ప్రభావిత అంశాలు
♦ సోమవారం గ్రీసు రెఫరిండం ఫలితం
♦ గురువారం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు
♦ శుక్రవారం పారిశ్రామికోత్పత్తి డేటా
ముంబై : గ్రీసు రిఫరిండం, కార్పొరేట్ ఫలితాలు, రుతుపవనాల గమనం ఈ వారం స్టాక్ మార్కెట్ను హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే ఈ హెచ్చుతగ్గులు స్వల్పకాలమే వుంటాయని, పటిష్టమైన దేశీయ ఫండమెంటల్స్తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నందున, తదుపరి మార్కెట్ మెరుగుపడుతుందని వారన్నారు. గ్రీసు రిఫరెండం ఫలితంగా ఈ వారం ప్రథమార్థంలో సూచీలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నావ్గి చెప్పారు. తర్వాత దేశీయ అంశాలు మార్కెట్ను స్థిరపరుస్తాయని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రత్యేకించి భారత్పై గ్రీసు ఫలితం పెద్దగా ప్రభావం చూపబోదన్న ఆశాభావం మార్కెట్లో వుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు.
నిఫ్టీ రేంజ్ 8,700-8,000
గ్రీసు నుంచి సానుకూల ఫలితం వెలువడితే నిఫ్టీ 8,700 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుందని, ప్రతికూల ప్రభావం పడితే 8,000 స్థాయివరకూ తగ్గే అవకాశం వుందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ విశ్లేషించారు. గ్రీసు ఫలితం తర్వాత కార్పొరేట్ ఫలితాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వైపు ఇన్వెస్టర్ల ఆసక్తి మళ్లుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్కు ఫలితాల సీజన్ ఈ గురువారం మొదలవుతుంది. ఆ రోజున టీసీఎస్ క్యూ1 ఫలితాలు వెల్లడికానున్నాయి. జూలై 10న మే నెలకు పారిశ్రామికోత్పత్తి డేటా వెలువడుతుంది. అలాగే ఈ నెలలో రుతుపవనాల గమనం కూడా మార్కెట్కు కీలకమని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. జూలైలో వర్షపాతం తక్కువగా వుంటుందని వాతావరణ శాఖ అంచనావేయగా, సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ పేర్కొంది.
గతవారం మార్కెట్
ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్ల ఊతంతో బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా మూడోవారం పెరిగింది. గతవారం 281 పాయింట్ల పెరుగుదలతో 28,093 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, కోల్ ఇండియా తదితర షేర్లు సెన్సెక్స్ పెరుగుదలకు దోహదపడ్డాయి.
భారీ ఒడిదుడుకులు!
Published Mon, Jul 6 2015 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement