీ విభాగంలో తమ కేయూవీ100 ఉనికిని చాటుకుంటోందని, కారు ఆవిష్కరణ నుంచి చూస్తే ఇప్పటిదాకా దీని విక్రయాలు 50,288 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. కేయూవీ100 ధర రూ.4.5 లక్షలు–రూ.7 లక్షల శ్రేణిలో ఉన్నట్లు కంపెనీ ఆటోమోటివ్‌ విభాగ ప్రెసిడెంట్‌ రాజన్‌ వడెరా తెలిపారు. ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చిన డ్యూయెల్‌ టోన్‌ కేయూవీ100కి మంచి స్పందన వస్తోందన్నారు. కంపెనీ గతేడాది జనవరిలో కేయూవీ100ని మార్కెట్‌లోకి తెచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement